Monday, 2 September 2024

వరద కాలంలో బురద రాజకీయాలు వద్ధు.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

మున్నేరు వరదతో అతలాకుతలమైన ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం నగరంలో పలు ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు వరద వరద అనంతర సహాయ చర్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు అధికారుల పనితీరును ప్రశంసిస్తూ ప్రతిపక్షాలు ఈ సమయంలో బురద చల్లడ సరికాదని పేర్కొన్నారు. హైదరాబాదు నుండి సాయంత్రం ఐదు గంటల కు ఖమ్మం రూరల్ మండలం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పల ప్రాంతాల్లో పర్యటించారు అనంతరం ఖమ్మం మున్నేరు  వరద ముంపు ప్రాంతాలను ఆయన సందర్శించారు అనంతరం ఆయన ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ పౌర సంబంధాల రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు,  జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తదితరులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వరదలు అనంతర సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
ఖమ్మం  సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ....
భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయింది...
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనిభారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చాను..
ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నాం..
వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది... వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం...
భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరాం...తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం..
నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి జరిగినట్లు పేర్కొన్నారువర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగింది...
తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి  చేశానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
ఇది కష్ట సమయం....
పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారు...
తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారు...
కేటీఆర్ అమెరికా లో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారు
జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు...
రాజకీయ ప్రయోజనాల కోసం మేము పనిచేయం...
వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారు...
ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదు...
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో 
రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా?
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తాం...
పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తాం..
వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నాం
తక్షణ అవసరాల కోసం  జిల్లా ల కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశాం
వరదలపైన గత ప్రభుత్వం ఒక పాలసీ ని కూడా రూపొందించలేదు...
రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం..
వరదసాయ చర్యల్లో పాల్గొనాలని  కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చాం...
ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం...
రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి...
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలి...
 వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలి. ..
ప్రజలకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు..వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలి...ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు   మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు...


No comments:

Post a Comment