Sunday, 13 November 2022

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ప్రారంభించిన మంత్రి హారీష్ రావు...


• రాష్ట్రంలోని 887 PHC ల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దీని ద్వారా. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. 
ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇచ్ఛేందుకు మానిటరింగ్ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. 
• డాక్టర్లు తమ phc లోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుంది. 
•  మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్ తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుంది. 
•  సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుంది. 
•  ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారి. 
• తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ గారు బలోపేతం చేస్తున్నారు.
•  43 పిహెచ్సి లకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశాం. 372 పిహెచ్ సి ల మరమ్మతులను 43 కోట్ల 18 లక్షలతో చేపట్టాము. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు శాంక్షన్ ఇచ్చాము. ఒక్కో దానికి 20 లక్షల ఖర్చు చేస్తున్నాం. అన్నిటికి కలిపి మొత్తంగా 247 కోట్లు వెచ్చించాం. 1497 సబ్ సెంటర్ లను ఒక్కోదానికి 4 లక్షల చొప్పున 59 కోట్లతో మరమ్మత్తులు చేపట్టాము.
• మునుగోడు ఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించాము  వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తాం. దీంతో అన్ని phc ల్లో డాక్టర్లు ఉంటారు. 
• పల్లె దవాఖానల కోసం 1569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. 
• రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 
• ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైంది. 
• వీటి వల్ల ఉస్మానియా, గాంధీ,ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గింది. 
• 2019లో ఉస్మానియా హాస్పిటల్ లో 12 లక్షలు ఓపీ ఉంటే.. ఈ ఏడాది  5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5లక్షల నుండి 3.70 లక్షలకు, నిలోఫర్ లో  8 లక్షల నుండి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్ లో 4 లక్షల నుండి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ సర్జరీల పెరిగాయి. 
• తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారు. 
• వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసానన్న సంతృప్తి కలిగింది. 
• స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం. 
• కేంద్రం 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చినా ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాం. స్వయంగా నేనే పత్రాలు తీసుకొని వెళ్తాను. కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా..?

No comments:

Post a Comment