Thursday, 26 November 2020

మంజీరా నదిలో దూకి ఏఓ ఆత్మహత్య


సంగారెడ్డి: ఆవేశమో..ఆవేదనో ఓ యువ అధికారిణి నిండు ప్రాణం బలి తీసుకుంది. మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి అరుణ అనే వ్యవసాయశాఖ అధికారిణి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం అరుణ సంగారెడ్డి జిల్లాలో రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి కారులో వచ్చిన అరుణ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి బలవన్మరనానికి పాల్పడ్డారు. విషయం అందుకున్న అధికారులు గల్లంతు అయిన అరుణ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పని వత్తిడి వల్లా ఇలా చేసిందా లేక ఏవరైన బెదిరింపులా..మరేదైన కారణం వుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది..

No comments:

Post a Comment