Monday, 9 November 2020

నీవు చేసిన త్యాగం మ‌రువ‌లేనిది : శైలజా చరణ్ రెడ్డి


ప్రవీణ్ కుమార్ రెడ్డి ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్‌ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని,  కుటుంబ సభ్యులకు మరియు  శ్రేయోభిలాషులు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ దేవుడు వారికి మనోధైర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ త్యాగం మరువలేనిదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి కొనియాడారు.  ఐరాల మండలం ను చిరస్థాయి లో దేశంలో నిలిచిపోయే విధంగా నీ త్యాగం... జోహార్లు ఆమె అన్నారు.

No comments:

Post a Comment