Friday, 18 March 2022

ఘనంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ



Today's Paurnami Garuda Seva at Tirumalaతిరుమ‌ల‌, 2022, మార్చి 18
శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

        తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గ‌రుడ వాహ‌నం - స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

       పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
       ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పూర్వ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment