శోభానాయుడు కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమె వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీపురస్కారం అందుకున్నది.
హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ తద్వారా పిల్లలకు శిక్షణ నిస్తోంది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాను అందుకున్నారు. 2001 - పద్మశ్రీ పురస్కారం
1982 - మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి
1998- ఎన్టీయార్ పురస్కారం
1990 - సంగీత నాటక అకాడమీ పురస్కారం
2011 - తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు
No comments:
Post a Comment