ఖమ్మం, సెప్టెంబర్ 29: )జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల శనివారం పర్యటించనున్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో కొనిజర్ల మండలం గుబ్బకుర్తిలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి లు ప్రసాద్ రావు, బోస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*************************
*కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన*...
ఖమ్మం, సెప్టెంబర్ 29: రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు గాను రఘునాథపాలెం వద్ద గల గిడ్డంగుల సంస్థ గోడౌన్ల ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలకు సరిపోను స్థల లభ్యత ఉన్నది చూడాలన్నారు. మౌళిక వసతుల కల్పన విషయంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట ఉత్పత్తులపై ఆరా తీశారు. పరిశీలించి ప్లాన్ తో సహా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డీసీపీ లు ప్రసాద్ రావు, బోస్, అధికారులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment