రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యలపై సీఎం అదేశాలిస్తున్నారు.
అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ సీఎం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.
తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సిఎం కేసిఆర్ మరోమారు స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు శ్రీ రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు శ్రీ రాజశేఖర్ రెడ్డి, శ్రీమతి స్మితా సబర్వాల్, శ్రీ భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ శ్రీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి శ్రీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment