Sunday, 24 December 2023

ఘనంగా సత్య సాయి ధ్యానమండలి రజతోత్సవం...ఉర్రూతలూగించిన మాటల మరకతమణి ప్రాసమణి ప్రసంగం...



ఖమ్మం: సత్య సాయి ధ్యానమండలి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ శాఖ రజతోత్చసవ చతుర్ధ వేడుకలు ఖమ్మం గుర్రం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.
ఒక వైపు గురు భక్తి, వైపు ఉత్సాహవంతమైన ఆటలు పాటలు, కూచిపూడి నృత్యాలతోపాటు.. మాటల మరకతమణి ప్రాస మణి ఉపన్యాసం ఆహ్వానితులను కట్టి పడేశాయి..
ఆదివారం ఉదయం 6 గంటలకు డాక్టర్ మురళీకృష్ణ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో గణపతి నవగ్రహ చండీ శాంతి హోమాలు నిర్వహించారు అనంతరం.. ఖమ్మం తోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గురు బిక్షమయ్యగారు మాట్లాడుతూ ధ్యాన ద్వారా మానవుడు ఎంతో సాధించగలడని పేర్కొన్నారు.ఆనందంలోనే అన్ని వుంటాయని పేర్కొన్నారు.
సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ బాబా అమృత వాక్కులు ఆధ్యాత్మిక చైతన్యం కలిగించగా.. ప్రకృతి ఉమా మహేష్, ఎల్లయ్య స్వామి తదితరులు సందేశాలు ఆధ్యాత్మికతను చాటాయి..
పెండ్లి శ్రీనివాస్ రెడ్డి వుందని సమర్పణతో ముగిసిన కార్యక్రమంలో మల్లాది శివ్వన్నారాయణ నిర్వహణలో జరిగిన కార్యక్రమం ఆధ్యాంతం అందరిని ఆకట్టుకుంది.
అనంతరం సత్యసాయి సేవా సమితి వార్షిక క్యాలెండర్ ను సభలో ఆవిష్కరించారు.

*ఔరా... అనిపించిన మాటల మరకత మణి ప్రాసమణి ప్రసంగం*
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి రజతోత్సవ వేడుకల్లో అన్నదాత ప్రాసమని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఒక వైపు స్త్రీమూర్తులపైన ప్రశంసలు, మరోవైపు హిందూ నాగరికత, సంప్రదాయలను కాపాడుకుందాం అంటూ సాగిన ప్రాసల ప్రసంగం ఔరా అనిపించింది..గురు బిక్షమయ్యా చెప్పిన ప్రతిమాట ఆణిముత్యాలే అంటూ అందరూ శ్రద్ధగా వాటిని పాటిస్తే ఆరోగ్యం.ఆనందం నిండుగా వుంటుందని చెప్పారు..  తన మాటలలో ప్రాసను నింపుతూ  పలికిన మాటలు తూటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి ..

@మణికుమార్ కొమ్మమూరు, ఖమ్మం (మొబైల్: 9032075966)

No comments:

Post a Comment