Saturday, 4 July 2020

కపిలేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేడు పూర్ణహుతి...

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శ‌ని‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.
ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్, శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు....@మణికుమార్, తిరుమల..

No comments:

Post a Comment