తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన *8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం* కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు,జిల్లా కలెక్టర్ గౌతం గారు,పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ గారు,మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి గారు హాజరై జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ :యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు, నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ప్రజలంతా ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు.యోగా ద్వారా విద్యార్థులు చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి అన్నారు.చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక గంట లేదా అరగంట యోగ చేస్తే శరీరానికి చాలా మంచిదన్నారు..
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా DSWO క్రీడల అధికారి పరంధామ రెడ్డి,ఆయుష్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ నరసింహారావు,BNYS ఇన్చార్జి కనకలక్ష్మి,నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి బానోత్ దేవి లాల్,వలంటీర్ మొహాన్,నాగ చారి తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment