పెద్దశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం :
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పెద్దశేష వాహనంపై స్వామివారు కొలువు తీరారు. కొవిడ్-19 నిబంధనల కారణంగా .శ్రీవారి కళ్యాణ మండపంలో ఏకాంతంగా శ్రీవారిని పెద్ద శేషవాహనంపై ఆశీనులుగా జేశారు..
నిత్యసేవకుడైన శేషుణ్ణీపై స్వామిని దర్శిస్తే భక్తులకు సత్పలితాలు , సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
కాగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు ఆ తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం జరిగింది*
...............................
ఓం నమో వేంకటేశాయ
No comments:
Post a Comment