Thursday, 19 September 2024

యూడైస్ పోర్టల్ లో సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ




ఖమ్మం : యూడైస్ పోర్టల్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్)లో విద్యా సంస్థల సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లో యూడైస్ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించిన సమాచారం ఆన్ లైన్ లో యుడైస్ లో నమోదు చేసే ప్రక్రియ , తదితర వివరాలను అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ,*  ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఉన్నత పాఠశాలలు, కళాశాలల సంపూర్ణ సమాచారాన్ని యుడైస్ పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తప్పనిసరిగా అందజేయాలని, సరైన సమాచారం సేకరించాలని అదనపు కలెక్టర్ అన్నారు. యుడైస్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అధికారులకు అందజేసి సంపూర్ణంగా సహకరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలోని స్కూల్ బస్సుల డ్రైవర్లందరికీ ట్రాఫిక్ నియమ నిబంధనలు, చిన్నపిల్లలు వాహనంలో ఉన్నప్పుడు పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ప్రైవేటు పాఠశాలల డ్రైవర్లకు హెల్త్ చెకప్ నిర్వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే డ్రైవర్లందరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో గుడ్, బ్యాడ్ టచ్ లపై టీచర్లు పిల్లలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని,  ప్రతి నెల మూడవ శనివారం పాఠశాలలో పేరెంట్, టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, తరగతి గదులలో టీఎల్ఎం ప్రకారం విద్యాబోధన జరగాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. 
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్, ఇతర శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖరశర్మ, డి.డి. సోషల్ వెల్ఫేర్ కె. సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఆర్.సి.ఓ.లు, ఆర్ఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవి, ప్రోగ్రామ్ అధికారి రామకృష్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment