Wednesday, 28 October 2020

ఖైదీలకు బేడీలు వేసి అతి ఉత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకున్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని*

గుంటూరుజిల్లా

నరసరావుపేట ప్రత్యేక మొబైల్ కోర్టు ఉత్తర్వుల మేరకు నరసరావుపేట సబ్ జైలు నుండి జిల్లా జైలు గుంటూరుకు వివిధ కేసులలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 43 మందిని తరలించే క్రమంలో,ఖైదీల చేతులకు బేడీలు వేసి అతి ఉత్సాహం ప్రదర్శించిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై  శాఖా పరమైన చర్యలు తీసుకున్న గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని

ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు హెడ్ కానిస్టబుళ్ళను సస్పెండ్ చేశారు, ఆర్ఎస్ఐ,ఆర్ఐ లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు నిమిత్తం అదనపు ఎస్పీ స్థాయి పోలీస్ అధికారిని నియమించారు

No comments:

Post a Comment