బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాద్ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తోంది. కంగనా ఇటీవలే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆమె నటిస్తున్న జయలలిత బయోపిక్ తలైవి షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో కంగనాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే జయలలిత జీవిత కాలంలో కరోనా లేదు ప్రస్తుతం కరోనా కారణంగా జయలలిత పాత్రలో కంగనా అసెంబ్లీ సన్నివేశంలో మాస్క్గా ధరించి కనిపింంచింది, కాగా హైదరాబాద్ వాతావరణంపై కంగనా ప్రత్యేకంగా స్పందించారు.హైదరాబాద్ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని పేర్కొన్నారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలం చలి..ఉషా కిరణాల వేడమిని ఫిల్మ్ సిటీలో ఆస్వాదిస్తూన్నట్లు ట్వీట్ర చేసింది. .
No comments:
Post a Comment