Tuesday, 5 July 2022

షిర్డీసాయికి తమలపాకుల సమర్పణ....

 
ఖమ్మం : నగరంలోని గాంధీచౌక్ శ్రీషిర్డీసాయి మందిరంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి ఉత్సవాలు మూడవ రోజు సందర్భంగా మంగళవారం ఉదయం నుండి గణపతి పూజ , మంటప ఆరాధన , శ్రీ సాయినాధునికి 41 వేల తమలపాకులతో అర్చన , అలంకరణ మరియు “చండీ హోమం" సాయి హారతులు , నీరాజన మంత్రపుష్పము , చతుర్వేదస్వస్తి , పవళింపుసేవ కార్యక్రమాలు జరిగాయి . ముఖ్య అతిథులుగా జె.ఎస్.ఆర్.ఇన్ఫోటెక్ అధినేత జూలకంటి శ్రీనివాస్ రావు దంపతులు , శ్రీ సిటీ అధినేత మరియు  ప్రముఖ రియల్టర్ వ్యాపారస్థులు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ దంపతులు బాబా వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు . ఈ సందర్భంగా వచ్చిన అతిథులను ఆౠలయం కమిటి చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు , కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ , ప్రసాద్ లు శాలువాతో ఘనంగా సత్కరించి బాబా వారి ఫోటో ప్రేమను అందించారు .

No comments:

Post a Comment