Wednesday, 1 April 2020

భ‌ద్రాద్రిలో సీతారాముల కల్యాణంఆలయ ప్రాంగణంలోనే నవమి వేడుకలు



రాములోరికి  ముత్యాల త‌లంబ్రాలు, పట్టువ‌స్త్రాల‌ను  స‌మ‌ర్పించనున్న మంత్రులు అల్లోల‌, పువ్వాడ‌

భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యానోత్సవం. గురువారం  నిరాడంబ‌రంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆల‌య  అధికారులు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి.  శ్రీ సీతారామచంద్రులకు   ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ముత్యాల తలంబ్రాలు, ప‌ట్టువ‌స్త్రాలను స‌మ‌ర్పిస్తారు. ఇప్ప‌టికే మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భ‌ద్ర‌చ‌లంకు చేరుకున్నారు.  దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, క‌లెక్ట‌ర్ ఎం.వి. రెడ్డి, ఆల‌య ఈవో న‌ర్సింహులు మంత్రికి పుష్ర‌గుచ్చం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం క‌ళ్యాణోత్స‌వ ఏర్పాట్ల‌పై  మంత్రి అల్లోల‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి అధికారుల‌తో చ‌ర్చించారు.

అనంతరం మంత్రి ఇంధ్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న తరుణంలో సామాజిక దూరం అత్యంత అవసరం అయిన పరిస్థితిలో భధ్రాధ్రి సీతారాముల కళ్యాణం ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు... ప్రజలు కరోనా కట్టడి కి తమ వంతు గా సామాజిక దూరం పాటించి వ్యాధి ప్రభలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు..

No comments:

Post a Comment