Thursday, 5 May 2022

- *స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన :- ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్

Dt : 05/05/2022
Khammam
. ఖమ్మం నగరంలోని పెవిలన్ గ్రౌండ్ నందు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్తంభాద్రి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  హాజరై ప్రారంభించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్.

- అనంతరం ముఖ్య అతిథులకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం తెలియజేశారు...

- ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ: గత రెండు సంవత్సరాలు కరొన కోవిడ్ వల్ల ఎగ్జిబిషన్లు వంటివి ఏర్పాటు చేయలేదన్నారు.ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం  పిల్లల ఆటల కొరకు ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేసిన వారి బృందాని అభినందించారు.ఎగ్జిబిషన్ నందు చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు,స్టాల్స్ ఏర్పాటు చేయడం,ఎగ్జిబిషన్ నేటి 05/05/2022 నుండి 45 రోజుల వరకు ఉంటుంది,ఎగ్జిబిషన్ సమయం ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది.కావున నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ 
బుడిగం శ్రీనివాస్,పాలెపు విజయ వెంకటరమణ,ఎగ్జిమిషన్ నిర్వాహకులు అప్పీ రెడ్డి,బాలా శౌరి,వాసు,అచ్చయ్య,నాయకులు గౌరీ నాథ్,పసుపులేటి వెంకటేశ్వర్లు,డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment