Sunday, 27 November 2022

అభివృద్ధిలో ఖమ్మం బేష్... అధికారులు ఖమ్మం చూసి రావాలని కేసీఆర్ సూచన

హైదరాబాద్ : 
◆నిజామాబాద్ అభివృద్ధిపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరం గా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూరు వెల్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామా బాద్ అధికారులను, ఎమ్మెల్యేలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ కవిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment