Saturday, 21 November 2020

వేడుక‌గా వెంక‌న్న పుష్ప‌యాగం.

తిరుమల, 21-11-2020 : పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది.@ సత్యన్యూస్

No comments:

Post a Comment