శబరిమలై లో అయ్యప్పలు పోటెత్తారు సన్నిధానం మాలా దారులు, ఇరుముడి దారులతో నిండిపోయి రద్దీగా కనిపిస్తోంది శనివారం 80,000 పైగా అయ్యప్ప స్వామిని దర్శించినట్లు శబరిమలై దేవస్థానం బోర్డు తెలిపింది. ఆదివారం కూడా అదే మొత్తంలో భక్తులు రద్దీ నెలకొని ఉంది స్వామి శరణం నామస్మరణతో శబరి కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి.
ఈ ఎడాది కొవిడ్ ఆంక్షలు పూర్తిగా తొలగడంతో పాటు..ఎక్కువ గా స్వాములు మాలాధారణ చేసినట్లు లెక్కలు చేబుతుండగా..
యాత్రికుల సౌకర్యార్థం శబరిమల దేవస్థానం బోర్డ్ పలుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి సమాచారం సహకారం అందజేస్తుంది శబరిమలై యాత్రికుల కోసం చెంగనూరు కొట్టాయం కొచ్చిన్ తోపాటు పంబ ఎరిమేలీ, శబరిమల దేవస్థానం ప్రాంతంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు తెలియజేసింది భక్తులు ఈక్వూని సందర్శించడం ద్వారా ఎక్కువ సమయం పట్టకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంది శబరిమలై లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు
మరోవైపు కేరళ అటవీశాఖ వివిధ స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పర్యావరణ శుభ్రత పై యాత్రికులకు అవగాహన కల్పిస్తోంది శబరిమల పంబ అటవీ ప్రాంతాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్లాస్టిక్ కు తదితర వ్యర్ధాలను ఈరోజు తొలగించారు..
@ మణికుమార్..
(సహకారం శబరిమల నుండి
ఇంటూరి రామకృష్ణ)
No comments:
Post a Comment