Sunday, 15 May 2022

సమర్థ యాజమాన్యంతో ముందుకు సాగుతున్న ఎస్.బి.ఐ.టి.: సక్సస్ మీట్ లో మంత్రి పువ్వాడ అభినందనలు


ఖమ్మం నగరం లోని ఎస్.బి. ఐ.టి.ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పలు బహుళ జాతి కంపెనీల్లో ఈ విద్యా సంవత్సరం లో ఇప్పటి వరకు దాదాపు 225 మంది ఉద్యోగాలు సాధించినందుకు కళాశాల మైదానం లో ది.14.05.22 న సాయంత్రం కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరైయ్యారు..
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి కృష్ణ తో పాటు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెట్ జి. ధాత్రీ గారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రూపొందించిన sbittpo.com అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు.ఇందులో ప్లేస్ మెంట్ సాధించిన విద్యార్థులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు సాధించారాన్న పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సమర్థ యాజమాన్యంతో ముందుకు సాగుతున్న ఎస్.బి.ఐ.టి.విద్యార్థులు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై న అజయ్ కుమార్ గారికి కృష్ణ గారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. చివరిగా ఆయన్నుశాలువాతో గౌరవప్రదంగా సన్మానించారు...
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఖమ్మం కార్పోరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ డి.లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ పార్టీ నగర అద్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ లు కమర్తపు మురళీ, బిక్కసాని ప్రశాంత లక్ష్మీ, పసుమర్తి రామ్మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ జి.రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్లు శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్ గార్ల తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, అధికారులు, స్థానిక పెద్దలు , అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....

No comments:

Post a Comment