Saturday, 31 December 2022

సీతాకళ్యాణాన్ని కనులకు కట్టిన కలేక్టర్ సతీమణి గౌతమి...

 భద్రాచలం, 31 డిసెంబర్:
 శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్  సతీమణి గౌతమి నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.     శనివారం నాడు రాత్రి శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల  సందర్భంగా నాట్య కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతా కళ్యాణం కూచిపూడి నృత్యం చేశారు.సీతా కళ్యాణ ఘట్టాన్ని నర్తనలో చూపరుల కళ్లకు కట్టారు..   అనంతరం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరపున ప్రశంస పత్రం అందించి, సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు
     ఈ కార్యక్రమంలో నృత్య గురువు మీనా కుమారి, వనిత శ్రీ కాదండి చిన్నారులు పాల్గొన్నారు.

Thursday, 29 December 2022

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం


 తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు శ్రీ కెఆర్‌.నారాయణమూర్తి, వారి సతీమణి శ్రీమతి కెఎన్‌.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్‌ఏసి) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు.దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. 
కాగా, ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.

Tuesday, 27 December 2022

“సింగ‌రేణి ద‌ర్శ‌న్”**ప్ర‌త్యేక ప్యాకేజీతో టి.ఎస్‌.ఆర్టీసీ... బ‌స్సును లాంఛ‌నంగా ప్రారంభించిన సంస్థ ఛైర్మ‌న్‌, ఎం.డి**ఇక న‌ల్ల బంగారం గ‌నుల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించే అవ‌కాశం

హైదరాబాద్ : నల్లబంగారం గనుల గురించి ఆసక్తి వున్నవారు ఇహ  టి.ఎస్‌.ఆర్‌.టి.సి బస్లో  సింగ‌రేణి గనులను చుట్టేయ్యవచ్ఛు. సింగరేణి బొగ్గు గనుల సంద‌ర్శ‌న‌కై  స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
ద‌శాబ్ధ‌ కాలానికి పైగా సిరులు కురిపిస్తున్న బొగ్గు గ‌నుల్లోంచి బొగ్గును ఎలా తీస్తారో ప్ర‌త్య‌క్షంగా తెల‌సుకోవాల‌ని కుతూహలంగా ఉండే వారికి ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌నుంది. 
ప్ర‌తి శ‌నివారం  అందుబాటులో ఉండ‌నున్న “సింగ‌రేణి ద‌ర్శ‌న్” బ‌స్సును సంస్థ ఛైర్మ‌న్ శ్రీ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎం.ఎల్‌.ఎ గారు,  మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. 
మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో ఛైర్మ‌న్ మాట్లాడుతూ,  ఈ సేవ‌ల్ని చారిత్రాత్మ‌క నిర్ణయంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న అభివ‌ర్ణించారు. 
న‌గ‌ర అందాల‌ను తిల‌కించేందుకు వ‌చ్చే ప‌ర్యాట‌కుల కోసం  టి.ఎస్‌.ఆర్టీసీ గ‌త కొన్ని నెలల ముందు హైద‌రాబాద్ ద‌ర్శ‌న్  సేవ‌ల్ని ప్రారంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు. 
అలాగే, భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీవారి శీఘ్ర ద‌ర్శ‌న భాగ్యాన్ని కూడా క‌ల్పించిన‌ట్లు చెబుతూ, ఈ మేర‌కు టి.ఎస్‌.ఆర్టీసీ బ‌స్సుల్లో 7 రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌ల్సి ఉంటుంద‌న్నారు. 
ఈ క్ర‌మంలోనే తాజాగా సింగ‌రేణి ద‌ర్శ‌న్ పేరిట స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. 
రానున్న రోజుల్లో కాళేశ్వ‌రం దేవాల‌యంతో పాటు బ్యారేజీని తిల‌కించేందుకు మ‌రో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 
సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ కింద ఒక‌రికి రూ.1600గా నిర్ణ‌యించిన‌ట్లు తెలుపుతూ బొగ్గు గ‌నుల తవ్వే విధానాన్ని ప్ర‌త్య‌క్ష్యంగా ప‌రిశీలించ‌వ‌చ్చ‌న్నారు. 
ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను బ‌ట్టీ సింగ‌రేణి ద‌ర్శ‌న్ స‌ర్వీసుల‌ను పెంచ‌డం జ‌రుగుతుంద‌ని, ఆదాయాన్ని పెంచుకునే  దిశ‌గా టి.ఎస్‌.ఆర్టీసీ అడుగులు వేస్తోంద‌ని స్ఫ‌ష్టం చేశారు. 
సింగ‌రేణి ద‌ర్శ‌న్, హైద‌రాబాద్ ద‌ర్శ‌న్‌ సేవ‌ల్ని వినియోగించుకుని సంస్థ‌ను ఆద‌రించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. 
సింగ‌రేణి డైరెక్ట‌ర్ శ్రీ బాల్‌రాం గారు మాట్లాడుతూ, ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు గ‌నుల త‌వ్వ‌కాల‌ను నేరుగా చూసి ఆనందించే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. 
భూగ‌ర్భ గ‌ని, ధ‌ర్మ‌ల్ ప్లాంట్ ల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించ‌వ‌చ్చ‌ని, ప్ర‌యాణంతో పాటు శాఖాహార భోజనాన్ని కూడా క‌ల్పించ‌డంతో ప్ర‌యాణీకుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు. 
టి.ఎస్‌.ఆర్టీసీ ప్ర‌యాణీకుల సౌక‌ర్యాల వైపు ఆలోచిస్తూ కొత్త కొత్త పంథాలో కార్యాచ‌ర‌ణ దిశగా అడుగులు వేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.
ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హన్సా ఈక్విటీ పాట్న‌ర్స్‌, ఎల్‌.ఎల్‌.పి శ్రీ త్రినాథ్ బాబు గారు, సునీల్ రేగుల గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ శ్రీ మునిశేఖ‌ర్ గారు, శ్రీ వినోద్ గారు, శ్రీ పురుషోత్తం గారు, శ్రీ యాద‌గిరి గారు, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు గారు, సి.పి.ఎం శ్రీ కృష్ణ‌కాంత్ గారు, సి.టి.ఎం శ్రీ జీవ‌న్ ప్ర‌సాద్ గారు, సి.టి.ఎం (ఎం అండ్ సి) శ్రీ విజ‌య‌కుమార్ గారు, క‌రీంన‌గ‌ర్ ఆర్‌.ఎం శ్రీ ఖుష్రో షా ఖాన్ గారు, సి.ఎస్‌.ఒ శ్రీ విప్ల‌వ్ గారు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ప్ర‌జా సంబంధాల అధికారి*

Wednesday, 14 December 2022

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అద్యక్షునిగా లెటర్ హెడ్ పై తొలి సంతకం...కెసిఆర్ కు వెల్లువలా శుభాకాంక్షలు.. అభినంధనలు...

-----------------------------------------------------------
ఢిల్లీలో  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభ హైలైట్స్
-----------------------------------------------------------
తెలంగాణ నుండి కదలిన గులాబీ దండు
ఖమ్మం జిల్లా నుండి తరలిన మంత్రి అజయ్ కుమార్, ఎంపిలు..నామా నాగేశ్వరరావు.. వద్దిరాజు రవి..ఎంఎల్.సి.తాత మధు..ఏంఎల్.ఏ సండ్ర వెంకట వీరయ్య తదితరులు.. 
 .- పలు రాష్ట్రాల మాజీ సీఎంలు, ఎంపీలు, జాతీయ రైతు సంఘాల నేతలు ప్రముఖులతో కలసి బి ఆర్ ఎస్ కార్యాలయం  ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌
- పూర్ణాహుతిలో పాల్గొన్నసీఎం కేసీఆర్‌ దంపతులు, అనంతరం 12.37 గంటలకు గులాబీ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ నేత కేసిఆర్
- అనంతరం కేసిఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయ ప్రారంభం. పాల్గొన్నఅఖిలేశ్ యాదవ్ మరియు కుమార స్వామి.
- కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ లో ఆసీనులైన కేసీఆర్
- బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్ఎస్ కిసాన్ సెల్ ) ఏర్పాటు.
- బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని " నియామకం.
- కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ నియామకం.
- జాతీయ అధ్యక్షుని హోదాలో తొలి నియామక పత్రాలను అందజేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.
 సీఎం కేసీఆర్‌ కు శుభాకాంక్షల వెల్లువ.
-----------------------------------------------------------
భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ  రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ ప్రారంభోత్సవం - ముఖ్యాంశాలు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. 
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. యాగంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, , తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ కిసాన్ నేత గుర్నామ్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
దేశ రాజధానిలో ఎగిరిన గులాబీ జెండా :
పూర్ణాహుతి అనంతరం 12 గంటల 37 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను  ఆవిష్కరించారు. తదనంతరం అతిథులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. 
ఆనంతరం మొదటి అంతస్తులోని తనకు కేటాయించిన ఛాంబర్లో జాతీయ అధ్యక్షుని హోదాలో కుర్చీలో ఆసీనులైనారు.

బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్ర కు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని " ని అదినేత కేసిఆర్ నియమించారు. కార్యాలయ కార్యదర్శి గా రవి కొహార్ ను నియామించారు. జాతీయ అధ్యక్షుని హోదాలో తొలి నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎంపి నామా నాగేశ్వర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజనానికి సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు,  రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. 
ఢిల్లీలో బీఆర్ఎస్ జోష్ : 
బీఆర్‌ఎస్‌ పార్టీ నూతన జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ రోడ్డు జై కేసీఆర్, జై భారత్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబిమయమైంది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొన్నది.  దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం తెలంగాణ భవన్, సీఎం అధికారిక నివాసం 23 తుగ్లక్ రోడ్ లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కేరింతలు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొన్నది. 

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష యాదవ్, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నాం సింగ్, ఇతర రైతుసంఘాల నాయకులు, మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి,  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,   ఎంపీలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి,  బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, పి రాములు, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Monday, 12 December 2022

సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తి శ్రద్దలతో నిత్య కైంకర్యాలు...


విశాఖ /సింహాచలం, సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో  వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా , పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రా గమశాస్త్రం విధానంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Wednesday, 7 December 2022

ఆందోళన వద్దు.. అండగా వుంటాం.. పాత్రీకేయుల ఇంటి జాగా బాధ్యత నాదే : మంత్రి పువ్వాడ

Hyderabad :: 07:12:2022
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 
ఖమ్మం లోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగ ఇప్పించే బాధ్యత తనదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టు మరణిస్తే రూ.లక్ష ఇవ్వడంతోపాటు వారి కుటుంబానికి నెలకు మూడువేల పింఛన్‌, పిల్లల విద్య కోసం ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున అదనంగా ఇచ్చే ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పారు. 
జర్నలిస్టుల కొరకు గతంలో ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు చేసిందేమీ లేదని మంచి చేసిన వారికి జర్నలిస్టులు తోడుగా నిలవాలి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
''ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ'' ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట అని జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి కేసిఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక కూడా కేసిఆర్ లో జర్నలిస్టు సమాజంపై ఉన్న మమకారం ఏ మాత్రం తగ్గలేదు అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తి ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Tuesday, 6 December 2022

జర్నలిస్టుల పట్ల కెసిఆర్ ఆదర్శంగా నిలబడాలి

ఖమ్మం తమ పథకాలు కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల పట్ల కూడా ఆదర్శంగా నిలబడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచించారు ఖమ్మం ప్రెస్క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టులు కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయాలని కోరుతున్నారని ఆయన నొక్కి చెప్పారు.

దశాబ్ద కాలం పైబడి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెరాస ప్రభుత్వం 2014లో ఇళ్ల స్థలాల విషయం తన మేనిఫెస్టోలో చేర్చింసదని 8 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు సదర్ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టుల కనీస అవసరాలు ఇళ్ల స్థలాలు వైద్యం సంబంధించిన సమస్యలను వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణాది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించారని అదేవిధంగా తెలంగాణలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు అలాగే దళిత బంధు తరహా జర్నలిస్టు బంధు పథకం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టాలని అది నూటికి నూరు శాతం జర్నలిస్టులకు వర్తింపజేయాలని ఆయన కోరారు జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు

తిరువణ్ణామలైలో వెలిగిన భరణి దీపం... నేడు కృత్తికా దీపోత్సవం..

తమిళనాడు : తిరువన్నమాలైలో సోమవారం భరణి దీపం కాంతులు వెదజల్లాయి ఆలయంలో అర్చకులు ఐదు పెద్ద ప్రమిదల్లో ఆవు నెయ్యి నింపి ఒత్తులు వేసి సోమవారం ప్రదోషకాలం సాయంత్రం వెలిగించి స్వామివారికి హారతులు ఇచ్చారు.

 సోమవారం 100 ఏళ్ల కాలంనాటి వెండి రథంపై ఊరేగింపు నిర్వహించారు భరణి దీపాన్ని యమగండాలు తొలగించే దీపంగాను సమస్త భారాలు తొలగించే దీపం గాను తమిళనాడు వాసులు భావిస్తారు భరణి దీపం సోమవారం వెలిగించగా ఈరోజు సాయంత్రం కృత్తికా దీప వెలిగించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి తమిళనాడు పోలీసులు కృత్తికా దీపోత్సవానికి భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు ఈ కృత్తికా దీపోత్సవానికి దాదాపు 30 లక్షల మంది వీక్షించేందుకు వస్తారని అంచనాతో భారీ భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ రూమ్ వ్యవస్థలు తిరువన్నమాలై పోలీసులు ఏర్పాటు చేశారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

Monday, 5 December 2022

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము....


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు.అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో  ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ  పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయంగార్‌ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.  అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు.  ఛైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు అందజేశారు.

Sunday, 4 December 2022

ఓటు నమోదు చేసుకున్నారా అంటూ నగర వాసులతో కలేక్టర్ మాటామంతి.. ముందస్తు ఓటరు నమోదు పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం..


ఖమ్మం, డిసెంబర్ 4: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలును జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. కలెక్టర్ నగరంలోని జిల్లా విద్యాధికారి, జిల్లా అటవీ అధికారి కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి, బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అక్కడి ప్రజలను సైతం ఓటు నమోదు చేసుకున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  18 సం.లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకొనేలా, 17 సంవత్సరాలు నిండినవారు ముందస్తు నమోదులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ప్రతి పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను, దివ్యాంగులను ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే, ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివేవారిని ముందస్తుగా దరఖాస్తును ఇవ్వడం కానీ, ఆన్లైన్ లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఫామ్ - 6 ద్వారా నూతన ఓటర్లను నమోదు, ఫామ్ 6(బి), ఫామ్ - 7, ఫామ్ - 8 ద్వారా ఓటర్ల జాబితా వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, సర్వే ద్వారా ఓటర్ నమోదు చేయాలని, అర్హులైన కొత్త ఓటర్ల పేరు వివరాలతో జాబితా తయారుచేసి, వారందరు నమోదయ్యేలా చూడాలని అన్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరించి జాబితా నుండి తొలంగింపుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో వారి వారి పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది క్రొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది, ఎంతమంది మరణించినవారు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయినవారు ఉన్నది, గరుడ యాప్ ఉపయోగిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఇతర పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా ఇవ్వాలన్నారు. ఓటరుగా నమోదు చేయాల్సిన వారి జాబితాను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ గొల్లబజార్ లో ఇంటింటికి వెళ్లి, ఇంట్లో ఎందరు ఉన్నది, 17 సంవత్సరాలు నిండినవారు, కొత్తగా వివాహం అయి వచ్చిన వారు, ఓటు హక్కు ఎందరికి ఉన్నది, లేనివారు నమోదు చేసుకున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. 17 సంవత్సరాలు నిండిన వారి నుండీ ముందస్తు దరఖాస్తులు తీసుకోవాలని ఆయన అన్నారు. అర్హులైన ఒక్కరూ ఓటుహక్కుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, బూత్ స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు. 

Friday, 2 December 2022

కృత్తికా దీపానికి సిద్దమవుతున్న అరుణాచలేశ్వరుడు.... గిరి ప్రదక్షణం చేసిన డిజిపి శైలేంద్రబాబు

తమిళ నాడు : తిరువన్నామలై లో ఈనెల 6న జరగబోయే కృత్తిక దీపోత్సవం భద్రతా ఏర్పాట్లను సందర్భంగా భద్రత ఏర్పాట్లను తమిళనాడు పోలీసు ఉన్నతాధికారి శేలేంద్ర బాబు ips పరిశీలించారు గత ఏడాది కరోనా కారణంగా ఆలయం వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన కృత్తికా దీపం ఈ ఏడాది భక్తుల సందడి మధ్య నిర్వహించనున్నారు లక్షలాదిమంది భక్తులు హాజరై స్వామిని దర్శించుకోనున్నారు ఈ కారణంగా ఈరోజు పోలీసు భద్రతా ఏర్పాట్లను సేలేంద్రబాబు తనిఖీ చేశారు అంతకుముందు ఆయన కొందరు పోలీసు సిబ్బందితో కలిసి గిరిప్రదక్షిణం పరుగు లో పాల్గొన్నారు 14కిలో మీటర్ల అరుణచలం గిరిని 1.52 నిమిషాలలో    చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలు తెలిపారు @ మణికుమార్.

Monday, 28 November 2022

ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించండి : అధికారులకు అదనపు కలెక్టర్ స్నేహాలత సూచన


ఖమ్మం, నవంబర్ 28: గ్రీవెన్స్ డే సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ డే ను పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. 
    ఈ సందర్భంగా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం సువర్ణాపురం గ్రామానికి చెందిన ఎస్కె. మీరాబీ, తన భర్త కరోనా తో మరణించినట్లు, తనకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం మంజూరుకు కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని విచారణ చేసి, తగుచర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశించారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం నుండి నాగలక్ష్మి, సత్యవతి, విజయలక్ష్మీ, మాధవి లు తమకు దళితబంధు పథకం క్రింద షీప్ యూనిట్లు మంజూరు అయినట్లు, ఇంతవరకు గ్రౌండింగ్ చేయలేదని, గ్రౌండింగ్ చేయాలని కోరగా, అదనపు కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి చర్యలకై ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం మంగలగూడెం నుండి రాయల వెంకటయ్య, సర్వే నెం. 192 లో చట్ట విరుద్ధంగా పాస్ పుస్తకాలు జారీచేసారని, విచారణ చేసి తగుచర్యలకు కోరగా, ఖమ్మం రూరల్ తహసీల్దార్ ను తగుచర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం నుండి వనం కృష్ణకాంత్ కోదాడ-ఖమ్మం 365ఏ జాతీయ రహదారి నిర్మాణం పేరుతో మండలంలోని వనరుల దోపిడీ చేస్తున్నట్లు తగు చర్యలకై కోరగా, నేషనల్ హైవే వారిని ఇట్టి విషయమై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వేంసూరు మండలం రాయుడుపాలెం నుండి సిహెచ్. రాధారాణి అంగన్వాడీ ఆయా పోస్టులో నియామకం గురించి కోరగా, జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలనకై ఆమె ఆదేశించారు. కామేపల్లి మండలం ఉట్కూరు నుండి ఎస్కె ఖాసిం, గ్రామంలోని మసీదుకు సంబంధించి వివరాలు కోరగా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ అసోసియేషన్ వారు, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేసిన ఆప్టోమ్స్ ను రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా దరఖాస్తు ద్వారా కోరగా, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని పరిశీలించి, తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సుందరయ్య నగర్ నుండి తోట నాగమ్మ తన ఇంటి ప్రక్క రెండు ఖాళీ ప్లాట్లు చెత్త చెదారం తో నిండివున్నాయని శుభ్రం చేయించుటకు కోరగా, మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు వెంటనే చర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. 
    ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శాఖల వారిగా పెండింగ్ గ్రీవెన్స్ లను సమీక్షించారు. గ్రీవెన్స్ లను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రీవెన్స్ వెబ్ సైట్ లో దరఖాస్తుల పరిష్కారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. 
    ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Minister Ajaykumar launched Equality Protection Campaign

Hyderbad : State Transport Minister Puvvada Ajay Kumar and Vasantha Lakshmi formally launched the Equality Protection and Empowerment Campaign of the Disabled by Brahmakumaris in collaboration with the Telangana Government at the minister's residential complex in Hyderabad. After that, they started the campaign bus trip by waving the flag.
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో బ్రహ్మకుమారిస్ వారు చేపట్టిన దివ్యాంగుల సమానత్వం పరిరక్షణ, సాధికారత ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి దంపతులు.అనంతరం ప్రచార బస్సు యాత్రను జెండా ఊపి వారు ప్రారంభించారు.

Sunday, 27 November 2022

శబరిమలై సన్నిదిలో పోటేత్తిన జనం...80వేలు పైగా ఆదివారం దర్శనం.. స్వచ్ఛ సర్వేక్షన్ పై అధికారుల దృష్టి...

శబరిమలై లో అయ్యప్పలు పోటెత్తారు సన్నిధానం మాలా దారులు, ఇరుముడి దారులతో నిండిపోయి రద్దీగా కనిపిస్తోంది శనివారం 80,000 పైగా అయ్యప్ప స్వామిని దర్శించినట్లు శబరిమలై దేవస్థానం  బోర్డు తెలిపింది. ఆదివారం కూడా అదే మొత్తంలో భక్తులు రద్దీ నెలకొని ఉంది స్వామి శరణం నామస్మరణతో శబరి కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ ఎడాది కొవిడ్ ఆంక్షలు పూర్తిగా తొలగడంతో పాటు..ఎక్కువ గా స్వాములు మాలాధారణ  చేసినట్లు లెక్కలు చేబుతుండగా..యాత్రికుల సౌకర్యార్థం శబరిమల దేవస్థానం బోర్డ్ పలుచోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి సమాచారం సహకారం అందజేస్తుంది శబరిమలై యాత్రికుల కోసం చెంగనూరు కొట్టాయం కొచ్చిన్ తోపాటు పంబ ఎరిమేలీ, శబరిమల దేవస్థానం ప్రాంతంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం బోర్డు తెలియజేసింది భక్తులు ఈక్వూని సందర్శించడం ద్వారా ఎక్కువ సమయం పట్టకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంది శబరిమలై లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు మరోవైపు కేరళ అటవీశాఖ వివిధ స్వచ్ఛంద  సంస్థలను కలుపుకొని పర్యావరణ శుభ్రత పై యాత్రికులకు అవగాహన కల్పిస్తోంది శబరిమల పంబ అటవీ ప్రాంతాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్లాస్టిక్ కు తదితర వ్యర్ధాలను ఈరోజు తొలగించారు..
@ మణికుమార్..
(సహకారం శబరిమల నుండి
ఇంటూరి రామకృష్ణ)

అభివృద్ధిలో ఖమ్మం బేష్... అధికారులు ఖమ్మం చూసి రావాలని కేసీఆర్ సూచన

హైదరాబాద్ : 
◆నిజామాబాద్ అభివృద్ధిపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం అభివృద్ధి పై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరం గా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూరు వెల్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామా బాద్ అధికారులను, ఎమ్మెల్యేలను సిఎం కేసీఆర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ కవిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Thursday, 24 November 2022

ఓటు ప్రాధాన్యతపై అవగాహన పెంచండి : అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్..


ఖమ్మం, నవంబర్ 24: గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లాలో పర్యటించి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం క్రింద క్రొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితా లో తొలగింపు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తల్లంపాడు, జలగం నగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్ లను సందర్శించి అక్కడ చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ క్రొత్త ఓటర్లు పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఉన్నది, మరణించిన వారి ఓట్ల తొలగింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మందికి క్రొత్త ఓటర్ నమోదు ఫారాలు ఇచ్చింది, ఇప్పటివరకు ఎంతమందిని నమోదు చేసుకుంది అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి పోలింగ్ కేంద్రం పరిధిలో క్రొత్తగా వచ్చిన వారిని ఎలా నమోదు చేసుకుంటుంది, ఎన్ని దరఖాస్తులు వచ్చింది, విచారణ ఎలా చేస్తుంది అడిగి తెలుసుకున్నారు. ఆధార్ సేకరణ పురోగతిని అడిగారు. సంబంధిత తహశీల్దార్లు ప్రతివారం బూత్ లెవల్ అధికారులను పిలిచి ప్రక్రియ పై సమీక్షించాలన్నారు. మండల పరిధిలో ఎన్ని కళాశాలలు ఉన్నావో, వాటి నుండి దరఖాస్తులు స్వీకరించి, అడ్రసుల ప్రకారం సంబంధిత మండలాలకు పంపాలన్నారు. సూపర్వైజర్లు వారి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన చేయాలని, ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థినులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మంచి, చెడులు జరుగుతుంటాయని, అన్నిటికీ మనం సాక్ష్యంగా ఉంటామని, వీటితోనే మన సమస్యలు తెలుసుకుంటామని అన్నారు. ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనే అవగాహన ఉంటే చాలని ఆయన తెలిపారు.
కళాశాలలో 680 మంది క్రొత్త ఓటర్లు గా నమోదు అవుతున్నట్లు, ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, మంచి సమాజ నిర్మాణం కోసం అంతా కలిసి పనిచేయాలని అన్నారు. ఓటరుగా అర్హులైన వారందరు నమోదవ్వాలని,ఓటు ప్రాధాన్యత పై కుటుంబం, సమాజం అందరితో మాట్లాడాలని, ఓటుతో మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వాలని ఆయన తెలిపారు.
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 17 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నుండి ముందస్తు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ఓటు చాలా విలువైనదని, ఎన్నికల ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు. 
   కార్యక్రమంలో కళాశాల ఓటరు నమోదుకు నియమించబడ్డ అంబాసిడర్లచే ఓటరు నమోదుకు చేపడుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఓటు ప్రాముఖ్యత వారు తెలిపారు. ఓటు అమ్ముకోకూడదని విద్యార్థినులు చేసిన స్క్రిప్ట్ ఆలోచింపచేసింది.
    ఈ సందర్భంగా ఓటరు నమోదుపై రూపొందించిన పోస్టర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆవిష్కరించారు.
     ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. పద్మావతి,  ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్, ఎస్డీసి దశరథం, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, తహశీల్దార్లు సుమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో పోడుభూముల సమస్య త్వరలోనే పరిష్కారం.... ఈడీ దాడులకు బెదరం : ఎంఎల్ సి తాతామధుసూదన్

24-11-2022
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం.
---------------------------------------------------------
*ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహణ..*

*టిఆర్ఎస్ పార్టీ తరఫున విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాస్ రావు గారికి నివాళులు అర్పించిన 
*పోడు భూముల సమస్యలను తీర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పటికే కసరత్తు బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసినందున. త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు.ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలసి పాల్గొని మాట్లాడారు.
 తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇడి, ఐటి అధికారులు దాడులు చేస్తున్నారని, BJP పార్టీ ఉడత ఊపులకు తెలంగాణ బిడ్డలు భయపడే ప్రసక్తే లేదంటూ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంపై అనేక కుట్రాలు., కుయుక్తులు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీ నిరంకుశ విధానాన్ని  తాత మధుసూదన్ .తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈడీ దాడులతో టిఆర్ఎస్ నాయకులను కేంద్ర బిజెపి భయపెట్టించాలని చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నడుస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను లొంగదీసుకునేందుకే తమ చేతిలో కీలుబొమ్మగా ఉన్న ఈడి లను మన రాష్ట్రంలో ఉపయోగించి మొన్న నామ నాగేశ్వరరావు , నిన్న మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ రవిచంద్ర, నేడు మంత్రి మల్లారెడ్డి పై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు*
*తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తెలంగాణ గడ్డపై స్వామీజీల ముడుపుల రూపంలో పట్టుబడిన బిజెపి నాయకుల బండారం బయటపడిందని ఈ వ్యవహారంతోనే బిజెపి పార్టీ గోరి కట్టడం ఖాయమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలుగా చలామణి అవుతున్న బిజెపి ఎంపీలు రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కుంగలో తొక్కి గుజరాతీలకు గులాం గిరి చేస్తున్న బిజెపి నాయకులకు త్వరలోనే తెలంగాణ ప్రజలు తమ గుణపాఠం నేర్పుతారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంగా మెలుగుతున్నారని, తెలంగాణ బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరికినే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితమ్మ పై అవక్కులు చవాకుల పేలిన ఎంపీ అరవింద్ ఇకనైనా బుద్ధితో మెలగాలని హితవు పలికారు. Bjp నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  తెలంగాణ రాష్ట్రంలో CM కెసిఆర్  చేస్తున్న సంక్షేమ పథకాలతో యావత్ దేశంలో తమకు రాజకీయ ఉనికి కోల్పోతామని భయపడుతున్న బిజెపి నాయకులు కొందరు వ్యక్తులతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర పన్నుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని, తెలంగాణ ప్రజలంతా జాగ్రత్తగా మెదగాలని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ & జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, నగర మేయర్ నీరజ , రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు , కార్పొరేటర్ కమర్తపు మురళి , మాజీ జిల్లా గ్రంథాలయ  చైర్మన్ ఖమార్ , రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 23 November 2022

ఆ నలుగురై ముందు నిలిచిన తెరాస నేతలు..శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి...

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తికోయలు(వలస ఆదివాసులు) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డి మరణించిన ఎఫ్ఆర్వో చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియలకు తెరాస నేతలు ఆ నలుగురై ముందు వరుసలో నిలిచారు..R.O శ్రీనివాస రావు భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎం.ఎల్.సి.తాత మధులు అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. కెసిఆర్ ఆదెశాల మేరకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో చండ్రుగొండ చేరుకున్న తెరాస నేతలు. FRO శ్రీనివాసరావు  దేహాన్ని  సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.  ఇటువంటి దారుణాలు ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మంత్రులు అజయ్ని కుమార్స, ఇంద్రకరణ్ రెడ్డి లు పేర్కొన్నారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన విషయం పేర్కొన్నారు.అనంతరం శ్రీనివాసరావు పాడే మోసారు..ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 
కార్యక్రమంలో వీరితో పాటు ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితాహరం OSD ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ (HoFF) దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కలెక్టర్ VP గౌతమ్, కొత్తగూడెం SP వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Monday, 21 November 2022

ప్రతాపని నరసింహారావు దంపతులచే లక్ష రుద్రార్చన..శివకళ్యాణం....

ఖమ్మం : కమనీయ కార్తీకం చివరి సోమవారం బ్రాహ్మణ బజార్ లోని శ్రీభ్రమరాంబా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్ఛారు..
అభిషేకాలు..అర్చనలు ఈశ్వరునికి ప్రీతికరంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం 8 గంటలక గణపతి పూజ,పాశుపతహోమం
10 గంటలకు మహాన్యాస పూర్వక అభిషేకం
మధ్యాహ్నం12 గంటలకు లక్ష  రుద్రాక్షార్చన
సాయంత్రం 4 గంటలకు శాంతి కల్యాణం , జ్యోతిర్లింగార్చన అనంతరం సాయంత్రం కోటి దీపాల వెలుగులతో ఆలయప్రాంగణం జ్యోతి ర్శయంగా శోభిల్లింది..
 ప్రతాపని నర్సింహారావు దంపతుల నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి శివాలయ ప్రధాన అర్చకులు బాదంపూడి కాళిప్రసాద్ నేతృత్వం వహించగా బాదంపూడి శివకుమార్, విజయకుమార్, పృథ్వి, నాగేశ్వరరావు, రామారావు తదితరులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.

Wednesday, 16 November 2022

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. జిల్లా జడ్జ్ డా.టి.శ్రీనివాసరావు సూచన


ఖమ్మం, నవంబర్ 16:  జిల్లా కోర్టులో పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులతో ఏర్పాటుచేసిన 4 కోర్ట్ హాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్ట్, ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్-కమ్-ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్ట్ హాళ్ల నిర్వహణకు భవన పునర్నిర్మాణం చేపట్టి, ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనిని ప్రతి రోజు చేయాలని ఆయన అన్నారు. తాను వచ్చినప్పటి నుండి సత్తుపల్లి బార్ అసోసియేషన్, ఖమ్మం బార్ అసోసియేషన్ లకు కలెక్టర్ సహకారంతో ఏసీ లు పెట్టించినట్లు, ఇంకా భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో ప్రధమ స్థానంలో నిలిచామని ఆయన తెలిపారు. 
    కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, న్యాయవాదులకు, ప్రజలకు సౌలభ్యం కొరకు సమీకృత కోర్టు భవనాల సముదాయం నిర్మించినట్లు, ఇది చూసే పాలనా సౌలభ్యం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పౌరునికి న్యాయం అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పనిచేయాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి సామాజిక కోణంలో పనిచేస్తున్నారని, ప్రజల్లో న్యాయం లభిస్తుందనే నమ్మకం కల్గిస్తున్నారని, న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. కోర్టులో ఏసీ, ఫర్నిచర్ లకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 
  ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి డానిరూత్, ఎస్సి/ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి అమరావతి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జావిద్ పాషా, న్యాయమూర్తులు శాంతిసోని, మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు, బార్ బాధ్యులు వీరేందర్, వీరన్న, యాకుబ్, వెంకట నారాయణ, ఇమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి


కొమురం భీం ఆసిఫాబాద్
జిల్లాలోని పలు మండలాలలో నిర్మించిన ఏడు పోలీస్ స్టేషన్ లను బుధవారం హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చి దేశంలోనే ఎక్కడ లేనివిధంగా హైదరాబాదులో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలను ప్రకటించిన అనంతరం అడ్మినిస్ట్రేషన్ , ల్యాండ్ ఆర్డర్ చాలా చక్కగా పనిచేస్తున్నాయని తెలిపారు. పౌరరక్షణ, శాంతిభద్ర తలను కాపాడటంలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నరని వారికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారక్షణకు కృషి చేస్తారని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వాంకిడి, రెబ్బెన్ కాగజ్ నగర్ రూరల్, పెంచికల పేట్, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్ నగర్ సర్కిల్ భవనం నిర్మాణాలకు రెండేళ్ల క్రితం నిధులు విడుదల చేశామన్నారు. భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి కాగా వీటిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, డిజిపి మహేందర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

స్టూడెంట్ ముసుగులో డ్రగ్ దందా... పాతబస్తీ పోలీసులకు చిక్కిన సూడానియన్...


*హైదరాబాద్:* బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలిస్తున్న డ్రగ్​ పెడ్లర్​​ను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్,ఒక మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్​కు డ్రగ్స్​ తరలించి అమ్ముతున్న సూడాన్​ దేశానికి చెందిన ​డ్రగ్​ పెడ్లర్​ను​​,హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు.సూడాన్​ దేశానికి చెందిన మహ్మద్ యాకుబ్ భారత దేశానికి చదుకోవడానికి వచ్చాడు. కానీ చదువు ముసుగులో అక్రమంగా బెంగళూరు నుంచి డ్రగ్స్​ తరలించి హైదరాబాద్​లో అమ్ముతున్నాడు.ఈ క్రమంలో ఈరోజు పాతబస్తీ, ఫలక్​నుమా పోలీసులు, హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ అధికారులతో కలిసి చేపట్టిన జాయింట్​ ఆపరేషన్​లో ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో నిందితుడు పట్టుపడ్డాడు. యాకుబ్ గతంలో హైదరాబాద్​లోనే ఉండేవాడని అతనిపై రాజేంద్రనగర్​, కుషాయిగూడ పోలీస్ స్టేషన్​లో కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.అతడి వద్ద 12 గ్రాముల యమ్​డియమ్​ఏ డ్రగ్స్,ఒక మొబైల్​ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tuesday, 15 November 2022

అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు...వ్యక్తి గతంగా మంచి మిత్రుడిని కొల్పోయానన్న కెసిఆర్.. బాధాకరం... మంత్రి పువ్వాడ.

Hyderabad/15.11.2022
👉
వ్యక్తి గతంగా మంచి మిత్రుడిని కొల్పోవడం బాధకరం .అధికార లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అదేశాలు జారీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు..మంత్రులు హరీష్ రావు..అజయ్ కుమార్ తదితరులతో కలసి నానాక్ రామ్ గూడాలోని కృష్ణ గృహానికి వెళ్లిన కెసిఆర్...కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మహేష్ బాబును పలకరించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్వక్తం చేశారు..అల్లూరి సీతారామరాజు గా కృష్ణ దేశభక్తి చాటాడంటూ గుర్తుచేసుకున్నారు
 ముఖ్యమంత్రి కేసీఆర్..
ప్రముఖ చలనిత్ర సీనియర్ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి ముఖ్యమంత్రి కేసీఅర్ గారితో కలిసి వెళ్లి కృష్ణ పార్ధీవదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు.
కృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని అన్నారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Sunday, 13 November 2022

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ప్రారంభించిన మంత్రి హారీష్ రావు...


• రాష్ట్రంలోని 887 PHC ల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, TSMSIDC అనుసంధానం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దీని ద్వారా. ఉన్నతాధికారులు ఎక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. 
ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇచ్ఛేందుకు మానిటరింగ్ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా వుంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. 
• డాక్టర్లు తమ phc లోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుంది. 
•  మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్ తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుంది. 
•  సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుంది. 
•  ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారి. 
• తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ గారు బలోపేతం చేస్తున్నారు.
•  43 పిహెచ్సి లకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశాం. 372 పిహెచ్ సి ల మరమ్మతులను 43 కోట్ల 18 లక్షలతో చేపట్టాము. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు శాంక్షన్ ఇచ్చాము. ఒక్కో దానికి 20 లక్షల ఖర్చు చేస్తున్నాం. అన్నిటికి కలిపి మొత్తంగా 247 కోట్లు వెచ్చించాం. 1497 సబ్ సెంటర్ లను ఒక్కోదానికి 4 లక్షల చొప్పున 59 కోట్లతో మరమ్మత్తులు చేపట్టాము.
• మునుగోడు ఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించాము  వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తాం. దీంతో అన్ని phc ల్లో డాక్టర్లు ఉంటారు. 
• పల్లె దవాఖానల కోసం 1569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. 
• రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 
• ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైంది. 
• వీటి వల్ల ఉస్మానియా, గాంధీ,ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గింది. 
• 2019లో ఉస్మానియా హాస్పిటల్ లో 12 లక్షలు ఓపీ ఉంటే.. ఈ ఏడాది  5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5లక్షల నుండి 3.70 లక్షలకు, నిలోఫర్ లో  8 లక్షల నుండి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్ లో 4 లక్షల నుండి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ సర్జరీల పెరిగాయి. 
• తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారు. 
• వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసానన్న సంతృప్తి కలిగింది. 
• స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం. 
• కేంద్రం 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చినా ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాం. స్వయంగా నేనే పత్రాలు తీసుకొని వెళ్తాను. కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా..?

బ్రహ్మాణ, ఆర్యవైశ్య సంఘాల వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్

Khammam/13.11.2022
ఖమ్మం నగరంలో పలు కుల సంఘాల అధ్వర్యంలో వేరు వేరుగా నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
శ్రీనివాస నగర్ లోని SN మూర్తి మామిడి తోటలో వేరు వేరుగా జరిగిన బ్రహ్మాణ   ఆర్యవైశ్య సంఘాల, వైఎస్ఆర్ నగర్ వద్ద గల మామిడి తోటలో NRI పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని వారిని అభినందించారు. కుల సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు కాకుండా అయా కులాలలో పేదలకు చేయుత ఇవ్వాలని.. ఆర్థికంగా అభివృద్ధి కోసం సంఘం నేతలు పనిచేయాలని సూచించారు..