Wednesday, 6 July 2022

సాయి మందిరంలో వైభవంగా సుదర్శన హోమం

 
ఖమ్మం గాంధీచౌక్ లోని వరప్రదాత శిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా బుధవారం సుదర్శన హోమం నిర్వహించారు సుదర్శన హోమంలో ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు చేత అర్చకులు విశేష రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయ సిద్ధంగా హోమాన్ని నిర్వహించారు షిరిడి సాయి కి ప్రత్యేక పూజలు అన్నాభిషేకం జరిపారు.ఈ విశేష కార్యక్రమంలో మందిరం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ ఆలయ కమిటీ సభ్యులు తీర్థాల శ్రీనివాసరావు నూనె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment