Friday, 20 May 2022

పద్మావతి అమ్మవారికి పుట్టింటి చీరే - సారే సమర్పించిన పద్మశాలీయులు..


*చిత్తూరు జిల్లా, నారాయణవనంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా... జరుగుతున్న కల్యాణోత్సవాన్ని  పురస్కరించుకొని... ఈరోజు అనగా 20 మే 2022 శుక్రవారం రోజున... పద్మశాలీయుల  ఆడపడుచు అయిన పద్మావతి అమ్మవారికి "తిరుమల తిరుపతి దేవస్థానం" వారి అధికార లాంఛనాలతో భావనారుషి దేవస్థానం నుండి ఊరేగింపుగా  మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో ఆనందోత్సవాల మధ్య పద్మశాలీయులు చీరె - సారే సమర్పించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన... ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, ప్రముఖ వస్త్ర వ్యాపారి శ్రీ.నక్కా వెంకటేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సేవా సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వెంకటగిరి మున్సిపల్ 6 వ వార్డు కౌన్సిలర్ శ్రీ. మాడా జానకిరామయ్య, డాక్టర్ శ్రీ.ఎస్.వి.  ప్రసాద్,శ్రీ. మడతనపల్లి, ఓబుళపతి,  ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి. విజయలక్ష్మి, శ్రీమతి సరళాదేవి,  శ్రీ.పడిదం మోహన్, శ్రీ. నూకల శ్రీనివాసులు, పద్మశాలీయుల ఆడపడుచులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*
✍🏼
*కె.రమాకాంత్,*              
*సీనియర్ జర్నలిస్ట్,*           *వెంకటగిరి సామాన్యుడు,*                   *సోషల్ మీడియా,*          *ఆంధ్రప్రదేశ్.*

No comments:

Post a Comment