Thursday, 31 March 2022

అసేతు.. హిమచలానా యువతకు స్పూర్తి మన జెండా : ప్రియదర్శిని అడ్మిన్ డైరెక్టర్ ఎ.వి.రమణ ఉద్ఘాటన



యువత జాతీయ పతాకాన్ని తమ దైనందిన జీవితంలో ప్రధాన అంశంగా భావించాలని 101 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను స్మరించుకోవాలని అదే స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయులకు మనం ఇచ్చే గౌరవం అని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అడ్మిన్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ అన్నా రు.
1921 మార్చి 31న మొదటిసారిగా జాతీయ పతాకాన్ని రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మా గాంధీ కి అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అట్లూరి  పాల్గొని ప్రసంగించారు.
దేశంలోని ఏ  విషయంపైనైనా వ్యతిరేకంగా మాట్లాడ వచ్చేమో కానీ జాతీయ పతాక విషయంలో మాత్రం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరాదని, స్వాతంత్ర సమర కాలంలో భరత జాతిని ఉద్యమం వైపు నడిపించిన అపురూప శక్తి జాతీయ పతాకం అని తెలిపారు. ప్రతి కదలికలో పతాకం పట్ల విశేషమైన గౌరవం మర్యాద తొణికిసలాడాలని కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
క్విట్ ఇండియా, జాతీయోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం  మరియు సాయుధ పోరాటాలు వైపుకు ప్రజలను ఆకర్షితులను చేసిన ప్రధాన ఆయుధం జాతీయ పతాకమేనని స్పష్టం చేశారు..
జాతీయ పతాకాన్ని తాకటమంటే మన శరీరాన్ని మనస్సును ఆత్మను ప్రకాశింప చేసుకోవడమేనని అన్నారు..
ఎన్ని అవాంతరాలు వచ్చినా, కాలాలు మారినా, ఎన్ని తరాలు మారినా, నిరంతరం ఉన్నత స్థాయిలో అన్నింటి కన్నా ఎత్తులో ప్రపంచానికి వెలుగునిచ్చేది కేవలం జాతీయ పతాకమని అట్లూరి అభివర్ణించారు...
స్వాతి, దివ్య, నిఖిత,రాగ,పల్లవి, రుక్సానా, సంయుక్త, నాగశ్రీ,  ఉదయ శ్రీ, సీతలతో తన సారధ్యంలో జాతీయపతాక కమిటీని ఏర్పాటు చేసారు...
దిశ దశలా జాతీయ పతాకాన్ని స్వాతంత్ర ఉద్యమాల చరిత్రను ప్రచారం చేసి దేశాన్ని విశ్వవిజేతగా నిలబెట్టడమే తమ ప్రాధాన్యతని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్, విభాగాధిపతులు
నరసింహారావు, రమేష్, స్వామి, సతీష్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు...

Wednesday, 30 March 2022

ఆర్యవైశ్య మెరిట్ విధ్యార్థులకు పసుమర్తి రామ్మోహన్ రావు చేయుత...

ఖమ్మం : మూడో పట్టణం గాంధీ చౌక్ నగరంలో ఉమెన్స్ కాలేజీ బ్యాక్ సైడ్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీ నీలం మౌనిక కు నిత్యావసర సరుకులు పంపిణీ , 
4 అంగన్ వాడీ స్కూళ్లకు 12 కుర్చీలు వితరణ , రాయల సతీష్ బాబు , ఈగ భరణి కుమార్ స్థాపించిన ఎంబీబీఎస్ కాలేజీలో మెరిట్ సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులు మైలవరపు పునీత , మైలవరపు రాగంజలి, బూతు కృష్ణసాయి , మద్ది ధరణి లను ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు . అనంతరం వారు మాట్లాడుతూ 45 మంది విద్యార్థులు ఒక చిన్న సంస్థ నుంచి మెడికల్ ఎం బి బి ఎస్ చేయడానికి గవర్నమెంట్ కాలేజీలో అర్హత సాధించినందుకు మనకు ఎంతో గర్వకారణం అన్నారు . ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వర్లు ,  గుంటుపల్లి దివాకర్ , ఆకుల సతీష్ , ఆత్మకురి రామారావు , గరాని రవి , వందనపు హరికృష్ణ , బచ్చు మురళీకృష్ణ , తిరుమల బుక్స్టాల్ హరి , డివిజన్ అధ్యక్షుడు పిల్లుట్ల కృష్ణ , నేరెళ్ల ఉపేందర్ , టీచర్లు అలివేలు , అంజూర , రాజ్యలక్ష్మి  , నాగమణి తదితరులు పాల్గొన్నారు .

శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం



*కర్నూలు: శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేసి ఉగాధి మహోత్సవాలను ఈఓ లవన్న, చైర్మన్ చక్రపాణి రెడ్డి, అర్చకులు, వేదపండితులు ప్రారంభించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధులలో బృంగివాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. కాగా  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు మరియు గర్భాలయ అభిషేక దర్శనాలు  రద్దు చేసినట్లు  ఈఓ లవన్న తెలిపారు.3వతేది వరకు ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు..

Monday, 28 March 2022

నెల నెల వెన్నెల పునః ప్రారంభం... అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు...

ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి  ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున నెల నెలా వెన్నెల సాంస్కృతిక వేడుక పునః ప్రారంభమైంది. ఆర్గనైజర్లు అన్నాబత్తుల సుబ్రమణ్య కుమార్, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు వి వి అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఖమ్మం కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగబత్తినరవి , రవి మారుత్, దేవేంద్రం, సదానందం, ప్రముఖ జానపద గాయకులు మోదుగు గోవిందు పాల్గొన్నారు. సభానంతరం కుమార్ మీనా బృందం నృత్యాలు, జరుగుతున్న కథ నాటక ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి.

Sunday, 27 March 2022

ముగిసిన మహాసంప్రోక్షణ...హంగులు అద్దిన గర్భాలయంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న యాదాద్రి సింహుడు...దర్శనం వేళల్లో మార్పులు...

యాదాద్రి ఆలయంలో మహాకుంభసంప్రోక్షణ ఘట్టాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ నెల 28న పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొం టారని తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన వెంటనే సాధారణ భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల 29 నుంచి స్వామి వారి పూజలు, దర్శన వేళలు ఇలా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 3 గంటలకు ఆలయం తెరుస్తారు.            ఉదయం 3 గంటల నుంచి 3.30 వరకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఉదయం గం.3.30 నుంచి 4 గంటల వరకు బిందేతర్థం, ఆరాధన పూజలు చేస్తారు. ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామి వారికి స్వామి వారికి బాలభోగం (ఉదయం ఆరగింపు) నిర్వహిస్తారు. ఉదయం గం.4.30 నుంచి 5.30 గంటల వరకు స్వామి వారకి నిజాభిషేకం, 5.30 నుంచి 5.45 గంటల వరకు అలంకరణ, 5.45 నుంచి 6.30 వరకు సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల వరకు సర్వదర్శనానికి సమయం కేటాయించారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తిరిగి సర్వదర్శనానికి సమయం కేటాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 వరకు స్వామి వారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు) ఉంటుంది. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వదర్శనాలకు టైమ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు గంటపాటు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వదర్శనం, 7 గంటల నుంచి 7.30 వరకు తిరువారాధన ఉంటుంది. రాత్రి 7.30 గంటల నుంచి 8.15 వరకు స్వామి వారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు, 8.15 నుంచి 9.15 వరకు సర్వదర్శనములు ఉంటాయి. రాత్రి 9.15 నుంచి 9.45 వరకు రాత్రి నివేదన (ఆరగింపు), రాత్రి 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం తదుపరి ద్వారబంధనం (ఆలయాన్ని మూసివేయడం) చేస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు (సర్వ దర్శన వేళల్లో) సువర్ణ పుష్పార్చన/వేదాశీర్వచనం, ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం, ఉదయం 10.30 నుంచి 12 వరకు స్వామి వారి నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు స్వామి వారి వెండి మొక్కు జోడుసేవలు ఉంటాయి. సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భార్ సేవ ఉంటుంది. ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు (ప్రతి మంగళవారం) ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు (ప్రతి శుక్రవారం) ఆండాళమ్మ వారి ఉత్సవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఉత్సహంగా షీ టీమ్స్ రన్.... ముఖ్య అతిధిగా పువ్వాడ అజయ్. ఉత్సహం నింపిన కలేక్టర్ : గౌతమ్. సి.పి : విష్ణు వారియర్

ఖమ్మం :  తేది : 27.03.2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మహిళల భద్రత, జెండర్ ఈక్వాలటీ పై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీ-టీమ్స్ 2k,5k రన్ ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గోని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ-టీమ్ లు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. నేరగాళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం  తీసుకున్న కఠినమైన నిర్ణయాలతో మహిళలపై ఆకతాయిలు, పోకిరీల అగాయిత్యలు, చోరీలు తగ్గిపోయాయని అన్నారు.ఖమ్మంకు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్ళి సాదించుకున్నామన్నారు. 
అభివృద్ధి దిశగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో... రక్షణ కోసం  ప్రధాన సంపత్తిగా మారిన సీసీ కెమెరాలతో ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ.. ప్రజల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. 
మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ కోసం ఈరోజు ర‌న్‌ను నిర్వ‌హించ‌డం అభినందనీయమన్నారు..
జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ మాట్లాడుతూ ఇటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా ప్రజా భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ...ప్రజా సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో  ఉత్సాహంగా వామప్ ,రన్ లో పాల్గొన్నారని అన్నారు. 
పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ మాట్లాడుతూ .. నగరంలో 10 వేల సీసీ కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చి  ఇరవై నాలుగు గంటలూ మనం వేసే ప్రతి అడుగూ సీసీటీవి ఫుటేజీల్లో భద్రం అయ్యేలా ప్రణాళిక సిద్ధం  చేసి అమలు చేస్తున్నట్లు   తెలిపారు.
అనంతరం రన్ పూర్తి చేసిన వారిని మంత్రి పువ్వాడ చేతుల మీదుగా పతకాలు అందజేశారు. 
కార్యక్రమంలో నగర మేయర్ నీరాజ, మున్సిపల్ కమిషనర్ ఆధర్శ్, కుడా చైర్మన్ విజయకుమార్, డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ గౌష్ అలమ్, సుభాష్ చంద్ర బోస్ ,కుమారస్వామి , ఏసీపీలు స్నేహ మెహ్రా ,రామోజీ రమేష్ ,అంజనేయులు, భస్వారెడ్డి, వేంకటేశ్, ప్రసన్న కుమార్ , రామనుజం, వేంకటస్వామి, విజయబాబు, సిఐ అంజలి పాల్గొన్నారు.

                

Wednesday, 23 March 2022

జస్ట్ పర్ లివింగ్ సంస్థకు అడిషనల్ ఎస్పీ ప్రశంసలు.. .ఐదు సూత్రాలు పాటిస్తే విజయం మీదే నంటూ విధ్యార్థులకు సూచనలు...


 జస్ట్ పర్ లివింగ్ సంస్థకు మహాబూబాబాద్ #అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్..* *#TUWJ(IJU) మహాబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్..లతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.
 * నిట్ లో 321ర్యాంక్ సాదించిన *పావణికి రూ.15వేల ఆర్ధికసహాయంతో పాటు డోర్నకల్బ్బై ప్రభుత్వ హైస్కూలు పదవతరగతి విధ్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు సంస్థ సమకూర్చగా  అడిషనల్ ఎస్పీ  పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు...తాను బీహార్ లో హాస్టల్ లో వుండి చదువుకున్నరోజులను యోగేష్ విధ్యార్థులతో ప్రస్తావించారు.. హాష్టల్లో వున్న సమయంలో ఓ గురువు తమకు చెప్పిన కధను ఆయన గుర్తు చేసుకున్నారు.. కాకి లాగా లక్ష్యం సాదించేందుకు కృషి చేయాలని చెబుతూ కడవ అడుగున  నీటిని పైకి తెచ్ఛేందుకు కాకి ..చెపల వేటలో కొంగలు చూపిన తెలివిని విధ్యార్థులు కలిగి వుండాలన్నారు..ఐదు గుణాలను విధ్యార్థులు కలిగి వుంటే విజయం వారికి సొంతం అని నొక్కి చెప్పారు..వివరాల్లోకి వెళితే
 *సాటిమనిషికి సహాయం చేయాలనే సంకల్పంతో జస్ట్ పర్ లివింగ్ సంస్థను నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ గండి సీతరాంగౌడ్-గీత దంపతులు అభినందనీయులని మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అభినందించారు.*  నిట్ లో 321వ ర్యాంక్ సాదించి పీజులు చెల్లించేందుకు ఆర్ధికంగా ఇబ్బంది ఎదుర్కుంటున్న *మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంకు చెందిన గోళి పావణి విషయం తెలుసుకున్న జస్ట్ పర్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు గండి సీతరాంగౌడ్-గీత దంపతులు స్పందించారు..* పావణిని డోర్నకల్ కు ఆహ్వనించి ఘనంగా  సత్కరించారు.  *రూ.15వేల ఆర్థికసహాయాన్ని అందజేసారు.* డోర్నకల్ ప్రభుత్వ పాఠశాలలో *పదవతరగతి చదువుతున్న సుమారు డెబ్బైమంది విద్యార్థులకు పరీక్షల కోసం ప్యాడ్, పెన్నులను ఈ..సందర్భంగా అందజేశారు.* ఈ..కార్యక్రమంలో *ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ విద్యార్ధులను ఉద్దేశించి స్పూర్తిదాయక ప్రసంగం చేసారు.* పదవతరగతి విద్యార్థులందరితో మాట్లాడి సరదాగా వారితో గడిపారు. పావణి చదువు విషయంలో ఖచ్చితంగా తమవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ..కార్యక్రమంలో డోర్నకల్ సిఐ శ్రీనివాస్,  సినీయర్ జర్నలిస్ట్ కొమ్కమార్, పాఠశాల ప్రదానోపాద్యాయురాలు, ఉపాద్యాయబృందం పాల్గొన్నారు.

Monday, 21 March 2022

ఘనంగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ జన్మదిన వేడుకలు...

Dt:21/03/2022
Khammam.
ఖమ్మం మున్సిపల్ కమిషనర్,సుడా వైస్ చైర్మన్ ఆదర్శ్ సురభి IAS జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఖమ్మంలోని మేయర్ ఛాంబర్ లో మేయర్ పునుకొల్లు నీరజ కేక్ కట్ చేసి కమిషనర్ కు మిఠాయిలు తినిపించారు...మహాత్మాగాంధీ ఫౌండేషన్ అద్యక్షులు, సుడా డైరెక్టర్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ కమిషనర్ ఆదర్శ్ సురభికి శాలువా కప్పి బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార లు కూడా  కమిషనర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి,కార్పొరేటర్లు రావూరి కరుణ,దోరేపల్లి శ్వేత,రుద్రగాని శ్రీ దేవీ,పల్లెపు విజయ,పాకలపాటి విజయనిర్మల,దాదే అమృతా,మక్బుల్,పసుమర్తి రామ్మోహన్,సుడా డైరెక్టర్లు జీకొల్లు పద్మ,ముక్తార్, సంజీవరెడ్డి,నాయకులు శౌకత్ అలి,రుద్రగని ఉపేందర్,జని తదితరులు పాల్గొన్నారు..

Friday, 18 March 2022

ఘనంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ



Today's Paurnami Garuda Seva at Tirumalaతిరుమ‌ల‌, 2022, మార్చి 18
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

        తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
       ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పూర్వ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 9నుండి ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

*ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు*

తిరుమల తిరుపతి దేవస్థానములు  ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నెల 9 వతేది నుంచి 19 వ తేదీ వరకు జరగనున్నాయి 
9 వతేది శనివారం ఉదయం దీక్షా తిరుమంజనం సాయంత్రం అంకురార్పణ

10 వ తేదీ ఆదివారం ఉదయం ధ్వజారోహణం సాయంత్రం శేషవాహన సేవ

11 వతేది సోమవారం ఉదయం వేణుగాన అలంకారం స్నపన తిరుమంజనం సాయంత్రం హంస వాహన సేవ

12 వతేది మంగళవారం ఉదయం వటపత్రసాయి అలంకారం సాయంత్రం సింహ వాహన సేవ

13 వతేది బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారం సాయంత్రం హనుమంత వాహన సేవ

14 వతేది గురువారం ఉదయం మోహిని అలంకారం సాయంత్రం గరుడ సేవ

15 వతేది శుక్రవారం ఉదయం శివ ధనుర్భాణ అలంకారం సాయంత్రం సీతారామ కల్యాణోత్సవం గజావాహన సేవ

16 వతేది శనివారం రధోత్సవం
17 వతేది ఆదివారం ఉదయం కాళియ మర్దన అలంకారం సాయంత్రం అశ్వ వాహన సేవ

18 వతేది సోమవారం ఉదయం చక్రస్నానం

19 వ తేదీ మంగళవారం సాయంత్రం పుష్పయాగం 

దేవదేవుడు శ్రీకోదండరామస్వామి దర్శనం సర్వపాప హారణం బ్రహ్మోత్సవాలు తిలకించి తరించండి

Monday, 14 March 2022

శ్రీ‌వారిసాలకట్లతెప్పోత్సవాలుప్రారంభం#. మొద‌టిరోజుశ్రీసీతారామలక్ష్మణులుతెప్పపైవిహారం

  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్ర పెరుమాళ్ దర్శనమిచ్చారు.
       ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
THIRUMALA SRIVARI ANNUAL FLOAT UTSHVAMS STARTED GRANDLY IN THIRUMLA SRIVARI TEMPLE DAY 1 SRI SITHA LAKSHMANA HANUMA SAMETHA SRI KODANDA RAMA PERUMAL GIVEN DARSHAN

Sunday, 13 March 2022

ధియేటర్లో కాశ్మీర్ ఫైల్ సినిమా చూసిన యోగీ... ప్రధాని మోదీ ఇతర బజాపా నేతలతో భేటీ...

ఉత్తరప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ఆయన దేశ రాజధానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గత ఐదేళ్లలో శక్తివంచన లేకుండా కృషి చేశానని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్ తన పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్, బిజెపి చీఫ్ జెపి నడ్డా మరియు బిజెపి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్‌లను కూడా కలిశారు. 403 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా, దాని రెండు మిత్రపక్షాలు అప్నా దళ్ (సోనీలాల్) 12 సీట్లు గెలుచుకోగా, నిషాద్ పార్టీ ఆరు సీట్లు గెలుచుకుంది.
అంతకు యోగి 1990లో కాశ్మీర్ పండిట్స్పై మతోన్మధులు జరిపిన అకృత్యాలకు అద్దం పడుతు వివేక్ అగ్నహోత్రి నిర్మించిన కాశ్మీర్ ఫైల్ చలన చిత్రాన్ని ధియేటర్ కు వెళ్లి చూశారు... యోగీ పార్లమెంటేరియన్గా వున్నప్పుడు కాశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలను పార్లమెంట్లో ప్రస్తావించారు....

*ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షులుగా వనమా వేణుగోపాల రావు(సూరి)... వనమా కే జిల్లా ఆర్యవైశ్య కిరాటం.... అత్యధిక శాతం ఓటింగ్....


ఖమ్మం: స్థానిక కన్యకాపరమేశ్వరి దేవ్యాలయములో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ఆదివారం ఉ. 9గం.ల నుండి సా.4 గం.ల వరకు కొనసాగాయి. తొలిసారిగా జిల్లా లో జరుగుతున్న ఆర్యవైశ్య జిల్లా అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నికలలో అత్యధిక ఓట్లు పోలవడం సంచలన విషయం గా జిల్లా వాసులు పేర్కొంటున్నారు.. ముఖ్యంగా అధ్యక్ష పదవికి అయిదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నా, వనమా వేణుగోపాల రావు మరియు కొదుమూరి మధుసూధన్ మధ్యనే విజయం దోబూచు లాడి, చివరకు  ఓట్ల మెజార్టీతో వనమాను వరించింది. రాజకీయంగా, సామాజిక సేవా పరంగా ఎంతో అనుభవం కలిగిన వనమా వేణు గారు ఈ ఎన్నికల సమయంలో, వయసును కూడా లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా కలియతిరిగి ఓటర్లను కలిశారు. తాను చేసిన సేవలను, గెలిచిన తరువాత చేయబోయే కార్య క్రమాలను జిల్లా ఓటర్లకు అర్థమయేటట్లు చెప్పగలగడం విశేషం. స్థానిక వాసవి జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన, అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమంలో ధైర్యంగా పాల్గొని, విలేఖరులు సంధించిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పారు. జీవితాంతం తాను ఆర్యవైశ్యుల అభివృద్ధికై కృషి చేస్తానని చెప్పిన మాటలే ఈ రోజు వారి గెలుపుకు దోహదం చేశాయి.

*అభ్యర్ధుల ఓట్ల వివరాలు..*
----------------------------------------
1 వనమా వేణుగోపాల రావు..193
2 కొదుమూరి మధుసూధన్.. 183
3 కొదుమూరి జగన్నాథం........ 63
4 పెనుగొండ ఉపేందర్ ............17
5 కుంచం కృష్ణా రావు............. 17

🟥©️🟨©️🟫©️🟥©️🟨©️🟫©️

Tuesday, 8 March 2022

సస్పెన్షన్ ఎత్తివేసి సీఎం క్షమాపణలు చెప్పాలి



ఖమ్మం : నగరంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దొడ్డ అరుణ బడ్జెట్ మాట్లాడుతూ సమావేశాలకు రాష్ట్ర ప్రథమ మహిళ గవర్నర్ ను ఆహ్వానించకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందుకు గాను  క్షమాపణలు చెప్పి , వెంటనే  బిజెపి శాసన సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు . విపక్షం లేకుండా ఏకపక్షంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం నిరంకుశ పాలనను తలపిస్తుంది అన్నారు . మహిళా దినోత్సవం సందర్భంగా నే మహిళా గవర్నర్ అవమానపరచడం సిగ్గుచేటన్నారు . ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి , సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు .అన్ని రంగాలలో మహిళను ముందంజలో నడిపిస్తానని చెబుతూ మహిళల అభివృద్ధికి కొరకు పాటుపడుతుందని కల్లబొల్లి కబుర్లు చెబుతూ మహిళను మోసం చేస్తున్నారని  ఆరోపించారు . బడ్జెట్ సమావేశాలలో ప్రథమ మహిళ గవర్నర్నే గౌరవించలేని కెసిఆర్ గారు అంతర్జాతీయ మహిళను ఏ విధంగా గౌరవిస్తారని విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు . ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి అనిత , మహిళా మోర్చా ఇంచార్జీ గెంట్యాల విధ్య సాగర్ , మహిళా మోర్చా సొషల్ మీడియా జిల్లా కన్వీనర్ దొడ్డా భవాని , మహిళా మోర్చా అర్బన్ అధ్యక్షురాలు సుగుణ , జిల్లా కార్యవర్గ సభ్యురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sunday, 6 March 2022

మహిళకు ఒక్కరోజు కాదు.. ప్రతి రోజు వారిదే.. మీరు లేనిది సృష్టే లేదు : మహిళా బందు సంబురాల్లో మంత్రి ఆజయ్ కుమార్.

Khammam/06.03.2022
---------------------------
మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు మహిళాబంధుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 6,7,8 తేదీల్లో చేపట్టే కార్యక్రమాల్లో మహిళల కోసం చేపడుతున్న పథకాల గురించి తెలియజేస్తూ, మహిళాబంధుగా కేసిఆర్ గారికి రాఖీలు కడుతూ వేడుకలు పెద్ద ఎత్తున చేపట్టాలని, మహిళలంతా ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తేదీన పురస్కరించుకుని మూడు రోజుల పాటు వేడుకలు చేపట్టాలని రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ గారి పులుపు మేరకు ఖమ్మంలో మహిళా కమిటి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదు.. ప్రతి రోజు మహిళా రోజే అని అన్నారు.
భగవంతుడు అంతటా ఉండలేక తన రూపంలో మహిళను సృష్టించాడని పేర్కోన్నారు.
సమాజంలో సగ భాగం మహిళలు అని, వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.

మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు అనే గొప్ప సంప్రదాయం మనది.. పూజించబడేదానిలో అత్యధికంగా శక్తి స్వరూపులైన దేవతలు ఉన్న సంప్రదాయం మనది అని అన్నారు. 

ఎందెందు వెతికినా అందందు మహిళ ఉంది.. మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని సీఎం కేసిఆర్ గారు నమ్మి అలాంటి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలు మహా రాణులు. అని వ్యాఖ్యానించారు. 

మంచి నీళ్లు అందించే దగ్గర నుంచి అద్భుతాలు సృష్టించే వరకు వారికి ఈ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది.

మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర అద్వితీయంగా పోషిస్తుందని, గత ప్రభుత్వాల్లో మహిళ అనుకున్న పురోగతి సాధించలేదు అని గుర్తించిన సీఎం కేసిఆర్ గారు మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.

మహిళలు సాధించిన అభివృద్ధి, వికాసం కొలమానంగానే సమాజం సాధించిన ప్రగతిని నేను అంచనా వేస్తానన్న.. అన్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ గారి మాటలను అనుసరించి సీఎం కేసిఆర్ గారు ఆడపిల్ల పుడితే తెలంగాణలోనే పుట్టాలి అన్న విధంగా ఇక్కడ అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారని, వాటి ఫలితాలు నేడు మనం అనుభవిస్తున్నామన్నారు.

మహిళల రక్షణ, పోషణ కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఆరోగ్య లక్ష్మి, భరోసా కేంద్రాలు, షి-టీమ్స్ పథకాలు నడిపిస్తున్నామని..

ఆడపిల్ల గురించి ముందు తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీఎం కేసిఆర్ గారికి రుణపడి ఉంటామన్నారు.

మహిళా దినోత్సవం ఒక్క రోజు చాలదు.. మూడు రోజులు జరుపుకోవాలి అని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు చెప్పారు.. ఆ మేరకు ప్రణాళిక రూపొందించి మూడు రోజుల కార్యక్రమాలను జరుపుకోవాలని తలచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపకుంటామన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకోవాలని కొరారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేశారని, మహిళలు ఎంతటి సవాళ్లను అయినా ఎదుర్కొని భవిష్యత్ ను బంగారు బాటగా మార్చుకోవాలని కోరారు.

మహిళలు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ఈ దినోత్సవం జరుపుకుంటున్నమని, సమాజం అభివృద్ధి జరగాలంటే మహిళలు, పురుషులు సమానంగా ఉండాలన్నారు.

సీఎం కేసిఆర్ గారు మహిళలకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు... వాటిని సద్వినియోగం చేసుకుని నిరూపించాలని కోరారు.

మహిళల రక్షణ కోసం ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ గారు భరోసా కేంద్రాలు, షి-టీమ్స్ పెట్టారని, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించారన్నారు.

గృహ హింస చట్టం, పోక్సో చట్టం, నిర్భయ చట్టం, తప్పనిసరి వివాహ నమోదు చట్టం, లింగా నిర్దారణ నిషేధ చట్టం ఉన్నాయని, వీటిపై చైతన్యం పెంచుకుని వాటిని వినియోగించుకోవాలని 
కోరారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా సీఎం కేసిఆర్ మహిళలకు లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం, మమత ఆసుపత్రి మైదానంలో 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక లక్ష 116 గాజులతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి భారీ చిత్రాన్ని రూపొందించారు. 

అనంతరం మానవహారంగా భారీ చిత్రం చుట్టూ మహిళలు నిలబడి కేసీఆర్ జయహో, థాంక్యూ కేసీఆర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

Thursday, 3 March 2022

జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ డిఐజి.. సిబ్బంది పనితీరుపై సమీక్ష...

ఖమ్మం: ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి సైదిరెడ్డి గురువారం సందర్శించారు..
ఈసందర్భంగా సిబ్బంది పనితీరును, కార్యాలయ రికార్డులను ఆయన పరిశీలించారు..
 జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ లతో ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమళ్ల ఆశోక్ తో కలసి ఆయన సమావేశం అయ్యారు...
 జిల్లా వ్యాప్తంగా కార్యాలయాయాల పనితీరు, రెవెన్యూ తదితర విషయాలను సబ్ రిజిస్ట్రార్ లను అడిగి తెలుసుకున్నారు...

ఆనంతరం ఆయన సిబ్బందికి పలం సూచనలు చేశారు...

సమవేశంలో...ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎ.రవీందర్ ఇతర సబ్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు...

Wednesday, 2 March 2022

ఈ ఫలంతో రోగాలు మటుమాయం....

లక్ష్మణా ఫలం లేదా మిరాకిల్ ఫ్రూట్ Graviola
క్యాన్సర్ నీ తగ్గిస్తుంది అని గత పది సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను.ఒక పండులో 200 పైగా ఫైటో కెమికల్స్ ఉంటాయి దీని అర్థం సైటో టాక్సిసిటీ ప్రభావం చూపుతాయి అచ్చం కీమోథరపీ రేడీయేషన్ లో వలే, కాబట్టి ఈ పండు 10000 సార్లు కీమో థెరపీ అంత ఫభావాన్ని చూపిస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి ఇది లక్ష్మణా ఫలం దొరికే సీజన్ దాదాపు ఏప్రిల్ వరకు దొరుకుతాయి ఈ వీడియో లేదా ఫోటో లో ఉన్న పండు మీకు మీ పెరట్లో లేదా తెలిసినవాళ్ళ దగ్గర ఉంటే (ఎవరికైనా మీకు తెలిసిన వారికి క్యాన్సర్ ఉంటే) వాళ్ళకి పండు గురించి చెప్పి  కాస్త ఇవ్వండి..పండు ఎలా తినాలి అనేదే చాలా మంది ఫోన్ చేసి అడిగే ప్రశ్న ఈ వీడియో లో పండు ఎలా తినాలో ఉంటుంది చూడండి.క్యాన్సర్ తో పాటు క్రియాటిన్ పెరిగి డయాలసిస్ చేయించుకునే వారికి.ఇంకా హెర్పిస్ వంటి వ్యాధులు తగ్గించటానికి రుమటాయిడ్ అర్థైటిస్ ను మరెన్నో ఉపయోగాలు ఈ లక్ష్మణా ఫలం లో ఉన్నాయి.ఒక పండు మొండి వ్యాధి అయిన క్యాన్సర్ ను తగ్గిస్తుంది కదా మీరు మీ ఊరు దాటి ఎక్కడికో వెళ్ళి లైన్ లో నిలబడి క్యాన్సర్ మందు డబ్బు ఇచ్చి తేవక్కరలేదు కేవలం ఈ పండు ఈ లక్షణా ఫలం ఆకు అద్భుతాలు సృష్టిస్తుంది కాబట్టి ఈ మొక్కను పెంచండి.మీ వ్యాధితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు ప్రేమతో మీ డాక్టర్ సుధ కొనకళ్ళ అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు సుధ కొనకళ్ళ హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సత్తుపల్లి .
https://youtu.be/UPxKYC62x_k