కేరళ/పట్టణం థిట్టా/శబరిమలై : తిరువాభరణములు పడిమెట్లు ఎక్కాయి..
ధర్మశాస్తకు ఆలంకారంగా మారిన వెంటనే శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి..
మరి కొద్ది క్షణాలకే మకర జ్యోతి వెలుగు నక్షత్రం లా భక్తులకు ధర్శనం ఇచ్ఛింది.
జ్యోతి స్వరుపుని దర్శించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు..
స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శరణు ఘోష శబరిమల ఆలయం మొదలు పంబా పరివాహక ప్రాంతాలు మారు మోగాయి..అటుపై జ్యోతి ప్రజ్వలిత మణికంఠ దర్శనంతో స్వాముల ఆనందం ఉప్పొంగిన మనసులతో పరవశులయ్యారు.
40రోజుల దీక్షలో శీతల స్నానం, భూతల శయనంతో సుష్కించిన శరీరం అయ్యన్ - అయ్యప్ప దర్శనంతో వేయి ఎనుగుల బలము సమకూరిందన్నంత ఉద్వేగంతో స్వాములు నెయ్యి అభిషేకానికి సాగారు.. శబరిమలలో మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని లక్షాలాది భక్తులు స్వయంగా వీక్షించారు.గత ఏడాది కంటే కొంచేం ఆలస్యంగా ఈ ఏడాది జ్యోతి దర్శనం జరిగింది.
తిరువాభరణములు కొద్దిపాటి ఆలస్యంగా చేరడం కారణంగా తెలుస్తోంది.
అయ్యప్పకు పందళ రాజులు పుత్ర ప్రేమతో చేయించిన బంగారు నగలనే ‘తిరువాభరణాలు’ అంటారు.వేయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అభరణాలు మకరజ్యోతి సంధర్భంగా అయ్యప్పకు ఆలంకరించబడతాయి..మకర సంక్రాంతి రోజున స్వామి జ్యోతిరూపంలో దర్శనం ఇస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే ఆ రోజున మకర విలక్కును శబరిమల ఆలయంలో నిర్వహిస్తారు. సన్నిధానానికి మోసుకెళ్లే విధిని పందళంలోని ఓ కుటుంబానికే వారసత్వంగా వస్తోంది.
ఈ తిరువాభరణాలను కేవలం మకర విలక్కు సమయంలో స్వామికి అలకరిస్తారు. ఆ తర్వాత ఏడాది అంతా పందళ రాజ ప్రసాదం "స్రంపికల్ భవనం"లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. మకర జ్యోతికి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండల పూజ సమయంలో ఈ ప్రాంతంలో దర్శించుకోవచ్చు. మళయాళ పంచాగం (కొల్ల వర్షం)లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున తిరువాభరణాలకు ప్రత్యేక పూజల చేస్తారు. మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్ద తిరువాభరణం పెట్టెలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీదేవి రూపు, ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెం, స్వామి వాహనాలైన ఏనుగు, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. రెండోది కొడి పెట్టె అంటారు. ఇందులో స్వామి వారి ధ్వజాలు ఉంటాయి. అన్నిటికన్నా చిన్నదైన "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి, అమ్మవారి నగలు ఉంటాయి.
‘తిరువాభరణాలు’ మోసేవారు కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించాలి. ధనుర్మాసంలోని 28వ రోజున పందళంలోని ‘వలియ కోయికల్’ నుంచి నగలు ఉంచిన మూడు పెట్టెలను శబరిమలకు తీసుకెళ్లే యాత్ర మొదలవుతుంది. ఆ రోజు తెల్లవారు జామున తిరువాభరణాలకు పందళరాజు పూజలు చేస్తారు. అనంతరం పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి కాలినడకన శబరిమలకు బయలు దేరుతారు. వీరిని వేలాది మంది భక్తులు అనుసరిస్తారు. అక్కడ నుంచి బయలుదేరిన వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్థసారథి ఆలయం. వారు అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహ్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానంపైన ఒక గెద్ద ఎగురుతుంది.
గరుడ పక్షి రాక తిరువాభరణాలు బయలుదేరాయన్న సంకేతాన్ని ఆలయం వద్ద ఉన్న వారికి అందిస్తుంది.
దారి పొడవునా ప్రజలు, భక్తులు మహదానందంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహ్నానికి పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానానికి చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుంచి మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన అయ్యప్ప దర్శనం భక్తులకు కలుగుతుంది. చీకట్లు అలముకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠుడికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుంచి మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామియే శరణంఅయ్యప్పా అంటూ చేసే శరణఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి.
అయ్యప్పస్వామి మణికంఠుడనే నామంతో పందళరాజు కుటుంబంలో పెరిగాడని చెబుతారు. నేటికీ శబరిమలలో ఈ కుటుంబానికి ప్రత్యేక గౌరవమర్యాదలను లభిస్తాయి. తిరువాభరణాల యాత్ర మొదలుకొని మకర విలక్కులో జరిగే ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఈ రాజకుటుంబం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాజకుటుంబ పెద్ద సూచించిన వారసుడే ఆభరణాల బాధ్యతను తీసుకుని పల్లకిలో వెళ్తాడు. పంపకు చేరిన తర్వాత పందళ వారసుడు వలియనవోత్తం అనే ప్రాంతంలో ఆగిపోతాడు. మకర సంక్రాంత్రి మరుసటి దినం ఆయన శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటారు. శబరిమల చేరుకున్న రాజకుటుంబ వారసుడికి పదునెట్టాంబడి దగ్గర మేల్సంతి స్వాగతం పలికి సన్నిధికి తోడ్కొని వెళ్తారు. *ఇరుముడి లేకున్నా పదునెట్టాంబడి ఎక్కే అవకాశం పందళ రాజ వంశానికి మాత్రమే సొంతం.* స్వామిదర్శనం కూడా విగ్రహానికి ఎదురుగా నిలబడి చేసుకోరు. గర్భగుడికి ఓ పక్కగా ఉండి ప్రణామాలు అర్పిస్తారు.
తిరువాభరణాలను స్వామికి అలకరించిన తర్వాత ఐదు రోజుల పాటు ఇలాగే దర్శనమిస్తారు. చివరి రోజున పందళరాజు పూజ పూర్తయిన తర్వాత ఆలయ ద్వారాలను మూసేస్తారు. అక్కడ నుంచి పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్తాకి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఈ ఆలయం, శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి 23 నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి.అనంతరం తిరిగి కట్టుదిట్టమైన భద్రత మధ్య భవనంలో భద్రపరుస్తారు..
No comments:
Post a Comment