Monday, 11 July 2022

కిసాన్ పరివార్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి బ్రాంచి ప్రారంభం .


ఖమ్మం : వైరారోడ్డు సురభి హాస్పిటల్ కాంప్లెక్స్ లో మూడో ఫ్లోర్ నందు కిసాన్ పరివార్ మొట్టమొదటి నూతన బ్రాంచిని చైర్మన్ ఎన్.బి నాయక్ ప్రారంభించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ కిసాన్ పరివార్ సేవాదల్ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సహజ సిద్ధ వ్యవసాయం వైపు మళ్లించి రైతును రాజుగా చూడాలనే ఆశయంతో మా సంస్థను నెలకొల్పామన్నారు . సేంద్రియ సాగుతో మనిషికి ఆరోగ్యాన్ని , ఆయుష్షునీ ఇవ్వాలనే ఉద్దేశంతో రైతులు సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకోవలన్నారు . 2016లో స్థాపించారని తెలంగాణ మొత్తం మీద మూడు బ్రాంచిలు ఉన్నాయని , వారి సంస్థలు పన్నెండు దేశాల్లో ఉన్నాయని పండిన పంటను నిల్వ ఉంచడానికి గోధములు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ పద్ధతి ద్వారా డైరెక్టర్ కస్టమర్ దగ్గరకు తీసుకెళ్తానని తెలిపారు . రైతులకు మంచి ధర రావాలని ఎక్స్పోర్ట్స్ , ఇంపోర్ట్ కూడా చేస్తున్నారని ధర ఎక్కువ యక్కడ  ఉంటుందో అక్కడికి పంటను పంపించడానికి కొన్ని  కంట్రీలతో మాట్లాడి పంపిస్తున్నారని . ముందు ముందు ఆన్లైన్ యాప్ ద్వారా కూడా డీలర్లకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . హైదరాబాద్ , బెంగుళూర్ , కలకత్తా , పుణె , నాగపూర్ , హర్యానా , ముంబై , ఢిల్లీ ప్రాంతంలో ఉన్నాయన్నారు . తల్లిదండ్రులు  డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని కోరుకుంటారు , అలాగే ఇంజనీరింగ్ కొడుకు ఇంజినీరింగ్ కావాలని కోరుకుంటారు , పొలిటీషన్ కొడుకు పొలిటీషన్ కావాలని కోరుకుంటారు కానీ రైతు కొడుకు రైతు కావాలని ఎందుకు కోరుకోరు . వారు పడే కష్టాలు , అవస్థలు , నష్టాలు ఉంటాయి కాబట్టి రైతు కోరుకోరు వాటికి పరిష్కారమే ఈ కిసాన్ పరివార్ సంస్థను స్థాపించారని పేర్కొన్నారు . ఒక రైతు కుటుంబం నుండి ఉద్భవించింది . సామాన్యమైన రైతును అసామాన్యుడుగా చెయ్యాలని దిని యొక్క ఉద్దేశమని అన్నారు . తన ఒక స్టాండింగ్ కెరియల్ పెట్రోల్ బాయ్ నుంచి ఫోక్స్ మ్యాగజైన్ లో నాలుగు పేజీలు వరకు తనకంటూ ఉందన్నారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాము కుమార్ , రూలర్ డెవలప్మెంట్ సీ.ఈ.ఓ. అచ్యుతరావు , మేనేజర్ సురేష్ , గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment