సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1
నింగిలోకి దూసుకెళ్లింది.శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న PSLV-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది.
4నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భానుడి ఎల్1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది.అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో ప్రయోగించిన ఈ మిషన్ పై అందరి దృష్టి ఉంది. చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1 ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేయడం కుదరదు...గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి
రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.ప్రస్తుతం నాసా కు చెందిన ప్రోబ్ అనే రాకెట్క రోనాలోనికి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.
No comments:
Post a Comment