Monday, 12 October 2020

13 వేల మందికే దుర్గమ్మ దర్శనం..

విజయవాడ

బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో దసరా ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.. ఉత్సవాల ఏర్పాట్లపై క్రిష్ణా జిల్లా కలేక్టర్  ఇంతియాజ్ స్పందించారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు 
కోవిడ్ ద్రుష్ట్యా ఇంద్రకీలాద్రి పై పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రోజుకు పది వేల మందిని మాత్రమే అనుమతిస్తాం 
మూలానక్షత్రం రోజున 13 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
భక్తులు మాస్క్ ధరిస్తేనే క్యూలైన్ లోకి అనుమతి వుంటుందని స్పష్టం చేశారు.
తొలి రోజు మినహ  మిగిలిన అన్ని రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం 
మూలానక్షత్రం రోజున తెల్లవారుజామున 
3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం వుంటుందని, అన్ని క్యూలైన్ల లో ఎప్పటికప్పుడు శానిటైజ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
కరోనా ద్రుష్ట్యా అంతరాలయ దర్శనం వుండథని.. ముఖ మండప దర్శనం మాత్రమే కల్పిస్తున్నాట్లు కలేక్టర్ చెప్పారు.
కరోనా ద్రుష్ట్యా అన్ని స్నాన ఘాట్లను మూసివేస్తున్నట్లు చెప్పారు. తలనీలాలు సమర్పించేందుకు అనుమతి లేదని,
ఈ ఏడాది సాంస్ర్కుతిక కార్యక్రమాలను సైతం రద్దు చేశామన్నారు. దసరా లో భవానీ దీక్ష తీసుకున్న భక్తులు వాళ్ళకు సమీపంలోని దేవాలయాల్లోనే మాల విరమణ చేయాలని     కలేక్టర్ విజ్జప్తి చేశారు.
దసరా చివర రోజు తెప్పోత్సవానికి ఘాట్లలోకి భక్తులను అనుమతిలేదని..
భక్తుల రద్దీ అధికంగా‌ ఉంటే స్లాట్ పెంచడంపై మరో సారి చర్చిస్తామని చెప్పారు..

No comments:

Post a Comment