Saturday, 4 July 2020

శాకాంబరీ అవతరంలో బెజవాడ దుర్గమ్మ.. భక్తులకు కదంభ ప్రసాద వినియోగం..

విజయవాడ :  ఆశాడ శుద్ద చతుర్దశి కనకదుర్గమ్మ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు రెండవ రొజులో భాగముగా శనివారం ఉదయం  ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ పర్యవేక్షణలో సప్త శతి పారాయణము,  మహావిద్యా పారాయణము, మూల మంత్ర హవనము , మంటప పూజ కార్యక్రమములు నిర్వహించడం జరిగినది.  అనంతరం సా.04 గం.లకు మూల మంత్ర హవనములు, హారతి, మంత్ర పుష్పము, మరియు ప్రసాద వితరణ నిర్వహించబడును. శాకంభరీ దేవి ఉత్సవముల సందర్భముగా అమ్మవారు వివిధ కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరింపబడి శాకంబరీ దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.  దేవస్థానము నందు గర్భాలయము, అంతరాలయము, మరియు ప్రధానాలయము వివిధ రకముల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించబడినది.  శాకంభరీ ఉత్సవముల సందర్భముగా భక్తులందరికీ కదంబం ప్రసాదముగా పంచిపెట్టబడినది. రేపు అనగా ఆషాడ శుద్ద పౌర్నమి, ది.05-07-2020 ఆదివారము రొజున ఉదయం 08 గం.ల నుండి   సప్త శతి హవణము , మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు కొనసాగనున్నాయి .
ఈరొజు దేవస్థానము నందు సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరించి online యందు టైం స్లాట్ పద్దతి ద్వారా టికెట్లు పొంది అమ్మవారి దర్శనము చేసుకున్నారు.  పరిమిత సంఖ్యలో ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవావర్నార్చన, చండీ హోమం, శాంతికల్యాణము,  రుద్రహోమము, నవగ్రహ శాంతి హోమము మరియు లక్షకుంకుమార్చన సేవలు యందు సామాజిక దూరము పాటిస్తూ, మాస్కులు ధరించి, ప్రత్యక్షముగా పాల్గొని పూజలు నిర్వహించారు.  
అమ్మవారి దర్శనార్థము, సేవలు , ప్రసాదము పొందుటకు, తలనీలాలు సమర్పించుట కొరకు భక్తులందరూ విధిగా online నందు www.kanakadurgamma.org , మొబైల్ ఆప్: kanakadurgamma, మీ సేవా సెంటర్ల ద్వారా ముందస్తుగా టికెట్లు పొంది ప్రింటు తీసుకొని రావలెనని తెలిపారు.   
ప్రత్యక్షముగా పూజల యందు పాల్గొను అవకాశము లేనటువంటి భక్తుల సౌకర్యార్థము  దేవస్థానము నందు జరుగు   ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శాంతి కళ్యాణము, శ్రీచక్రనవావర్నార్చన,  రాహు కేతు పూజలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినదని, కావున ఈ పరోక్ష  సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  online నందు www.kanakadurgamma.org  – website  ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపియున్నారు. పరోక్ష సేవలు బుక్ చేసుకున్న భక్తులందరికీ  అమ్మవారి ప్రసాదములు పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు  తెలిపారు. దర్శనము మరియు సేవల, ప్రసాదము టికెట్లు కొరకు  భక్తులు  online నందు www.kanakadurgamma.org వెబ్ సైటు , kanakadurgamma అను ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్, మీ సేవ సెంటర్లు, దేవస్థానము కౌంటర్లు నందు పొందవచ్చని ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎం.వి.సురేష్ బాబు గారు తెలిపారు. 
ఆషాడ మాసం సంధర్భముగా  శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించ దలచిన మరియు అమ్మవారి దర్శనం చేసుకొనదలచిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా విధిగా ఆన్ లైను(website: www.kanakadurgamma.org, ఆండ్రాయిడ్ మొబైల్ APP : kanakadurgamma), మీ-సేవ సెంటర్లు  ద్వారా వారి యొక్క పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ లేదా ఏదైనా ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ మరియు వివరములు నమోదు చేసుకొని టైం స్లాట్ ప్రకారము  దర్శనం టిక్కెట్లు తీసుకొని ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు బృందములుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా విచ్చేసి, అమ్మవారికి సమర్పించదలచిన సారే, మడుపులు సమర్పించవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు   తెలిపారు. ఆలయ ప్రాంగానములందు శానిటైజర్లు, మరియు ఇతర ఏర్పాట్లు చేయడమైనదని తెలిపారు.  దేవస్థానము ప్రాంగణముల నందు కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, సానిటైజర్లు ఏర్పాటు, ప్రతినిత్యము క్యూ లైన్లు పరిశుబ్రత , థర్మల్ సేన్సార్స్ ఏర్పాటు మరియు ఇతర పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Øమాస్కు ధరించిన భక్తులను మాత్రమే శ్రీ అమ్మవారి దర్శనమునకు అనుమతించబడుచున్నదని తెలిపారు.
Øఆలయ పరిసర ప్రాంతములు పరిశుభ్రముగా ఉంచుతూ ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లేరైడ్ తో  శుభ్రపర్చుటకు తగిన చర్యలు తీసుకొనబడినదని తెలిపారు.
Ø భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపర్చుకొని మహామండపము క్యూ లైను మార్గము ద్వారా దర్శనమునకు వెళ్ళుటకు ఏర్పాట్లు చేశామని ఇ.ఓ.చెప్పారు.

No comments:

Post a Comment