Monday, 21 November 2022

ప్రతాపని నరసింహారావు దంపతులచే లక్ష రుద్రార్చన..శివకళ్యాణం....

ఖమ్మం : కమనీయ కార్తీకం చివరి సోమవారం బ్రాహ్మణ బజార్ లోని శ్రీభ్రమరాంబా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్ఛారు..
అభిషేకాలు..అర్చనలు ఈశ్వరునికి ప్రీతికరంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం 8 గంటలక గణపతి పూజ,పాశుపతహోమం
10 గంటలకు మహాన్యాస పూర్వక అభిషేకం
మధ్యాహ్నం12 గంటలకు లక్ష  రుద్రాక్షార్చన
సాయంత్రం 4 గంటలకు శాంతి కల్యాణం , జ్యోతిర్లింగార్చన అనంతరం సాయంత్రం కోటి దీపాల వెలుగులతో ఆలయప్రాంగణం జ్యోతి ర్శయంగా శోభిల్లింది..
 ప్రతాపని నర్సింహారావు దంపతుల నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి శివాలయ ప్రధాన అర్చకులు బాదంపూడి కాళిప్రసాద్ నేతృత్వం వహించగా బాదంపూడి శివకుమార్, విజయకుమార్, పృథ్వి, నాగేశ్వరరావు, రామారావు తదితరులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.

No comments:

Post a Comment