Tuesday, 19 September 2023

పారదర్శకంగా టీచర్ల బదిలీలు...తప్పుడు సమాచారం పై చర్యలు : కలెక్టర్ వి.పి.గౌతమ్.


ఖమ్మం, సెప్టెంబర్ 19: టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టీచర్ల యూనియన్ల ప్రతినిధులతో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించి, యూనియన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 5 ప్రకారం చేపట్టుతున్నట్లు తెలిపారు. జిల్లాలో బదిలీల నిమిత్తం టీచర్ల నుండి 3766 దరఖాస్తులు వచ్చినట్లు, 3679 దరఖాస్తులు జిల్లా విద్యాధికారి చే ఆమోదించగా, 87 తిరస్కరణకు అయినట్లు ఆయన అన్నారు. ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టి, ఆ స్థానంలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి, స్కూల్ అసిస్టెంట్ లకు బదిలీలు కాగానే, ఆ స్థానంలో ఎస్జీటీ లకు పదోన్నతి, ఆ తర్వాత ఎస్జీటీ ల బదిలీలు చేపట్టబడునని ఆయన తెలిపారు. బదిలీల్లో టీచర్ల గ్రీవెన్స్ లను వెంట వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకు 375 గ్రీవెన్స్ రాగా, 372 గ్రీవెన్స్ లకు సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సెలవులు, జీరో నమోదులు ఉన్న స్కూల్స్ మినహా, అన్ని ఖాళీలను ప్రదర్శిస్తున్నట్లు ఆయన అన్నారు. స్పూజ్ కేసులు విషయంలో ఆన్లైన్ సమస్యలు ఉంటే చర్యలు చేపడతామన్నారు. అన్ని జాబితాలు ప్రదర్శిస్తామని ఆయన తెలిపారు. మాన్యు6దరఖాస్తుల కంటే, ఆన్లైన్ దరఖాస్తులకు జవాబుదారీతనం ఉంటుందని ఆయన అన్నారు. దరఖాస్తుల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే వెంటనే సరిదిద్దుకోవాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ల ప్రతినిధులు రోస్టర్, మెరిట్ లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ లకు ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ విషయంలో తప్పులు జరుగుతున్నట్లు తెలిపారు. స్పోజ్ విషయంలో ఆప్షన్ ఇస్తే, వారి స్పోజ్ దగ్గరకే వెళ్లాలని అన్నారు. గతంలో పదోన్నతులు తిరస్కరించిన వారికి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ అన్ని పరిష్కరించాక ప్రక్రియ చేపట్టాలన్నారు. 317 జీవో క్రింద బదిలీ అయిన వారి విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 42 ప్రకారం దివ్యాoగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ పాటించాలన్నారు. అన్ని యూనియన్ల అభిప్రాయాలను విన్న కలెక్టర్, నిబంధనల మేరకు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment