Wednesday, 25 November 2020

అక్రమణలకు నాకు సంబంధం లేదు : కూరపాటి రంగరాజు

ఖమ్మం, నవంబర్" 25 : TNGOS భూ ఆక్రమణలతో తనకు సంబంధం లేదని తనపై  తప్పుడు కేసులు బనాయించారని టిఎన్జీవో ల మాజీ నాయకులు కూరపాటి రంగరాజ పేర్కొన్నారు. బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో టి ఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన భూ అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొందరు కావాలనే తనపై పై అక్రమ కేసులు బనాయించారని  కూరపాటి రంగరాజు ఆవేధన వ్యక్తం చేశారు.  తన హయo లో ఎలాంటి భూ ఆక్రమణ జరగలేదని 2018లో టీఎన్జీవోస్ నూతన పాలకవర్గం ఏర్పడిందని తనకు సంబంధం లేని విషాయంలో తనను దోషిగా చూడడం సరైంది కాదని ఆయన అన్నారు. సుమారు 8 ఎకరాల భూమి ఆక్రమించారని ఖమ్మం రూరల్, ఖమ్మం టు టౌన్ PC లోని నా పై అక్రమ కేసులు పెట్టాటం జరిగిందని నాపై తగిన విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులను కోరారు తన హయంలోనే 1687 మించి సభ్యులు ఉంటే 1570 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించామని అన్నారు నేను 2016లో పదవి విరమణ అప్పుడే డిసెంబర్ లో TNGOS నుంచి కూడా తొలగించారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు* వీటన్నింటిపై తగిన విచారణ జరిపించి *తనకు న్యాయం చేయాలని విలేకరులను ఉన్నతాధికారులను కూరపాటి రంగరాజు కోరారు*

No comments:

Post a Comment