Wednesday, 23 November 2022

ఆ నలుగురై ముందు నిలిచిన తెరాస నేతలు..శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి...

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తికోయలు(వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డి మరణించిన ఎఫ్ఆర్వో చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలకు తెరాస నేతలు ఆ నలుగురై ముందు వరుసలో నిలిచారు..R.O శ్రీనివాస రావు భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎం.ఎల్.సి.తాత మధులు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. కెసిఆర్ ఆదెశాల మేరకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో చండ్రుగొండ చేరుకున్న తెరాస నేతలు. FRO శ్రీనివాసరావు  దేహాన్ని  సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.  ఇటువంటి దారుణాలు ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మంత్రులు అజయ్ని కుమార్స, ఇంద్రకరణ్ రెడ్డి లు పేర్కొన్నారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన విషయం పేర్కొన్నారు.అనంతరం శ్రీనివాసరావు పాడే మోసారు..ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 
కార్యక్రమంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితాహరం OSD ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ (HoFF) దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కలెక్టర్ VP గౌతమ్, కొత్తగూడెం SP వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

No comments:

Post a Comment