Wednesday, 25 January 2023

నేలకొండపల్లిలో ఘనంగా భక్తగ్రేసరుడు రామదాసు జయంతి వేడుక...


ఖమ్మం, జనవరి 25: శ్రీరాముని అపర భక్త గ్రేసరుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా పాలనా యంత్రాంగం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, స్థానిక భక్తరామదాసు కళాపీఠం ఆధ్వర్యంలో నేలకొండపల్లి లో  స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వేద పండితులచే చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. భక్త రామదాసు విగ్రహంపై నిర్మించిన మండవ గోపురంపై కలశం ప్రతిష్ట, సంప్రోక్షణ, తీర్థ ప్రసాదాలు, మాలాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భక్త రామదాసు జన్మ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ నిధులు రూ. 10 కోట్లలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 3 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
     కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ తదితర పనులు రూ. 75 లధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని అపర భక్తాగ్రేసరుడైన భక్తరామదాసు చరిత్రను రానున్న తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. ధ్యాన మందిరంలో జరుగుతున్న ఆలయ ఆధునీకరణ పనులు సైతం నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, దోసపాటి కల్పన, స్థానిక శ్రీ భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షులు సాదు రాధాకృష్ణమూర్తి, మందిరం పూజారి రమేష్‌, సంగీత అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment