తిరుమల :
లోకకల్యాణం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని, ప్రపంచంలోని సమస్త మానవాళి ప్రజల ఆరోగ్యం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ విశ్వశాంతి మహాయాగాన్ని తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగళవారం సాంగోపాంగ అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ విశ్వశాంతి మహాయాగం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా "ఓం నమో నారాయణాయ" అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించి హోమం నిర్వహించారు. రేవతి, అశ్విని నక్షత్రాలు కలిసిన భౌమాశ్విని యోగం పర్వదినం కావడంతో ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారు, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు మంగళాశాసనాలు అందించారు.
వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ కరోనా వ్యాధి నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని కోరుతూ వేదపాఠశాలలో 30 రోజులుగా వేదపారాయణం జరుగుతోందన్నారు.చేశామన్నారు. ఇందులోభాగంగా ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ నారాయణం చేపట్టినట్టు చెప్పారు.
వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు మోహనరంగాచార్యులు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రాన్ని, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని పఠించిన వారికి శ్రీవారి ఆశీస్సులతో బాధలు తొలగిపోయి, సకలశుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ యాగంలో టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఓఎస్డి పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment