Friday, 13 May 2022

గీతాంజలిలో ఘనంగా పదవ తరగతి విద్యార్ధుల వీడ్కోలు వేడుక...


ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ లోని గీతాంజలి విద్యానికేతన్  పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి,రచయిత,వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ అట్లూరి.వెంకటరమణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని శ్వాసించి ధ్యానించాలని నిత్యం గెలవాలనే ఆలోచనతో సహజీవనం చేస్తే విజయం తధ్యమన్నారు..
తల్లిదండ్రుల నిరంతర ఆలోచన విద్యార్ధులే అని అందుకే పిల్లల ఎదుగుదలను తమ గమ్యం చేసుకుంటారని అటువంటి తల్లిదండ్రులకు మంచి ఫలితాలను బహుమతిగా ఇవ్వాలని కోరారు..జాతీయ పతాకాన్ని నిరంతరం ప్రకాశింప చేయాలని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టి.వి.అప్పారావు,డైరెక్టర్లు టి.పద్మ,టి.అరుణ్ ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి...

No comments:

Post a Comment