Sunday, 3 July 2022

మంచులింగంగా త్రయంభకేశ్వరుడు... .60ఏళ్ల తరువాత అధ్భుతం..

👉మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాయంలో అద్బుత ఘటన జరిగింది. శివలింగం చుట్టు మంచు వ్యాపించింది. విషయం తెలియడంతో ఆలాయానికి భక్తులు పోటెత్తారు.. ప్రతిరోజు పూజలో భాగంగా పూజారులు పూజ చేయటానికి ఆలయంలో వెళ్లారు. లింగం చుట్టు తెల్లగా ఉండటాన్ని గమని తాకి చూడటంతో. శివలింగం మీద గట్టిగా మంచు ఏర్పడి చల్లగా ఉంది.
గర్భగుడిలోని ఆలయంలో లింగం చుట్టు మంచు వ్యాపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పూజారులు అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పూజారీ శివలింగం చుట్టు పువ్వులు పెట్టి అలంకరించారు. పూజారులు.. శివలింగం పక్కన కూర్చుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భారత్, చైనా యుధ్దం తర్వాత.. అనగా..1962లో ఇలాగే నాసిక్ లో.. శివలింగం చుట్టు మంచు వ్యాపించిందని కథలుగా చెప్పుకుంటారు. ప్రస్తుతం మరోసారి లింగం మొత్తం మంచుతో కప్పబడింది. అయితే, వాతావరణం లో మార్పులు వల్ల ఇప్పుడు మరోసారి శివలింగం చుట్టు మంచు వ్యాపించినట్లు భావిస్తున్నారు. .
త్రయంబకేశ్వరాలయం, నాసిక్
త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
త్రయంబకేశ్వరాలయం
పురాణ ఇతిహాసం, చరిత్ర సవరించు
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
ఆలయ విశేషాలు సవరించు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక సవరించు
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయ్ం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంతే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయదం వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చు ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చొట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడింది.
నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషను నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి.

No comments:

Post a Comment