Sunday, 21 December 2025

దేశానికి కావలసింది ఉచితాలా ఊరేగింపులు కాదు... ఇటువంటి సౌకర్యం...

భారతదేశానికి కావలసింది ఉచితాలా ఊరేగింపులు కాదు వృద్ధుల సౌకర్యార్థం ఇటువంటి ఆవాసాలు ..సేవలు..
ఈ రోజుల్లో ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలు చూసి మనం బెంబేలెత్తిపోతుంటాం. కానీ, మీరు కచ్చితంగా ఈ జర్మన్ గ్రామం గురించి తెలుసుకోవాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రశాంతమైన, పచ్చని తీగలతో నిండిన అందమైన ఇళ్లు ఏదో సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. ఇది జర్మనీలోని 'ఫుగ్గేరే' (Fuggerei). దీనికి ఒక చాలా ప్రత్యేకమైన, ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటికీ వాడుకలో ఉన్న అత్యంత పురాతనమైన సోషల్ హౌసింగ్ కాంప్లెక్స్.

ఇక్కడి అసలు విశేషం ఏమిటంటే, 1521 సంవత్సరం నుండి ఇక్కడ ఇంటి అద్దె ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అవును, మీరు విన్నది నిజమే! గత 500 సంవత్సరాలుగా ఇక్కడ నివసించడానికి ఏడాది మొత్తానికి కేవలం $1 డాలర్ (ప్రస్తుత మన కరెన్సీలో సుమారు 83 రూపాయలు) మాత్రమే అద్దె వసూలు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఫౌంటెన్ దగ్గర నిల్చున్న బామ్మగారు, బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్న వారు, కర్ర సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న తాతగారి ముఖాల్లో ఎంతటి ప్రశాంతత, నిశ్చింత ఉందో గమనించారా?
ఆర్థిక పరమైన చింతలు లేకుండా, ఒకరికొకరు తోడుగా ప్రశాంతమైన శేష జీవితాన్ని గడపడానికి ఈ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణ. ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో, మానవతా దృక్పథంతో పేదల కోసం, ముఖ్యంగా వృద్ధుల కోసం ఇలాంటి ఒక వ్యవస్థ కొన్ని శతాబ్దాలుగా విజయవంతంగా నడుస్తుండటం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఇది కేవలం ఇళ్లు మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప ఆసరా. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ప్రపంచంలో ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో కదా!

ఈ చారిత్రక గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి.

Saturday, 6 December 2025

..సత్తుపల్లి వన్యప్రాణుల అక్రమ వేట కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్ : జిల్లా ఫారెస్ట్ అధికారి వెల్లడి


సత్తుపల్లి అర్బన్ పార్క్ పరిధిలో ఇటివలే జరిగిన వన్యప్రాణుల అక్రమ వేట కేసు నేపథ్యంలో ఈ కేసు పురోగతిపై. DFO కీలక వివరాలను వెల్లడించారు.
ఆపరేషన్ వివరాలు మరియు అరెస్టులు సుదీర్ఘ గాలింపు చర్యలు, నిరంతర నిఘా, ప్రత్యేక బృందాల సమన్వయంతో ఈ కేసులో ప్రధాన నిందితులైన మెచ్చ రాఘు, కుంజా భారత్‌లను అటవీశాఖ–జిల్లా టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేసిందని. 
ఖమ్మం జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్, IFS 
అన్నారు. ఖమ్మంలోని జిల్లా అటవీ కాంప్లెక్స్ నందు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరెస్టు అనంతరం నిందితులను సత్తుపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని 16.12.2025 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు, నిందితులపై Telangana Forest Act, 1967, Wild Life (Protection) Act, 1972 మరియు Arms Act, 1959లలోని సంబంధిత నిబంధనల కింద కఠిన కేసులు నమోదు చేయబడ్డాయని DFO గారు పేర్కొన్నరు 
అడవి జంతువుల వేట, వన్యప్రాణుల హానీ, అక్రమ ఆయుధ వినియోగంపై శూన్య సహన విధానంతో కొనసాగుతున్నామని ఆయన వివరించారు. భవిష్యత్తు కార్యాచరణ ఇలాంటి అక్రమ వేట ఘటనలను నిరోధించడానికి జిల్లాలో పహారా వ్యవస్థను బలోపేతం చేయడం, రహస్య సమాచార సేకరణను విస్తరించడం, సున్నిత ప్రాంతాల్లో లక్ష్యిత ప్రత్యేక దాడులు నిర్వహించడం వంటి చర్యలను మరింత దృఢంగా అమలు చేయనున్నట్టు అటవీశాఖ ప్రకటించింది.
మీడియాకు ధన్యవాదాలు
“వన్యప్రాణి సంరక్షణ, అటవీ రక్షణ, ప్రజలలో అవగాహన పెంపు కోసం ఖమ్మం అటవీ విభాగం చేపడుతున్న చర్యలను సమాజానికి చేరివేయడంలో మీడియా భూమిక అత్యంత ముఖ్యమైనది. ఖచ్చితమైన సమాచారం, బాధ్యతాయుతమైన ప్రచారం ద్వారా మీరు అందిస్తున్న సహకారం అమూల్యం; ఈ మద్దతు ఇదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాను” అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్, IFS గారు మీడియా సమావేశంలో తెలిపారు.

: *ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లో  పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ పోలీసులు*
ఇండిగో విమానాల రద్దు, అంతరాయులపై ప్రయాణికులలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ బి.రాజేష్, అదనపు డీసీపీ కె.పూర్ణచందర్ రావు, ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, ఆర్జీఐఏ ఔట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఈరోజు (05.12.2025) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
ఇండిగో విమానాల రద్దు, విమాన  కార్యకలాపాల్లో వచ్చిన అంతరాయాలపై అధికారులు ఇండిగో రీజినల్ మేనేజర్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. సమస్యను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించే లా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సాధారణ సేవలు పునరుద్ధరించనున్నామని రీజినల్ మేనేజర్ డీసీపీకి వివరించారు.
అనంతరం డిసిపి సిబ్బందితో కలిసి ఇండిగో చెకిన్ కౌంటర్లు, డిపార్చర్ జోన్, బోర్డింగ్ గేట్లు, బస్ గేట్లను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది నియామకాలను సమీక్షించి ప్రస్తుత పరిస్థితి పై ఆరా తీశారు.ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా, పీక్ అవర్స్‌లో, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జిఐఏ అవుట్ పోస్ట్ ఇన్ స్పెక్టర్ సంపతి కనకయ్య ను ఆదేశించారు.
సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డిసిపి తెలిపారు.

: *మహిళలు, చిన్నారుల రక్షణకై..*
*సదా మీ సేవలో..మీ సైబరాబాద్ పోలీస్*
మహిళలు చిన్నారుల భద్రతకు సైబరాబాద్  విమెన్ అండ్ చిల్డ్రన్  సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన పర్యవేక్షణలో  29.11.2025 నుంచి  05.12.2025 వరకు అనేక చర్యలు చేపట్టారు.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 8  మంది సెక్స్ వర్కర్లు, 11 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. 4 పిటా కేసులు నమోదు చేశారు. ముగ్గురు బాధితులను పోలీసులు రక్షించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.షీ టీం బృందాలు ఈ వారం మొత్తం 152 డెకాయ్ ఆపరేషన్లు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 51 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మహిళల నుండి అందిన 15 ఫిర్యాదులను స్వీకరించారు.ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ / సీడిఇడబ్ల్యూ కేంద్రాలు భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో  31 కుటుంబాలను తిరిగి కలిపి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు.సైబరాబాద్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం బృందాలు ఈ వారంలో  112 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.మహిళల హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100, నేరాలు 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.

*19 arrests in cyber Crime: Cyberabad Police*
*Cybercrime Crackdown: 05 cases Detected, 19Arrests Across various States in the month of November26/11/2025 to December 02/12/2025by CybercrimePolice,
  *5th, December 2025.*
The Cybercrime Police, Cyberabad, successfully detected 05 cybercrime cases for the weekof November26/11/2025 to December 02/12/2025, leading to the arrest of 19 offenders across multiple States. The investigation revealed the pan-India spread of cybercriminal networks, with offenders from different states.

*Key Highlights:*
• Out of the 19 arrests, 9 were linked to Trading Fraud.

*Refunds:*
Cyber Crime PS, Cyberabad successfully processed and obtained93refund orders in39cases from Hon’ble Courtfor an amount of Rs.47,14,805 /- to be refunded to victims. 

*Important case of this week: Cyberabad Police Crack Trading Scam; ₹81.55 Lakhs Cheated from an IT employee— Two Accused Arrested

*Case Details: The complainant stated that he was added to a WhatsApp group through a shared link and was induced to download a fraudulent trading platform. After creating an account, he was misled by coordinated conversations in the group, where members posed as successful investors and repeatedly praised a self-proclaimed trading analyst to gain his confidence. Initial small investments reflected fake profits on the trading app, after which the administrators pushed him to invest in IPO subscriptions, upper-circuit trades, and block trades. They falsely claimed that funds were “temporarily frozen” and demanded further deposits to release them. Believing this, the victim continued to transfer money, even borrowing from friends and taking loans. He ultimately paid ₹81,55,000/- to various bank accounts and UPI IDs shared by the group. When he attempted to withdraw, he was told to pay an additional ₹35,00,000/- as service charges. The accused returned only ₹500/-, after which the victim realised the platform was forged and he had been cheated.

*Modus Operandi: Creation of a Fake Trading Platform Fraudsters developed a faketrading platform and a WhatsApp group posing as a legitimate trading community to lure the victim.Trust Building Through Group Manipulation. Coordinated members posted fabricated profits, positive reviews, and promoted a fake “trading analyst,” gradually convincing the victim of the platform’s authenticity.
• Induced High-Value Investments Using Fake IPO Schemes Victim was pushed into depositing large amounts for supposed IPO allocations and block trades, with claims that funds were “frozen” and required additional deposits for release.
• Withdrawal Blocked & Additional Charges Demanded
When the victim attempted to withdraw, fraudsters demanded an extra ₹35 lakhs as processing fees, after which communication became evasive, exposing the fraud.
*Arrests : Acting on credible intelligence, investigation team conducted operations in Maharastra, and apprehended the following 2 accused:
1. Swapnil Rajesh Ghasing
2. Tejas Rajesh Bankar

*Advisory to the Public:*
• Do not trust investment links, trading apps, or WhatsApp groups claiming guaranteed profits.
• Verify any trading platform only through official SEBI-registered brokers and authorised website.
• Never transfer money for IPOs, “frozen funds,” or processing charges demanded by online groups.
• Avoid sharing bank details, passwords, or OTPs with unknown persons or Telegram/WhatsApp admins.
• If cheated or suspicious, immediately call the National Cyber Crime Helpline 1930 and report to the Cyber Crime Police.

@ Mani kumar Kommamuru  
📱 9032075966

Saturday, 29 November 2025

డెంటల్ డాక్టర్ పై సైబర్ వాళ్ళ 14 కోట్లు హాంఫట్


హైదరాబాద్‌: హబ్సిగూడలో డెంటల్‌ డాక్టర్‌  సైబర్ మోసగాళ్ల చేతుల్లో రూ.14 కోట్లు  రూపాయలు కోల్పోయారు.. ఫేస్‌బుక్‌లో మౌనిక పేరుతో మెసేంజర్‌కి రియాక్ట్‌ అయిన డాక్టర్.. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన మౌనిక..మాయమాటలతో డాక్టర్‌ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన మౌనిక.. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్‌ అకౌంట్‌ ఓపన్‌ చేయించి.. 
లావాదేవీలు నిర్వహించి లాభాలు చూపెట్టిన మౌనిక.. 
డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌ చెల్లించాలని నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ ఆవేదన.
***********************************************
*ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్మ్యూల్ అకౌంట్ & సిమ్ సప్లై రాకెట్‌లో గుట్టురట్టు....* *ఆరుగురు నిందితుల అరెస్ట్...*
మెట్రో న్యూస్ క్రైమ్ ప్రతినిధి, సైబరాబాద్:
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, బహిరంగంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు సహకరిస్తున్న, బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్స్ మరియు సిమ్ కార్డులు సరఫరా చేసే ఒక వ్యవస్థీకృత సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌లో భాగమైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ పలు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS) Sections 318(4), 319(2), 336(3), 338, 340(2) r/w Section 3(5) అలాగే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66-D కింద రిజిస్టర్ చేయబడింది.మోడస్ ఆపరెండీ (నేర పద్ధతి)అప్పగించబడిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులను నేరస్థులు ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నడపడానికి ఉపయోగించారు. బాధితులకు నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు, డ్యాష్‌బోర్డ్‌లు చూపించి, భారీ మొత్తాలు మ్యూల్ అకౌంట్లలో జమ చేయించారు. ఈ అకౌంట్ల ద్వారా భారీ మొత్తాల మనీ ట్రాఫికింగ్ జరిపి, కమీషన్ ద్వారా లాభాలు పొందారు.
అరెస్ట్ అయిన వ్యక్తులు..వెనిగల్ల శ్రీనివాసరావు, 52 ఏళ్లు, NTR జిల్లా, చిట్ట గణేష్, 45 ఏళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా, గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి, 33 ఏళ్లు, అనంతపురం జిల్లా, సత్తూరి రాజేష్, 41 ఏళ్లు, మెడ్చల్ జిల్లా మడ్డిరల్ల సుధీర్, 50 ఏళ్లు, కృష్ణా జిల్లా
మొహమ్మద్ అష్రఫ్, 39 ఏళ్లు, హైదరాబాద్ 
 వివరాలు
వెనిగల్ల శ్రీనివాసరావు, చిట్ట గణేష్ – బ్యాంక్ అకౌంట్లు మరియు సిమ్ కార్డులు సేకరించేవారు.
గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి – అకౌంట్ హోల్డర్లను గుర్తించి, డాక్యుమెంటేషన్ నిర్వహించేవారు.
సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణలో 60 చెక్ లీఫ్ ఇమేజ్‌లు, దేశవ్యాప్తంగా 400 సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
బాధితుల ఆర్థిక నష్టం: ₹1,09,50,000/-
సీజ్ చేసిన వస్తువులు..
7 మొబైల్ ఫోన్లు
3 చెక్ బుక్స్
11 సిమ్ కార్డులు
దర్యాప్తు స్థితి..
అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీస్ కస్టడీకి తీసుకుని, కేసు తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఇంకా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనులు కొనసాగుతున్నాయి.
కేసును ఇన్‌స్పెక్టర్ జి. విజయ్ కుమార్,ఇన్‌స్పెక్టర్లు దుర్గ, డి. పళవెల్లి, సందీప్,సీసీపీ ఎస్ సిబ్బంది..
ఏసీపీ (సైబర్ క్రైమ్స్) ఎ. రవీంద్ర రెడ్డి డి.ఎస్.పి పర్యవేక్షణలో,
 డి.సి.పి (సైబర్ క్రైమ్స్) వై.వి.ఎస్. సుదీందర్  పర్యవేక్షణలో చేస్తున్నారు..
********************************************** *ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్.. ఆ హక్కు మీకు లేదంటూ..*
**********************************************
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి.రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు పద్ధతుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులుగా.. సొంత మొబైల్ ఫోన్లతో వాహనాల ఫోటోలు తీసి చలాన్లు జారీ చేస్తున్నారు. తనపై కూడా ఇలాగే మూడు చలాన్లు విధించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లు లేదా ధృవీకరించబడని పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చెల్లవని, ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేయాలని పిటిషనర్ వాదించారు.చట్టబద్ధత లేని పద్ధతిలో చలాన్లు వేయడం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం.. న్యాయ పర్యవేక్షణ లేకుండా డబ్బు వసూలు చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని.. క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లు లేదా ఇన్‌స్పెక్టర్లకు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టం చేశారు. ఈ రిట్ పిటిషన్ 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) నెం. 108ని కూడా సవాలు చేసింది. ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి, కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది.
అయితే ఈ జీవో 108 చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం , ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది అని పిటిషనర్ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్, పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోం శాఖ తరపున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరుకాగా.. జస్టిస్ మాధవి దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక దాఖలు చేయడానికి రాష్ట్ర హోం శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లోని భయం బలహీనపడి, మరింత ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది.
***********************************************
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నిజాంపేట్ రోడ్డు బ్రాంచ్ వారు నిర్వహించిన "ఫిట్ ఇండియా మూవ్మెంట్" 2K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్కూల్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి,  కిందికుంట పార్క్ వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే 2K రన్ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి కార్యక్రమం. ఈ కార్యక్ర లో లోమం ద్వారా విద్యార్థులు వ్యాయామానికి అలవాటు పడతారు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రేరణ పొందుతారు. అలాగే, క్రమం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం వంటి విలువలు నేర్చుకుంటారు. పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలానే ఇలాంటి మంచి కార్యక్రమం పాఠశాలల్లో పిల్లల్లు తల్లిదండ్రుల సమక్షంలో చేసిన శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ AGM శివరామకృష్ణ, RI పద్మజా, RI శ్రీనివాస రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మురళి కృష్ణ, ప్రిన్సిపల్ సిందూష, డీన్ సునీల్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
 *తిరుమలలో రికార్డు స్థాయిలో నమోదు*
------------------------------------------------------------------
వైకుంఠ ద్వార దర్శనం – eDIP
eDIP వ్యవస్థలో ఇప్పటివరకు 6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మొత్తం 15.50 లక్షల సభ్యులు (1+3) చేరుకున్నారు.
TTD ఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
1.76 లక్షల స్లోటెడ్ టోకెన్లు మూడు రోజుల పాటు ఎంపికైన భక్తులకు జారీ చేయబడతాయి.
ప్లాట్‌ఫారమ్‌ వారీగా రిజిస్ట్రేషన్లు 📱💻
👉 మొబైల్ యాప్: 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు (8.51 లక్షల సభ్యులు)
👉 వెబ్‌సైట్: 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు (5.75 లక్షల సభ్యులు)
👉 వాట్సాప్: 39 వేల రిజిస్ట్రేషన్లు (98 వేల సభ్యులు)
e-DIP రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

------------------------------------------------------------------
*24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు* 
**220 కోట్లతో త్రాగునీటి పనులు*
**నగరాన్ని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
**ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*
------------------------------------------------------------------
ఖమ్మం :ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రివర్యులు, శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.కార్పొరేటర్లు, ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు.   అమృత్ పథకం క్రింద ఖమ్మం మున్సిపాలిటీకి 220 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చేపట్టాల్సిన పనుల యొక్క డిపిఆర్ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అమృత్ పనులకు టెండర్ పిలిచి రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేయాలని, నగర వ్యాప్తంగా 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో డ్రైయిన్ నిర్మాణం కోసం మరో 200 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం ఖిల్లాకు రోప్ వే సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, లకారం ప్రక్కన శిల్పారామం నిర్మిస్తున్నామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు చేపట్టామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
*భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి, చేపట్టవలసిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం‌ : ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 
శనివారం భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. కళాక్షేత్రం మొత్తం కలియతిరుగుతూ చేయవలసిన పనులను పరిశీలించారు. కళా క్షేత్రంలో చేపట్టవలసిన ఆధునీకరణ పనులపై టాప్ ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్, పార్కింగ్, కలర్ వాష్, పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కల పెంపు, నిర్వాహణ, మరమ్మత్తు పనులపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* కళలకు, కళాకారులకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ఆకర్షణీయంగా తయారు చేయడం, సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగు పర్చడం, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు, గోడలకు సంప్రదాయక వాల్ పెయిటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, టాప్ ప్రూఫ్ వాటర్ లీకేజీ, కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరికి చర్యలు, పూర్తి స్థాయి మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం, కళాక్షేత్రంలో ఏసి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, వెనుక ఉన్న ప్రేక్షకులకు డయాస్ స్పష్టంగా కనిపించేలా రూపొందిచాలని అన్నారు. కళాక్షేత్రం సౌండ్ ప్రూఫ్, లోపల ఆడియో మైక్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేజీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు.ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడల్ డిజైన్ మ్యాప్ లు, ఆర్కిటెక్చర్ రూపొందించి నమూనా వీడియోను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు సైదులు,  మునిసిపల్ డిఇ ధరణి కుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*కటుదిట్టమైన ఏర్పాట్లతో గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ... సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు*
ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించండి : 
ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ
ఖమ్మం : ఎన్నికల నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉంటూ విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు.
శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు. చిమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటపాడు, చిమ్మపూడి, కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, కోయచెలక, శివాయిగూడెం  గ్రామాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా *సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ* ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశం సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్  అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉండాలని అన్నారు. సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ క్రింద  కేటగిరి వారిగా  చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన కర పత్రాలు, గోడపత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు అవగాహకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని,  ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, లింగనాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
Another Indian Air Force IL-76 aircraft lands in Colombo with:
➡️9 Tons Relief Material 
➡️2 Urban Search & Rescue Teams comprising 80 National Disaster Response Force Personnel
A total of around 27 tons of relief material delivered by air and sea. More is on the way!

Wednesday, 26 November 2025

పది రూపాయల బిక్ష... 10 లక్షలు దానం చేసిన రజినీకాంత్...

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు పది రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.   ప్రముఖ వైద్యురాలు గాయత్రీ శ్రీకాంత్ గారు రజనీ కాంత్ పై రాసిన పుస్తకంలో  ఈ విషయం వెలుగు చూసింది.  రజనీ కాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట , దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్థంబం వద్ద కూర్చున్నారట.   రజనీ తన సాధారణ గెటప్ లో పంచె , చెరిగిన జుట్టు , మాసిన గెడ్డంతో అక్కడ కూర్చున్నారు.
అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ , ఆయనను భిక్షగాడు అనుకొని రజనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు దానం చేసింది.   ఈ సంఘటనకు రజనీ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట. అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి,   “ ఆయనను ఎవరనుకుంటాన్నావ్........? అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలుపెట్టారట. దానితో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ , రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట.  దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ,  ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ ,  తాను సూపర్ స్టార్ ను కాను ,కేవలం సామాన్యుడినే అని  ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చి ,  ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి  ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్.  హ్యాట్సాఫ్ టు రజనీ కాంత్.
సేకరణ: సోషల్ మీడియా.

Thursday, 20 November 2025

దర్యాప్తులో సిపిఎం జోక్యం ఉండబోదు. పద్మ కుమార్ అరెస్టుపై కేరళ సిపిఎం స్పందన..

శబరిమలైలో  బంగారం ఛోరిలో దర్యాప్తులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది శబరిమలై అయ్యప్ప ఆలయం.. ట్రావన్కూర్ దేవస్థానం బోర్డు  మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేయడంతో శబరిమల బంగారు దొంగతనం కేసు కీలక మలుపు తిరిగింది.- ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ అరెస్టుతో శబరిమల బంగారు దొంగతనం కేసు మలుపు తిరిగింది.- శబరిమల ఆలయం నుండి బంగారం  మాయం అయినా కేసులో దర్యాప్తు బృందం (SIT)  దర్యాప్తులో భాగంగా  ఈ అరెస్టు జరిగింది.
- దొంగతనం దరిమిలా ఉన్న సంఘటనలను బెరిజు వేసుకున్న సీటు SIT పద్మకుమార్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఆలయ భద్రత విశ్వాసంపై దాని ప్రభావం కారణంగా 
ఈ కేసు గణనీయమైన ప్రజా దృష్టిని ఆకర్షించింది.
 #శబరిమల #గోల్డ్‌థెఫ్ట్ కేసు దర్యాప్తులో పార్టీ జోక్యం చేసుకోదని #CPM రాష్ట్ర కార్యదర్శి M.V గోవిందన్ అన్నారు.దర్యాప్తు బృందానికి ఎవరినైనా ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి పూర్తి అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అంటే నేరం అని అర్థం కాదని, దీనిని కోర్టు మాత్రమే నిర్ణయించగలదని నొక్కి చెప్పారు.సీపీఎం పతనంతిట్ట జిల్లా కార్యదర్శి రాజు అబ్రహం కూడా ఇదే విషయం వెల్లడించారు.సీపీఎం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ జిల్లా కమిటీ సభ్యుడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన అరెస్టు పార్టీలో ఆందోళనను సృష్టించింది.
మణికుమార్ కొమ్మమూరు, మోబైల్: 9032075966.

Monday, 17 November 2025

మక్కా యాత్రికుల బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి...

మక్కా యత్రకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. దాదాపు 42 మంది ప్రయాణికులు మృతి చెందినట్లుగా పేర్కొంటున్నారు.. ముఖ్యంగా అందులో 11 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం.
                                     --------
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని వస్తున్న ప్రాథమిక సమాచారంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి  పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో  మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
+91 79979 59754
+91 99129 19545

Saudi Arabia Bus Accident
Control Room Numbers:
📞 +91 79979 59754
📞 +91 99129 19545
-------------
Chief Minister A. Revanth Reddy has expressed deep shock over the tragic bus accident in Saudi Arabia involving Indian pilgrims. Initial reports indicate that the accident occurred while the passengers, including residents of Hyderabad, were travelling from Mecca to Medina.The Chief Minister immediately directed the Chief Secretary and the DGP to obtain full details of the incident. He also instructed officials to coordinate with the Ministry of External Affairs and the Saudi Embassy to ensure prompt relief measures for the affected.Chief Secretary K. Ramakrishna Rao contacted Coordination Secretary Gaurav Uppal in Delhi and provided necessary guidance to facilitate immediate assistance. A control room has been established at the Telangana Secretariat to keep the families and relatives informed and to monitor ongoing relief efforts.
A spiritual journey turned into a nightmare early Monday when a bus carrying Indian Umrah pilgrims from Mecca to Madinah collided with a diesel tanker. The crash, followed by a massive fire, has left at least 42 people feared dead. Initial reports indicate that many passengers on the bus were women and children from Hyderabad. Unofficial information suggests 11 women and 10 children may be among the dead, though officials are still verifying exact numbers.

Sunday, 16 November 2025

మీడియాకు స్వచ్ఛంద ప్రెస్ కౌన్సిల్ వుండాలి : సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంతఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి  సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్టప్రయోగాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసారు. వర్కింగ్ జర్నలిస్టులు, 
వార్తా పత్రికలు, చట్టాలు ఏలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ సూచనల మేరకు దేశంలో మొదటి ప్రెస్ కమీషన్ తోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనావాయితిగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆందరం ఒకే వేదికపె కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా అందరికి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.కొన్ని పత్రికలు, ఛానాల్స్ యాజమాన్యాలు మీడియా చట్టాలు, నైతిక నియామావళిని పాటించకపోవడం వలన, తప్పుడు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల మీడియా మొత్తాన్ని దూషిస్తున్నారు. దీనిని అరికట్టాలంటే మీడియా సంస్థలు, సంఘాలు అన్ని ఒక తాటిపై వచ్చి మనపై ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా నియంత్రణకు చట్ట పరంగా సరియైన మార్గదర్శకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం తరుపున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఇండియా మార్చే విధంగా అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అకాడమి కృషి చేయాలన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రెస్ కౌన్సిల్ కు పాలక వర్గాన్ని నియమించలేదని,  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీని ద్వారా పత్రికా స్వెచ్ఛ, నైతికత, జవాబుదారితనం, బాధ్యతలు మొదలగునవి పర్యవేక్షిస్తూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తప్పు చేస్తే మీడియాపై చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్, మాజీద్, బసవ పున్నయ్య, రమణారావు, రంగసాయి, యూసుఫ్ బాబు, రమణ కుమార్,  సువర్ణ, తదితరులు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి తమ సూచనలు, సలహాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ అధ్యక్షత వహించగా, జాయింట్ డైరెక్టర్ కే. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 15 November 2025

వ్యాపారి - రాజు కథ.... లక్ష్యం నిర్దేశించుకుంటేనే సోమరితనం పోతుంది..

ఒకప్పుడు ఒక రాజుకి  ఒక గుర్రపు వ్యాపారితో  స్నేహం ఏర్పడింది. 
ఆ వ్యాపారి రాజు కోసం ఉత్తమమైన గుర్రాలను తీసుకువచ్చేవాడు, అతను తెచ్చిన గుర్రాలు చాలా ఆరోగ్యంగా, చురుకైనవిగా ఉండటం వల్ల, రాజు హృదయం ఆనందంతో నిండిపోయేది. 
వాటన్నింటినీ ఎంత ధర వెచ్చించయినా కొనేవాడు. చాలా సార్లు, వ్యాపారి రాజుకు చాలా ఖరీదైన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చేవాడు. రాజు కూడా దానిని నిరభ్యంతరంగా స్వీకరించేవాడు.
వారిరువురి మధ్య చాలా మధురమైన, సన్నిహితమైన స్నేహం ఉండేది, రాజు తన స్నేహితుడితో ఎన్నడూ తాను ఒక దేశానికి రాజన్న హోదాలో ప్రవర్తించేవాడు కాదు. వ్యాపారి కూడా రాజును తనకంటే ఉన్నతమైన వాడని భావించి అతనితో మాట్లాడేవాడు కాదు. ఇద్దరికీ ఒకరికొకరంటే చాలా గౌరవం, ప్రేమ ఉండేది.

కాలక్రమంలో, వ్యాపారి డబ్బును కోల్పోవడం ప్రారంభించాడు. అతను తన గుర్రాలకు, పెట్టిన ఖర్చు కంటే తక్కువ డబ్బు రావడం మొదలయింది. అలాగే, అతని ఖరీదైన, ఉన్నత జాతి గుర్రాలు గుర్తుతెలియని వ్యాధులతో చనిపోవడం ప్రారంభించాయి. తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. నెమ్మదిగా, అతని ఆదాయం తగ్గిపోయి, దాచుకున్న డబ్బు వ్యయం అయిపోయి, క్రమంగా బీదవాడైపోయాడు.

మొదట, అతను తన కష్టాలను రాజు నుండి దాచాడు. అయితే ఉండేందుకు ఇల్లు, పిల్లలకు రెండు పూటలా భోజనానికి కూడా కష్టమైపోవడంతో భార్య కోరిక మేరకు రాజాస్థానానికి వెళ్లాడు.

తన కష్టాలను రాజుకు తెలియజేసి, కొంత డబ్బు సహాయం చేయమని అడిగాడు కానీ, రాజును సహాయం అడగవలసివస్తున్నందుకు వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు.

వ్యాపారి చెప్పేది ఓపికగా, శ్రద్ధగా విన్న రాజు, "మిత్రమా, నీవు ఏ పని చేయగలవు?" అని వ్యాపారిని అడిగాడు.

వ్యాపారి కాసేపు ఆలోచించి, "నేను నా జీవితమంతా గుర్రపు పని మాత్రమే చేసాను, కానీ చాలా కాలం క్రితం కొరడాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. బహుశా, అది చేయగలగుతానేమో", అన్నాడు.

రాజు కొంచెం ఆలోచించి, కోశాధికారితో, "నా స్నేహితుడికి 500 నాణేలు ఇవ్వండి. అతను ఎప్పుడు వచ్చినా కారణం అడగకుండా 500 నాణేలు ఇవ్వాలి", అని ఆజ్ఞాపించాడు. రాజు మాటలు విన్న వ్యాపారి 500 నాణేలు సరిపోవని, ఇబ్బందిగా అనిపించినా చిరునవ్వుతో రాజు సహాయాన్ని స్వీకరించాడు.

కాలం గడుస్తూ ఉంది. వ్యాపారి వచ్చినప్పుడల్లా, కోశాధికారి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అతనికి 500 నాణేలు ఇచ్చేవాడు. వ్యాపారి కూడా తన వంతు ప్రయత్నంగా, పూర్తి అంకితభావంతో కొరడాలను తయారుచేసేవాడు. కానీ ఏదో ఒక లోపం, లేదా ఏదో ఒక కారణంగా తరచుగా అతను పెట్టిన ఖర్చు కంటే తక్కువ పొందేవాడు. అదృష్టవశాత్తూ, రాజు చేస్తున్న సహాయంతో, ఇప్పుడు అతను తన కుటుంబానికి ఆహారం సమకూర్చడంలో ఎటువంటి ఇబ్బంది పడట్లేదు. కొన్ని నెలలు గడిచినా వ్యాపారి పట్టువదల్లేదు. అతను కొరడాలను తయారు చేయడంలో మరింత కష్టపడుతూ, విక్రయించడంలో మరింత శ్రద్ధపెడుతూ పనిచేశాడు. ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాడు.

క్రమంగా, వ్యాపారి నిష్ణాతుడయ్యాడు, నైపుణ్యత సాధించాడు. అతని కొరడాలు మునుపటి కంటే చాలా చక్కగా తయారవుతున్నాయి. ఇప్పుడు కొంత లాభం రావడం కూడా మొదలయింది. మళ్లీ తన ఇల్లు అమర్చుకునే ఏర్పాట్లు మొదలుపెట్టాడు.

కాలక్రమేణా కావల్సినంత డబ్బు కూడబెట్టిన తర్వాత, ఒక స్నేహితుడిగా రాజు తనకు డబ్బు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు తన పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉండడం వలన, రాజుకు ఆ డబ్బు కొద్ది, కొద్దిగా తిరిగి చెల్లించేయాలని అనుకున్నాడు.

అతను 500 నాణేలు తీసుకుని కోశాధికారి వద్దకు వెళ్లి, "దయచేసి ఈ నాణేలను మీ కోశాధికారంలో జమ చేయండి" అని అభ్యర్థించాడు. కోశాధికారి చేతులు జోడించి నిరాకరించాడు. " మీకు 500 నాణేలు ఇవ్వమని మాత్రమే నాకు ఆజ్ఞ ఉంది; మీ నుండి డబ్బు తీసుకునే హక్కు నాకు లేదు ఎందుకంటే అలాంటి ఆజ్ఞ నాకు ఇవ్వలేదు. మీకు కావాలంటే ఇక్కడ నుండి ఇంకొంత డబ్బు తీసుకోండి, కానీ మీరు ఇచ్చిన ఈ మొత్తాన్ని తీసుకుని జమ చేసుకోలేను"అన్నాడు.

ఇది విన్న వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఆ నాణేలతో రాజాస్థానం చేరుకుని వాటిని రాజుకు ఇచ్చి, "మహారాజా, మీ దయతో ఇప్పుడు నా వ్యాపారం బాగా జరుగుతోంది! ఇప్పుడు నేను మీ నుండి అప్పుగా తీసుకున్న డబ్బును కొద్ది కొద్దిగా తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, కానీ కోశాధికారి దానిని అంగీకరించడం లేదు", అన్నాడు.

అది విన్న రాజు చిరునవ్వు నవ్వి కోశాధికారితో ఇలా అన్నాడు: "ఇప్పుడు నా ఈ స్నేహితుడు నీ దగ్గరకు వచ్చి ఎంత డబ్బు అడిగినా, ఎలాంటి లెక్కా వేయకుండా, ఎలాంటి ఖాతా పెట్టకుండా తక్షణమే అతనికి ఇవ్వు." అని మళ్ళీ అన్నాడు.

రాజు అన్న ఈ మాటలు విని వ్యాపారి చాలా చాలా ఆశ్చర్యపోయాడు. అతను ముకుళిత హస్తాలతో ఇలా అడిగాడు, "మహాప్రభూ, నా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పుడు, నేను మీ సహాయం కోసం వచ్చాను, మీరు నాకు చాలా తక్కువైనా, నిర్ణీత మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. అప్పుడు నిజంగానే వింతగా అనిపించింది. కానీ ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, నా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటున్నాను, ఇప్పుడేమో అడిగినంత ధనాన్ని ఇవ్వమని మీరు ఆదేశిస్తున్నారు. నాకు ఎక్కువ  డబ్బు అవసరమైనప్పుడు, మీరు కేవలం చిన్న మొత్తాన్ని స్థిరంగా అందించారు. ఎందుకు అలా?"

రాజు చిరునవ్వు నవ్వి, "మిత్రమా, ఆ సమయంలో నేను నీకు చాలా డబ్బు ఇచ్చి ఉంటే, నీవు సోమరివైపోయి, పని చేయనవసరం లేదనుకుని, నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసిఉండేవాడివి. పని చేయని కారణంగా మరింత అధ్వాన్నమైన పరిస్థితికి దిగజారిపోయుండేవాడివి. కానీ నీకు పరిమితమైన మొత్తంలో డబ్బు ఇవ్వబడినప్పుడు, నీ పరిస్థితిని, మీ కుటుంబ పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి దాన్ని సరిగ్గా ఉపయోగించడం గురించి నీవు ఆలోచించావు. నీ అంతర్గత ప్రతిభను గుర్తించి, అంకితభావం, చిత్తశుద్ధితో పని చేయడం ప్రారంభించావు. నీ కుటుంబానికి అన్ని సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఉండడం వలన, నీ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటూ, అభివృద్ధి చెందడానికి ప్రయత్నించావు."

“మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతూ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నప్పుడు, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం.
 
ఇప్పుడు నువ్వు కొరడాలను తయారు చేయడంలో చాలా నైపుణ్యాన్ని సాధించావు, ఇప్పుడు నీ వ్యాపారం బాగా సాగుతోంది...ఈ సమయంలో నీ వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే, నీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి నీకు సరైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా నీ కష్టానికి సంబంధించిన పూర్తి ప్రయోజనాలను కూడా పొందుతావు", అన్నాడు, 
రాజు తన బాధలలో, కష్టాల్లో తనకు సహాయం చేయడమే కాకుండా... వాటిని అధిగమించడానికి అతనికి పుష్కలమైన అవకాశాలను ఇచ్చి, వాస్తవానికి ఒక నిజమైన స్నేహితుడి పాత్రను పోషించాడని, వ్యాపారి అర్థం చేసుకున్నాడు.
సంపూర్ణ విజయానికి బలమైన సంకల్పంతో పాటు సరైన మార్గాలు, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరం. 🌼

బాబూజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన కేంద్రం

Sunday, 9 November 2025

ఉపరాష్ట్రపతి తొలి పర్యటన కర్ణాటకలో...

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్తన తొలి పర్యటనలో  కర్ణాటక వచ్చారు. 
కర్ణాటక గవర్నర్  ధావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రి  హెచ్.డి. కుమారస్వామి ఇతర ప్రముఖులు ఆయనకు బెంగళూరులో ఘన స్వాగతం పలికారు.ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా ఆయనకు గౌరవ వందనం కూడా సమర్పించారు.

Sunday, 2 November 2025

పారేసిన కాగితం నుంచి నోట్ బుక్ .. ఈ తాతకు పిల్లలే ఫ్యాన్స్

బెంగళూరు బ్యాంక్ కాలనిలో దినపత్రిక ఏజెంట్లు తమ పత్రికల బండల్లను విడదీస్తారు.. ఈ విధంగా విడదీసే టప్పుడు కట్ట మీద పలుచటి తెల్లని రంగు పేపర్లను తీసి పక్కన పడేసి పత్రికలను అమర్చుతారు.
అక్కడకు వయోవృద్ధుడైన ఒక వ్యక్తి వచ్చి క్రింద పడేసిన అన్ని తెల్లని రంగుల పేపర్లనూ సేకరించి తీసుకువెళతారు. 
 ప్రతిరోజూ ఈ విధంగా వేస్ట్ అని పడేసిన ఈ పేపర్లను తీసుకు వెళ్లి వాటిని నోటు పుస్తకాల కొలతలకు సరిపోయేలాగ కత్తిరించి వాటి నుండి వ్రాసే నోట్ బుక్ లను తయారు చేస్తారు, అనేక నోట్ బుక్ లను తయారు చేసి వీరు మైసూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వపాఠశాలలలో పిల్లలకు ఉచితంగా పంచుతుంటారు. ఈయన కనపడితే చాలు పిల్లలు పరుగులు తీసుకుంటూ వచ్చి,, నోట్ బుక్ తాత అంటూ ముద్దాడతారు. ఈ పెద్దాయన  పేరు మోహన్. ఐ.టి.ఐ కంపెనీ ఉద్యోగి . పాఠశాల పిల్లలకు విశిష్టమైన మంచిపని చేస్తున్న ఇతడు నిజంగానే అందరికి ఆదర్శం.

Friday, 31 October 2025

జాతీయ సమైక్యత లక్ష్యం కావాలి : సిపి సునీల్ దత్


ఖమ్మం: జాతీయ సమైక్యతా ..సమరాస్య భావం అందరిలో వుండాలని..జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే రన్ ఫర్ యూనిటీ లక్ష్యం అని సీపీ సునీల్ దత్ అన్నారు భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.
కార్యక్రమంలో ఖమ్మం సి.పి సునీల్ దత్ పాల్గొన్నారు..
సత్తుపల్లిలో...
భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని జాతీయ  సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్,కల్లూరు ఏసీపీ రఘు,కల్లూరు డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సత్తుపల్లి లో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు *రన్ ఫర్ యూనిటీ* నిర్వహించారు.

Thursday, 30 October 2025

బట్టి పట్టు వద్దు.... సృజనాత్మక చదువులు నేర్పండి.... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


*బట్టిపట్టే చదువుకు స్వస్తి పలికి స్కిల్స్ పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

**నెల రోజుల పాటు ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు*

**1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంట సమయం కేటాయింపు*

*ఖమ్మం ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ప్రతి విద్యార్థి బట్టిపట్టి చదివే విధానాన్నికి స్వస్తి పలికి రీడింగ్ స్కిల్స్ పెరిగేలా ఉపాధ్యాయులు బోధన పద్దతిని మెరుగుపర్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఖమ్మం నగరం ఎన్ఎస్పీ రోడ్ లోని ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహించే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగు విద్యా భోదనను గమనించారు. రెండు, మూడవ తరగతి గదిలో విద్యార్థులను ఎలావున్నాయి రైమ్స్ అని అడిగారు. బోర్డు పై అక్షరాలను వ్రాసి వాటియొక్క ఉచ్చారణ ను విద్యార్ధులను అడిగి కలెక్టర్ సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు.  విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.  
ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగ పడుతుందని, విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలన్నారు.
30 రోజుల పాటు ప్రతి రోజు విద్యార్థి గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యాసన చేసేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బుక్ లెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. బుక్లెట్ లో ఉన్న అంశాలను తూ.చ. తప్పకుండా ఉపాధ్యాయులు ఫాలో అవుతూ పిల్లలు చదివే సామర్థ్యం పెంపొందేలా కృషి చేయాలని అన్నారు.
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ తయారు చేశామని, దీనిని యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేయడం వల్ల ఎటువంటి డాటా ఎంట్రీ అవసరం ఉండదని, ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో (అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు) అప్ డేట్ మాత్రం చేయాలని అన్నారు. ఆంగ్ల అక్షరాలను ఫోనెటిక్ సౌండ్ తో సహా నేర్పేలా  కోర్సు డిజైన్ చేశామని అన్నారు. 
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం పరిపూర్ణంగా అమలు చేయవచ్చని, నెల రోజుల తర్వాత ప్రతి విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు పాఠశాల సమయాల్లోనే ప్రాథమిక తరగతి విద్యార్థులకు అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎంఓ ప్రవీణ్, హెడ్ మాస్టర్ లు, సంబంధిత టీచర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
*#మణికుమార్ కొమ్మమూరు, మోబైల్:9032075966#*

కమాండ్ కంట్రోల్ సెంటర్ కు డిజిపి. శివధర్ రెడ్డి... డాటా సెంటర్..హెలీపాడ్‌ పరిశీలన...



*ఐసిసిసి భవనాన్ని పరిశీలించిన డిజిపి*

 హైదరాబాద్ : తెలంగాణ  డిజిపిగా బి.శివధర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని  ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి)భవనాన్ని సందర్శించారు.
 భవనంలోని వివిధ అంతస్తులను , కార్యాలయాలను పరిశీలించారు.
• 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్‌.
• ఇతర అధికారుల చాంబర్‌లు.
• 8వ అంతస్తులో గల స్టేట్ కాన్ఫరెన్స్ హాల్.
• 18వ అంతస్తులో ఉన్న హైదరాబాద్ పోలీసు కమిషనర్  కార్యాలయం.
• 19వ అంతస్తులో ఉన్న హెలిపాడ్ వంటివి పరిశీలించారు.
ఈ పర్యటనలో డిజిపి తో  పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ , డైరెక్టర్‌ ఐసిసిసి శ్రీ వి. బి. కమలాసన్ రెడ్డి,  డిసిపి  శ్రీమతి పుష్ప మరియు శ్రీమతి కె. అపూర్వా రావు డిసిపి, స్పెషల్ బ్రాంచ్ తదితరులు పాల్గొన్నారు .
"#మణికుమార్ కొమ్మమూరు, మోబైల్ : 9032075966#"

Tuesday, 28 October 2025

వెంటిలేటర్ పై ఉన్న హెచ్.సి.ఏ ను వెంటనే రద్దు చేయాలి : టీసీఏ డిమాండ్



హైదరాబాద్‌ :  వెంటిలేటర్ పై ఉన్న హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ను బీసీసీఐ రద్దు చేయాలని. తెలంగాణలో క్రికెట్  క్రీడా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టి సి ఏ కు పూర్తి బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 
హైదరాబాద్ SD రోడ్ లోని తాజ్ ట్రై స్టార్' హోటల్ లో జరిగిన  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో )  జిల్లా కమిటీల ప్రతినిధుల గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు  పాల్గోని పలు సమస్యలపై చర్చించారు.. సమావేశం అనంతరం టీసీఏ ప్రధాన కార్యదర్శి ధారం గురువా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ని పూర్తిగా రద్దు చేయాలని, బీసీసీఐ రాజ్యాంగం అలాగే జాతీయ క్రీడా పాలనా చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సభ్యత్వ గుర్తింపును టీసీఏకే ఇవ్వాలని డిమాండ్ చేశారు..హెచ్‌సీఏ చట్ట విరుద్ధంగా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ “వెంటిలేటర్‌ దశకు చేరిందని విమర్శించారు. హెచ్.సి.ఏ కు రాజ్యాంగ ఎటువంటి అనుమతి లేదని, పరిపాలనా కోరం,  
 జిల్లా స్థాయిలో ప్రతినిత్వం వంటివి లేవని
హెచ్‌సీఏ హైదరాబాద్ నగరానికి వెలుపల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేదా క్రికెట్ కార్యక్రమాలు లేకపోయినా, నకిలీ “డిస్ట్రిక్ట్ క్రికెట్ కాన్సెప్ట్”తో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీసీఏ పేర్కొంది.
హైకోర్టు నియమించిన సింగిల్ మెన్ కమిటీ ఉన్నప్పటికీ, హెచ్‌సీఏ ఎలా కొనసాగుతోందో అర్థం కావడం లేదని టీసీఏ ప్రశ్నించింది. “హెచ్‌సీఏలో ఉన్న చాలా మంది సభ్యులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని”  టీసీఏ వ్యాఖ్యానించింది.
“తెలంగాణ యువత ఇక హెచ్‌సీఏ జోక్యం భరించే  స్థితిలో లేదని ధారం గురువా రెడ్డి అన్నారు. టి సి ఎ ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపట్టిందని: జిల్లా టీసీఏ కమిటీలు  సైతం  ఆయా జిల్లాల పరిధిలో పోలీసు అధికారులకు ఫిర్యాదులు సమర్పించాయన్నారు.
గత 10 సంవత్సరాల హెచ్‌సీఏ ఆర్థిక అవకతవకల వివరాలను సిఐడికి టి సి ఏ అందజేసిందని తెలిపారు.
ప్రస్తుతం సీఐడీ విచారణలు కొనసాగుతున్నట్లు
33 జిల్లాల ప్రాతినిధ్యం కలిగిన కొత్త టీసీఏ నేతృత్వం
టీసీఏ ఇటీవల కొత్త గవర్నింగ్ బోర్డును ఎన్నుకుందని, ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాలకు సమగ్ర ప్రాతినిధ్యం కలిగిన కొత్త యాజమాన్య నిర్మాణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా టి సి ఏ   రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లను ప్రకటించింది:

1. తెలంగాణ గోల్డ్ కప్ 2025:
నవంబర్ 15, 2025న ప్రారంభం
రాష్ట్రంలోని 33 జిల్లాలు పాల్గొనే ప్రీమియర్ లీగ్ ఫార్మాట్, 5 జోన్లలో నిర్వహణ.

2. టీసీఏ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్:
డిసెంబర్ 2025లో నిర్వహణ.

 గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించడమే. లక్ష్యంగా టిసిఏ పేర్కొంది

టీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ

“బీసీసీఐ గత దశాబ్ద కాలంగా జిల్లాల స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేసిన టీసీఏ కృషిని గుర్తించాలి. హెచ్‌సీఏని పూర్తిగా రద్దు చేయాలి లేదా కేవలం హైదరాబాద్ నగర పరిమితులకే పరిమితం చేయాలి.”
“రాష్ట్ర స్థాపన ఉద్యమంలో తెలంగాణ యువత పోరాటం సమాన అవకాశాల కోసం జరిగింది. ఇప్పుడు బీసీసీఐ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి, అవినీతి చేసిన వారిని శిక్షించి, టీసీఏకి సరైన గుర్తింపు ఇవ్వాలి.”
బోర్డ్ సమావేశంలో గవర్నింగ్ సభ్యులు 
కపిలవాయి రవీందర్,
చిత్తరంజన్ కుమార్,
డాక్టర్ కూరపాటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
*Manikumar Kommamuru,  📱 9032075966*

Wednesday, 15 October 2025

కర్నూలు - ప్రధాని మోడీ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. శ్రీశైలంలో పారాహుషార్..

*
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా జరుగుతున్న “సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి,' కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ  ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఒకే బృందంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నియంత్రణ నుండి సభా ప్రాంగణం వరకు అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక. ప్రధానమంత్రి  ప్రజలతో నేరుగా మమేకమవుతారు. అందువల్ల ఈ సభను చారిత్రాత్మకంగా మార్చాలన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లి సభ విజయవంతం కావడంలో పాత్ర వహించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ప్రజల్లో ఉత్సాహం నింపి, ప్రధానమంత్రిని అద్భుత స్వాగతం పలుకుదాం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని అన్నారు.
తదుపరి, సభా ప్రాంగణం, వేదిక, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, నీటి సదుపాయం, మీడియా సౌకర్యాలు, వాలంటీర్ వ్యవస్థ వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి మరో కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తుంది. ఈ కార్యక్రమం కేవలం ఒక సభ కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి యాత్రకు నూతన దిశా నిర్దేశం చేసే ఘట్టం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ విజయవంతం కోసం అందరూ ఒకే తాటిపై నిలిచి, సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు
కాగా ప్రధాని గురువారం శ్రీశైలం సందర్శించి జ్యోతిర్లింగ స్వరూపం మల్లికార్జునస్వామికి అభిషేకం,  శక్తిపీఠం బ్రహ్మారాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఆలయం పరిసరాల్లో చేపట్టారు బుధవారం ప్రధాని ఆలయ సందర్శన సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించారు
శ్రీశైలం ఆలయం చుట్టూ మూడు గంటల పాటు అన్ని వైపులా దిగ్బంధం చేసి ప్రధాని వచ్చినప్పుడు బందోబస్తు సెక్యూరిటీ చర్యలు ఎలా ఉండాలి అనే దానిమీద మాక్ డ్రిల్ పోలీస్ శాఖ నిర్వహించింది..
@ *మణికుమార్ కొమ్మమూరు, 
*మోబైల్ : 9032075966*

Friday, 3 October 2025

తమిళనాడు గవర్నర్ సహా పలువురు ప్రముఖులకు బాంబు బెదిరింపులు


*చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్,సినీ నటి త్రిష,గవర్నర్ భవనం,రాష్ట్ర బీజేపీ కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన దుండగులు..వెంటనే అప్రమత్తమై డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేసిన పోలీసులు..ఫోన్ నెంబర్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.తమిళనాడు చెన్నై ఎయిర్పోర్ట్ 
మరియు జన సమర్థ స్థలాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది.. బెదిరింపులకు పాల్పడిన వారి ఐడీలను కనిపెట్టే పనిలో ఫైబర్ సెక్యూరిటీ విభాగం.

తిరుపతికి బాంబు బెదిరింపు‌‌... అప్రమత్తమైన యంత్రాంగం.‌..‌


తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ 
నగరంలో పలు ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు మెయిల్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటితో పాటు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జగన్ ఇంటిని  కూడా టార్గెట్ చేసినట్లు  మెయిల్ ..
వెంటనే అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు.. తిరుపతి తిరుమల తో పటు పలుచోట్ల తనిఖీలు
 నిర్వహించారు  కాగా “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట ఆపరేషన్ ప్లాన్.. చేసినట్టు మెయిల్లో సమాచారం ఉన్నట్లు తెలియ వస్తోంది..

తమిళనాడులోను పలువురు ప్రముఖులకు బాంబు బెదిరింపు

Monday, 29 September 2025

నా గమ్యం వచ్చింది...మీ సహకారం మరువలేను.. ప్రయాణికులే దేవుళ్లుగా భావించి సాగండి ..సజ్జానార్

*ఆర్టీసీతో నాలుగేళ్ళ నా ప్రయాణం ముగిసింది.*

ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు!! నేను తేది 03.09.2021 నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ చాలా క‌ష్ట‌కాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది. 

అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థను బయటికి తీసుకువచ్చేందుకు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక  నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి.. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాం. ‘కృషితో నాస్తి దుర్బిక్షం’ అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మ‌న ప్ర‌యాణం సాగిన‌ప్ప‌టికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాము.  మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశాం. పాత బస్సులను కొత్త బ‌స్సుల‌తో రిప్లేస్ చేయ‌డం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబ‌డి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్ప‌త్రిని తీర్చిదిద్దడం,  గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వ‌హ‌ణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా  మిమ్మ‌ల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాం. మీ అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను.

గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. నేను మొదట మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న, 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించి.. ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించాం. 

ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగ‌స్వాముల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000  మంది ఉద్యోగుల, వారి జీవిత భాగ‌స్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో మనం అమలు చేశాం. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశాం. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశాం. ఈ మహాయజ్ఞంలో నాతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను.  గతంలోనూ మీరే సంస్థలో విధులు నిర్వర్తించారు. అప్పుడు ఇప్పుడూ సంస్థలో ఎంత తేడా వచ్చిందో మీకు తెలియనిది కాదు. 

ఒక మహాకవి చెప్పినట్లుగా ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని, ఎదురుచూసి మోసపోకుమా’ అన్నది నిజం. సంస్థలోని ప్రతి ఉద్యోగి కూడా ఈ సంస్థ నాది అనే భావనతో శక్తివంచన లేకుండా అంకితభావంతో ప్రతి క్ష‌ణాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రయాణికులకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందినట్లైతే, సంస్థ రాబోయే కాలంలో ఎంతో వృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ‘ప్రయాణికులే మన సంస్థకు దేవుళ్లు’ అనే విషయం ఎప్పుడు మన హృదయాల్లో నాటుకుపోవాలి. ప్రయాణికుల పట్ల చాలా గౌరవంతో మెలగాలి. 
చివరగా.. ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.  భ‌విష్య‌త్‌లో నేను ఎక్క‌డ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థవ్య‌వ‌స్థ‌కు, ఈ గొప్ప సంస్థ‌కు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ..

*మీ.. వీసీ సజ్జనర్, ఐపీఎస్,*
*అదనపు డీజీపీ*

Tuesday, 23 September 2025

నిష్టతో...జాతర పనులు నిర్వహించండి : మేడారంలో సిం.ఎం.రేవంత్ రెడ్డి సూచన

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ.. మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కుంభమేళా స్థాయిలో జరిగే ఈ మహాజాతరకు జాతీయ గుర్తింపునివ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయాలని కోరారు.వచ్చే ఏడాది ప్రారంభంలో శ్రీ సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై మేడారంలో ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. అనంతరం జరిగిన సభలో సమ్మక్క, సారలమ్మ గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణ ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునర్నిర్మాణం చేపట్టే అవకాశం దక్కడంతో నా జన్మ ధన్యమైంది. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నా.
గతంలో పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష ప్రదర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ ఆనాటి పాలకులకు విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. వారేదో దాన, ధర్మమిచ్చినట్టుగా తాత్కాలిక పనులతో సరిపెట్టారు. తాను ఇక్కడి నుంచే పాదయాత్ర బయలుదేరా. ఆదివాసీలే ఈ దేశానికి మూల వాసులు. దొరల పాలనను అంతం చేసి ప్రజా పాలనకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాం. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రణాళిక అందించింది. బడుగు బలహీన వర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినప్పుడు సరిపోవని ఆదివాసీ, గిరిజన ప్రాంత వాసులు చెప్పినప్పుడు ఐటీడీఏ ప్రాంతాల్లో వారికి అదనంగా ఇండ్లు ఇచ్చాం.ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమమైనా ఆదివాసీలకు ఇవ్వాల్సిన వాటా, కోటా ఇవ్వాల్సిందే. దశాబ్దాలుగా వారికి అన్యాయం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దాలని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గద్దెలు, ప్రాంగణ అభివృద్ధి నిర్మాణం జీవితంలో వచ్చిన గొప్ప, అరుదైన అవకాశం. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడంతో జన్మ ధన్యమైంది. వాటి నిర్మాణంలో నిధుల సమస్య ఉండదు. ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నాం. సిమెంట్ కన్నా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడితే వేల ఏండ్లు ఉంటుంది. గొప్ప నగిశీలు, రాతి కట్టడాలతో రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ప్రణాళికలు వేశాం.ఈ గొప్ప కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఆదివాసీ సోదరుల కోరిక మేరకు ఈ ప్రణాళిక తీసుకొచ్చాం. వచ్చే జాతర నాటికి కార్యక్రమాలు పూర్తి కావాలంటే రాత్రింబవళ్లు ఇక్కడ పనులు జరగాలి. ఆలయ అభివృద్ధితో పాటు జంపన్న వాగు నిర్మాణం, రహదారుల నిర్మాణాలపైన కూడా సలహాలు, సూచనలు తీసుకుంటాం.రాబోయే వంద రోజులు ప్రతి వారం జిల్లా ఇంచార్జీ మంత్రి  ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి. నిష్టతో స్వామి అయ్యప్ప మాల వేసుకున్న తీరుగా సమ్మక్క సారలమ్మ మాల ధరించిన రీతిలో పనులను పర్యవేక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ఇక్కడ పర్యటిస్తా.మేడారం జాతరను ఈసారి అత్యంత అద్భుతంగా చేసుకుందాం. ఈ ఆదివాసీ కుంభమేళాను జాతీయ పండుగగా గుర్తించాలని కోరుతున్నాం. కుంభమేళాకు వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు కూడా నిధులను మంజూరు చేయాలి. అందరం కలిసి ఒక మంచి సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కష్టపడి పనిచేద్దాం..” అని పిలుపునిచ్చారు.ఈ సభలో మంత్రులు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణలోని గిరిజన ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ ప్రతినిధులు, గిరిజనులు పాల్గొన్నారు. 


*ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*



**కలెక్టరేట్ లో నిర్వహించిన బతుకమ్మ  వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*
ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మూడవ రోజు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ సతీమణితో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ  వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు.   
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం విద్యార్థినులు, వైద్య శాఖ ఉద్యోగినులు, సిబ్బంది, అందరూ పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.

Friday, 19 September 2025

*ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో జర్నలిస్టుల భేటీ*


👉 ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు...*
👉 స్టార్టప్‌లు, స్కేల్‌అప్‌లు తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోండి - మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
👉 హైదరాబాద్‌లో జరుగనున్న ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి 100కిపైగా ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొననున్నారు

*హైదరాబాద్ :  ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి‌ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల గారు కలిసి ‘పిచ్2ప్రెస్’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 27, 2025న హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జర్నలిస్టుల ముందు నేరుగా ఇన్నోవేటర్లు తమ అనుభవాలను చెప్పుకునే అవకాశం ఇది. 
పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా, *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* "స్టార్టప్‌లు ఎక్కువగా ఇన్వెస్టర్లకే ఫోకస్ చేస్తుంటారు. కానీ మీ అనుభవాలను ప్రపంచానికి చెబితేనే నిజమైన గుర్తింపు వస్తుంది. పత్రిక లేదా టీవీ కథనాలు మీ వ్యాపారాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లగలదు. అందుకే స్టార్టప్‌లు, స్కేల్‌అప్స్ తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి" అని అన్నారు. 
ఇదే సందర్భంలో, మంత్రి తన స్వగ్రామమైన మంథని నియోజకవర్గంలోని ధన్వాడ గ్రామం డిజిటల్ గ్రామంగా మారిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, డిజిథాన్ సంస్థ చేస్తున్న పనిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పిచ్2ప్రెస్ ఈవెంట్‌లో దేశం నలుమూలల నుండి 100 కంటే ఎక్కువ ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొంటున్నారు. వీరంతా టెక్నాలజీ, స్టార్టప్‌లు మరియు ఇన్నోవేషన్ కవరేజ్‌లో నిపుణులు. ఇది 100 మంది ఇన్నోవేటర్లకు తమ అనుభవాలను మీడియా ముందు నేరుగా ప్రెజెంట్ చేసే అరుదైన అవకాశం.ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ,* “పిచ్2ప్రెస్ అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇన్నోవేషన్‌కు గొంతుక ఇవ్వడం, మంచి అనుభవాల ద్వారా వ్యాపారాన్ని వేగంగా ఎదిగించడమే మా లక్ష్యం. ఒక సారీ జర్నలిస్టులకు మీ అనుభవం నచ్చితే, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించగలదు. జర్నలిస్టులు, ఇన్నోవేటర్లు ఇద్దరూ తప్పక ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలి" అన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిజిథాన్ బృంద సభ్యులు భాగ్యలక్ష్మి వాకిటి, హేమా మారం, దీపిక జోషి, తేజస్విని, నితిన్య హర్కరా మరియు ప్రకాష్ పాల్గొన్నారు.
ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే స్టార్టప్‌లు/ఇన్నోవేటర్లు
tinyurl.com/pitch2press ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు
లేదా +91 80190 77575 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sunday, 14 September 2025

మేడారానికి పోలీస్ బైక్ పై మంత్రి సీతక్క...

ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్,  మంత్రి సీతక్క  మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. 
🔸జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు.🔸అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.🔸జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 


Monday, 8 September 2025

భాజపా రాష్ట్ర కోశాధికారిగా దేవకి వాసుదేవరావు.• అభినందించిన జిల్లా అధ్యక్షులు నెల్లూరు.


ఖమ్మం : భాలతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో ఖమ్మం జిల్లా నాయకుడు దేవకి వాసుదేవరావుకి కీలక బాధ్యతలు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవకి వాసుదేవరావును హృదయపూర్వకంగా అభినందించారు.ఖమ్మం జిల్లా నాయకుడిగా దేవకి వాసుదేవరావు రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ బలపడేందుకు తోడ్పడుతుందని భాజపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Tuesday, 2 September 2025

*విపత్తు నివారణ పనులపై సమగ్ర నివేదిక పంపండి..... సీఎం రేవంత్ రెడ్డి*


ఖమ్మం, సెప్టెంబర్-1: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, విపత్తు నిర్వహణ నిధుల క్రింద చేపట్టిన పనులు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.భారీ వర్షాలు, వరద నష్టం, సహాయంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు లతో కలిసి, హైదరాబాద్ నుండి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలు పాల్గొన్నారు.*సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు, పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, వరదల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో గత వరదల సమయంలో వినియోగించిన నిధులను పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద జమ చేసి కేంద్రం నుంచి సహాయం రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల యూసీలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 720 కోట్ల విలువ గల 1009 కిలో మీటర్ల ఆర్ అండ్ బి రోడ్లు, 11 కోట్ల విలువ గల జాతీయ రహదారులు, 374 కోట్ల విలువ గల పంచాయతీరాజ్ రోడ్లు, 32 కోట్ల 73  లక్షల విలువ గల   విద్యుత్ శాఖ పరికరాలు దెబ్బతిన్నాయని అన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు.*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు మాట్లాడుతూ* ఆగస్టు 26 నుంచి 28 తేదీలలో భారీ వర్షాలు మన రాష్ట్రంలో కురిసాయని ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురువడంతో ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 4124 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించిందని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డిఆర్ఓ  ఏ. పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఎస్ఈ ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, సిపిఓ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్,, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలకు రెవెన్యూ - రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం: మంత్రి పొంగులేటి

పౌరులకు మెరుగైన మరియు పారదర్శక సేవలను అందించడానికి, తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ మరియు సర్వే విభాగాలను అనుసంధానించే ఏకీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది - గౌరవనీయులైన రెవెన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 📍: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. 🔹 భూ భారతి పోర్టల్‌తో సర్వే మ్యాప్‌లను అనుసంధానించడం 🔹 కోర్టు కేసు పర్యవేక్షణ వ్యవస్థ 🔹 గ్లిచ్-ఫ్రీ మరియు యూజర్ ఫ్రెండ్లీ భూభారతి పోర్టల్‌ను నిర్ధారించడం 🔹 5 పైలట్ గ్రామాలలో రీ-సర్వే పూర్తయింది 🔹 408 గ్రామాల్లో త్వరలో రీ-సర్వే ప్రారంభం కానుంది భవిష్యత్తులో తెలంగాణ అంతటా భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ చొరవ మార్గదర్శక చట్రంగా పనిచేస్తుంది. రెవెన్యూ కార్యదర్శి శ్రీ డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ ఐ.జి., శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, CCLA, కార్యదర్శి, శ్రీ మంద మకరంద్, NIC SIO శ్రీ ప్రసాద్, శ్రీ విజయ్ మోహన్; శ్రీ కృష్ణ, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Thursday, 21 August 2025

రిజిస్ట్రేషన్ శాఖకు సొంత కార్యాలయాలు అత్యంత అవసరం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలని చెప్పారు.
✅ గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్  (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు  పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతొ కలిసి ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు
✅ ఈ సందర్భంగా భవన సముదాయాల నిర్మాణ సామగ్రిని పరిశీలించారు. అనంతరం 'ప్రజా పాలన – ప్రగతి బాట'  సభలో ప్రసంగించారు ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మధ్య తరగతి ప్రజలకు రాజీవ్ స్వగృహ గృహ నిర్మాణం, నైట్ ఎకానమీని పెంచుతూ విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రణాళికలను సమగ్రంగా వివరించారు.
✅ “ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలున్నా ప్రభుత్వ కార్యాలయాలు సరిగా లేవు. ఏటా 15 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే స్టాంపులు - రిజిస్ట్రేషన్ శాఖకు ప్రజలు కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నారు.✅ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే వారిని ఏదో తప్పు చేసిన దోషుల్లా చూసే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే, సదుపాయాలు లేక దారుణంగా ఉన్నాయి.
✅ రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఈ కార్యాలయాల్లో వసతులు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా గౌరవం కూడా పెరుగుతుంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలి. 
✅ గచ్చిబౌలిలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వచ్చే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కార్యాలయాలాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి గంటల కొద్ది నిరీక్షించే పనిలేకుండా టైమ్ స్లాట్ ప్రకారం పనులు ప్రజలకు పనులు పూర్తి కావాలి.
✅ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అపర్ణ గ్రూప్ 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యాలయం నిర్మాణానికి ముందుకు రావడం పట్ల సంస్థ ఎండీ ఉదయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మిగతా కార్యాలయాలను కూడా ఇదే స్ఫూర్తితో మంత్రులు చొరవ తీసుకుని పూర్తయ్యేలా చూడాలి.
✅ వచ్చే పదేళ్లలో ప్రపంచమంతా హైదరాబాద్ నగరాన్ని చూడటానికి వచ్చే విధంగా తీర్చిదిద్దుతాం. గత పాలకులు కొంత పరిమితితో కూడిన దృక్పథంతో ముందుకు వెళ్లారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం విశాల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. అలాంటి వారిని నిలువరించాల్సిన బాధ్యత ప్రజలదే. గడిచిన కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగాలని తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) దార్శనికతతో ముందుకు వెళుతున్నాం.
మూసీ ప్రక్షాళన (Musi Rejuvenation), భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదు. ఒకనాడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడితే అదెందుకు. కార్లు ఉన్న వారికోసమా అని అవహేళన చేశారు. హైదరాబాద్ నీటి సమస్యతో గతంలో ఖాళీ కుండల ప్రదర్శనలు కనిపించేవి.  తాగునీటి సమస్య పరిష్కారానికి కృష్ణా నదీ జలాలను తరలించగా, అవి కూడా సరిపోకపోవడంతో, గోదావరి, మంజీరా జలాలను తరలించడం జరిగింది.
హైదరాబాద్ అభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే మన టార్గెట్ బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతో కాదు. న్యూయార్క్, సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడదలచుకున్నాం. అందుకు మనకు చేతనవుతుంది. మన దగ్గర సాంకేతిక నైపుణ్యం ఉంది. కావలసింది చిత్తశుద్ధి మాత్రమే.మిగతా రాష్ట్రంలో సబర్మతీ, యమునా, గంగా నదులను ప్రక్షాళన చేస్తున్నప్పుడు హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన చేపడితే ఎందుకు అడ్డుపడుతున్నారు. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. దాన్ని గోల్డ్ సిటీగా మార్చాలి.
 మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ధి చెందాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలాగే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వ్యాపారాలు సాగేలా నైట్ ఎకానమీని వృద్ధి చేయాలి. నైట్ ఎకానమీ వృద్ధి సాధించాలంటే ఎలివేటెడ్ కారిడార్ రావాలి. 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించి 365 రోజుల పాటు మూసీలో నీరు ఉండే విధంగా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి, ఆర్థికంగా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నగరాల్లో మధ్య తరగతికి రాజీవ్ స్వగృహ ద్వారా సరసమైన ధరలకు ఇళ్లు కట్టుకోవడానికి వీలు కల్పించాలి. అందుకు మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి గారు  ప్రణాళికలు రూపొందించాలి. మధ్య తరగతి గురించి ఆలోచన చేయాలి. వారికి సొంతింటి కల నెరవేరాలంటే నగరం విస్తరణ ఇవసరం. మెట్రో, రీజినల్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటివి జరగాలి. ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్న తరుణంలో  హైదరాబాద్ నగరాన్ని మురికి కూపంగా, చెత్త చెదారం పేరుకుపోయిన నగరంగా, నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలతో అలాగే వదిలేయడానికి వీలులేదు. ఒక గొప్ప విశ్వనగరంగా రూపుదిద్దుకోవాలి..” అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Chief Minister Shri A. Revanth Reddy emphasized the urgent need to modernize government offices across Telangana to provide better services to the public and make them globally competitive through technology. He laid the foundation stone for the Ranga Reddy District Registrar Office and the Integrated Sub-Registrar Offices complex near TALIM, Gachibowli, along with Ministers Duddilla Sridhar Babu and Ponguleti Srinivasa Reddy. The construction materials were inspected, and plans for modern facilities, including technology-driven workflows to reduce waiting times, were discussed. The Chief Minister appreciated the CSR contribution of Rs 30 crore from Uday, MD of the construction company, for building this office, which is expected to be completed by the next State Formation Day.

🔹 Highlighting the poor conditions in sub-registrar offices, he noted that 19 lakh documents are processed annually in 144 offices across the state. Many offices lack basic facilities despite generating substantial revenue for the government. Improving these offices will not only increase government income but also enhance public respect.

🔹 Speaking on urban development, the Chief Minister outlined plans to revive the Musi riverfront, ensuring water remains in the river throughout the year, and to develop the night economy so businesses can operate 24x7. He emphasized affordable housing for the middle class through Rajiv Swagruha, expansion of the city with Metro and regional roads, and creation of elevated corridors. He added that Hyderabad should compete with global cities like New York, Singapore, and Tokyo, using technical expertise, strategic planning, and sincerity.

🔹 The Chief Minister stressed that stalled development must be accelerated under the vision of Telangana Rising 2047, aiming to make the state a $3 trillion economy by 2047. He called upon citizens to support progress and eliminate obstacles to urban and state-wide development.

🔹 The program was attended by Legislative Council Whip Patnam Mahender Reddy, City Mayor Gadwala Vijayalakshmi, Government Chief Secretary Ramakrishna Rao, along with other ministers, officials, and public representatives.
#RegistrationAndStamps #TelanganaRising