Tuesday, 12 September 2023

నాట్లు వేసిన కృష్ణ రాథోడ్... కారేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటన


కారేపల్లి : గ్రామాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎనలేని కృషి చేస్తుందని రైతుల కోసం వ్యవసాయ కార్మికుల కోసం పలు పథకాలు తీసుకొచ్చిందని బజపా రాష్ట్ర గిరిజన మోర్చా కోశాధికారి కృష్ణ రాథోడ్ అన్నారు. మంగళవారం కారేపల్లి మండలంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్లనే ప్రజల ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు
 ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ కార్మికులతో కలసి నాట్లు వేశారు. అనంతరం ఆయన రైతులని పలు గ్రామాల్లో ప్రజల్ని కలిశారు. కారేపల్లి మండలంలో చీమల వారి గూడెం మంగలి తండా గ్రామాల సందర్శించిన ఆయన భాజపా నాయకుడు ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు
ఈ పర్యటనలో కారేపల్లి మండలంలోని ఆల్య తండా కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బానోతు రాంజీ తన సహచరులతో కలిసి కృష్ణ రాథోడ్ నాయకత్వంలో భాజపాలో చేరారు. చీమల వారి గూడెం, మంగలితండ గ్రామాల సందర్భంలో కృష్ణ రాథోడ్ వెంట ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి కల్తీ రాంప్రసాద్, సీనియర్ నాయకులు జాటోత్ మధు నాయక్, శ్రీను,మాన్ సింగ్,పవన్ కుమార్, హనుమ, తదితరులు వున్నారు.

No comments:

Post a Comment