‘కొయంబత్తుర్ జర్ననలిస్టులు తాము కాసుల కవర్లకోసం కాదు..వార్తల కవరేజ్ కోసమే వచ్ఛామంటూ చెప్పటంతో అవాక్కవడం యూనివర్సిటీ అధికారుల వంతైంది. స్నాతకోత్సవాలు కవర్ చేయడానికి వచ్చిన విలేకరులకు కవర్లో కరెన్సీ నోట్ పెట్టి ఇచ్చారు.దీనిని జర్నలిస్టులంతా తీవ్రంగా వ్యతిరేకించారు.
డబ్బులకు అక్షరాలను అమ్ముకునే వాళ్లలా కనిపిస్తున్నామా అని, పాత్రికేయాన్ని అవమానించిన ఆ యూనివర్సిటీ వారిని నిలదీశారు. జర్నలిస్టులకు సారీ చెప్పాలని ప్రెస్క్లబ్ డిమాండ్ చేసింది.’’ ఇలాంటి వార్తని మీరు అసలు ఊహించి ఉండరు. నిజానికి రేపటి పత్రికల్లో బ్యానర్గా రావాల్సిన వార్తే కానీ రాదు. సింగిల్ కాలమ్ వస్తే గొప్ప!తమిళనాడు లోని భారతీయర్ యూనివర్సిటీలో జరిగింది.
జర్నలిజం విలువలు కాపాడిన కోయంబత్తూర్ ప్రెస్క్లబ్ మోబైల్ నెంబర్ : 9894300104
No comments:
Post a Comment