Tuesday, 24 September 2024

తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయండి : మంత్రి పొంగులేటి


కూసుమంచి : తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపు నిచ్చారు.మంగళవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు లతో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి రూ. 23.50 లక్షల అంచనా విలువతో చేపట్టిన జిల్లా పరిషత్ హైస్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల పట్ల ప్రజలకు ఉన్న చులకన భావం  మరిపించే విధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు విశ్వసించి కూసుమంచి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 936 మంది విద్యార్థులు  చదువుతున్నారని, ఇది చాలా సంతోషమని, దీనికి కారణమైన ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులకు మంత్రి అభినందనలు తెలిపారు. పాఠశాలకు అవసరమైన 3 ఫేజ్ కరెంట్ రెండు మూడు రోజులలో అందించడం జరుగుతుందని అన్నారు. 
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, వారి సూచనలు తీసుకుని 8 నుంచి 10వ తరగతి చదివే బాలికలు 604 మందికి సైకిళ్ళు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు.పాలేరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రిల్లో మినరల్ వాటర్ ప్లాంట్  లను దసరా సెలవులు లోపు పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేస్తామని అన్నారు.  విద్య, వైద్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు.పాఠశాల శుభ్రం చేసేందుకు కార్మికులు లేక, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు గురవుతున్నామని హెడ్ మాస్టర్ లు తెలియజేసిన సమస్యను క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించామని, అదేవిధంగా పాఠశాలను శుభ్రం చేసేందుకు ప్రతినెల విద్యార్థుల సంఖ్య అనుగుణంగా నిధులు కేటాయించడం జరుగుతుందని అన్నారు.కంప్యూటర్ విద్య కోసం టెక్నికల్ బృందం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని, క్రీడలను సైతం తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, త్వరలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షతో పాఠశాలలకు తల్లిదండ్రులు పంపుతున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత పిల్లలకు ఉంటుందని, మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కష్టపడి చదువుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు.  చెడు అలవాట్లకు విద్యార్థులు బానిస కాకుండా దూరంగా ఉండాలని మంత్రి తెలిపారు.*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,*  జిల్లాలో 5 రకాలుగా విద్య పై దృష్టి పెడుతున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థమయ్యేలా విద్యా బోధన, ఉపాధ్యాయుల హాజరుపై ప్రతి రోజూ పర్యవేక్షణ, జవాబుదారీతనంతో పేరెంట్, టీచర్స్ మీటింగ్, స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అనుభవం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ఇక్కడ ప్రైవేట్ కంటే మెరుగ్గా నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని అన్నారు. వంద శాతం 10వ తరగతి పరీక్ష ఫలితాలు సాధన దిశగా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం 8 నుండి 10వ తరగతి చదువుతున్న కూసుమంచి మండలానికి చెందిన 102 మంది విద్యార్థినిలకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సీతారాములు, పాఠశాల హెచ్ఎం వీరస్వామి, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment