Wednesday, 25 May 2022

హనుమాన్ జయంతి సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలు : పాల్గొన్న ట్రాఫిక్ సీఐ అంజలి...పంచామృతంతో స్వామివారికి అభిషేకం అనంతరం మహా అన్నదానం*


ఖమ్మం : బుధవారం ప్రభావత్ టాకీస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న భక్త ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు ,  పూజలు నిర్వహించారని , అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారని , ప్రత్యేక అలంకరణతో స్వామివారు వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ పేర్కొన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ సీఐ అంజలి మేడం పాల్గొని మాట్లాడారు స్వామి వారికి అంగరంగ వైభవంగా సింధూరార్చన , సహస్రనాగవల్లి దళార్చన , తమలపాకుల పూజ , మంగళహారతి , మంత్రపుష్పంలతో స్వామివారికి పూజలు చేపట్టారని , శివుని అంశ వాయు పుత్రుడు , అర్జునుడికి ప్రియ సఖుడు , శ్రీరామదాసుడుకి ఎర్రని కన్నులుగలవాడు , సంజీవని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు , సాగరాన్ని దాటినవాడు , లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు అని అన్నారు .ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ మాట్లాడుతూ మహా అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 3500మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారన్నారు . బుద్ధిర్బలం , యశోధైర్యం , నిర్భయత్వం , అరోగతా అజాడ్యం , వాక్పటుత్వం గలవాడు హనుమంతుడని తెలిపారు .

No comments:

Post a Comment