Sunday, 30 August 2020
తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు...
Friday, 28 August 2020
ఏకాంతంగా తిరుమల బ్రహ్మోత్సవాలు : టిటిడి
Thursday, 27 August 2020
బాలపూర్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు... గణేషునికి మొక్కిన శునకం...
Wednesday, 26 August 2020
కలేక్టర్ నిలబడ్డారు..సి.ఇ.ఓ.తో చర్చించినారు...
జమ్ములో శ్రీవారి ఆలయం.. స్థల పరిశీలన చెసిన టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి...
కరోనా వేళా కొత్త దందా... సర్టిఫికెట్లు ఇస్తాం... డోనేషన్ ఇవ్వండి....
Monday, 24 August 2020
Zest For Life Societyచే. విధ్యార్థినికి ఆర్థిక సాయం.. చదువులకై చేయుత నిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సీతారాం
Friday, 21 August 2020
,శ్రీశైలం ప్రమాదం పై సిఐడి విచారణ... ఆధికారుల మరణం బాధకరం ముఖ్యమంత్రి కేసీఆర్.
పొగ కారణంగా రెస్క్యూ టీం ముందుకు సాగలేకపోతోంది : మంత్రి జగదీష్ రెడ్డి
Thursday, 20 August 2020
ఎస్.పి.బి. .ఆరోగ్యానికి ప్రార్థిద్దాం : తలవై పిలుపు...
Tuesday, 18 August 2020
దేశవిదేశాల్లో ఈ "బాలు"డి ఆరోగ్యం పై ఆరా.. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు - పోష్టులు...
కలెక్టరే ఆమెకు వందనం చేశాడు.. మానవాత్వానికి, మహిళా ఎస్.ఐ.కు దక్కిన గౌరవం..
Monday, 17 August 2020
వేద నిలయం వ్యవస్థాపకుడు దంటు నాగార్జున శర్మ మృతి.. శర్మగారి ఆధ్వర్యంలోనే అయోధ్యకు వెండి ఇటుక.
వినాయక మండపాలకు, ఉత్సవాలకు అనుమతి లేదు..
ప్రజలంతా ఇండ్లలోనే వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్ విజ్ఞప్తి చేశారు.
*కరోనా కేసులు మరింత ఉదృతమవుతున్న క్రమంలో మరింత కఠినంగా నిబంధనలు చేయాల్సిన అవసరం వున్నందున బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో నవరాత్రుల కోసం వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దని ఏసీపీ సూచించారు. వినాయక చవితి పర్వదినోత్సవం క్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గణేష్ నవరాత్రులు నిర్వహించడానికి మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇప్పటికే పట్టణాల్లో విగ్రహాల తయారీ జరుగుతోంది. మరోవైపు మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితులు, కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో అన్ని స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఏసీపీ రహమాన్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ తో ఇప్పటికే జనజీవనం గందరగోళంలో పడినందున వినాయక మండపాల వద్ద నైవేద్యం, ప్రసాదాల వితరణ, భజన కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే వైరస్ మరింతగా వ్యాప్తిచెందే ప్రమాదముందని భావించి పోలీస్ శాఖ ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎట్టి పరిస్థితులలో నవరాత్రుల నిర్వహణకు పోలీస్ శాఖ నుండి అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు తమతో సహకరించాలని కరోనా కేసులు ఉధృతమవుతున్న నేపధ్యంలో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీస్ శాఖతో కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. వినాయక నవరాత్రులను ఈ ఏడాది ప్రజలంతా తమ తమ ఇండ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
Sunday, 16 August 2020
పర్యావరణ సంక్షోభ నివారణకు రంగంలోకి ఇండియా
Saturday, 15 August 2020
ఆత్మనిర్భర భారతం కోసం అడుగులు వేద్దాం. స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఉధ్ఘాటన.. ఏర్రకోట సంబరంలో అత్యాధునిక డ్రోన్ల పహారా... తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవం..
ఢిల్లీ/ఎర్రకోట: ఆత్మనిర్భర భారతం ఆవిష్కరణకై అడుగులు వెద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.. ఢిల్లీ ఏర్రకోటపై ఉదయం 7.30కి జాతీయ జెండాను 7వ సంవత్సరం ఆవిష్కరించిన మోదీ భారత్ మాతకు జై అంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని మోదీ... ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు.
వచ్చే రెండేళ్లూ సంకల్పంతో సాగుదామన్న ప్రధాని మోదీ... ఎంతో మంది త్యాగాల ద్వారా మనం ఇప్పుడు స్వాతంత్ర్యంతో ఉన్నామన్న మోదీ... సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ... ముందుకు సాగుదామన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని మోదీ... తద్వారా భారత్లో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
భారత్ అభివృద్ధి చెందితే.. విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి... విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని మోదీ... ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమన్న ప్రధాని మోదీ... భారత్లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.
దేశం ఏం చెయ్యాలన్నా చెయ్యగలదన్న ప్రధాని మోదీ... కరోనా సమయంలో ప్రపంచానికి కావాల్సినవి భారత్ అందిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్... మంత్రంతో మనం ముందుకు సాగుదామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్, బ్యాంకుల విలీనం, జన్ ధన్ ఇలా ఎన్నో మార్పు్ల్ని ఎవరూ ఊహించలేదన్న ప్రధాని మోదీ... చాలా మార్పులు వచ్చాయన్నారు.
వాజ్పేయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం మొత్తం రోడ్లు ఏర్పడ్డాయన్న ప్రధాని మోదీ... ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా... రోడ్లు, రైల్వే, విమాన ప్రయాణాలన్నీ సమృద్ధిగా సాగుతున్నాయన్నారు
ఇంటింటికీ కరెంటు, గ్యా్ర్, పేదలకు బీమా, సౌంచాలయాలు, రేషన్ దుకాణాల్లో టెక్నాలజీ... ఇలా ప్రతీదీ అందరికీ ప్రయోజనం కలిగేలా గత ఆరేళ్లుగా చేశామన్న ప్రధాని మోదీ... కరోనా కాలంలోనే పేదలకు గ్యాస్, రేషన్ వంటివి.. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందించామన్నారు. గరీబ్ కళ్యాణ్ ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించామన్న మోదీ... వోకల్ ఫర్ లోకల్ ద్వారా పేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు.మద్య తరగతి ప్రజల మేలు కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తున్నామన్న మోదీ... ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం, ఆధునిక భారత నిర్మాణానికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.
భీమ్ UPI ద్వారా ఏడాదిలో రూ.3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయన్న ప్రధాని మోదీ... ఇది దేశానికి గర్వ కారణం అన్నారు. గత ఐదేళ్లలో లక్షన్నర పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ డెవలప్ చేశామన్నారు. గ్రామాలను డిజిటల్ ఇండియాగా మార్చుతున్నామన్నారు. వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు అవుతుందన్నారు.
మహిళల అభివృద్ధి కోసం... వారి ఉద్యోగాల కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ... వాయు, నౌకాదళంలో కూడా మహిళలకు అవకాశాలు ఇస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించామన్న మోదీ... జన్ ధన్ యోజన ద్వారా... కరోనా కాలంలోనూ డబ్బులు ఇచ్చామన్నారు. ముద్ర లోన్ల ద్వారా ఆదుకున్నామన్నారు. 6 వేల జన ఔషధీ షాపుల్లో ఒక్క రూపాయికే శానిటైజర్ ప్యాడ్ అందిస్తున్నామన్నారు.
కరోనాకి ముందు దేశంలో ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ ఉండేదన్న మోదీ... ఇప్పుడు దేశంలో రోజూ 7 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని అన్నారు. నేడు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న ప్రధాని మోదీ... దాని ద్వారా ఆరోగ్య రంగంలో టెక్నాలజీని పెంచుతామన్నారు. దేశ ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఒక్కో హెల్త్ ఐడీ కార్డ్ ఇస్తామన్న మోదీ... దాన్లోనే ఆ వ్యక్తుల ఆరోగ్య వివరాలన్నీ ఉంటాయన్నారు. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయన్న మోదీ... వైద్య రంగంలో భారత్ ముందుందన్నారు. అతి త్వరలో భారతీయులకు వ్యాక్సిన్ వస్తుందన్నారు.
ఏడాది కాలంలో జమ్మూకాశ్మీర్, లఢక్ రూపురేఖలు మార్చామన్న ప్రధాని మోదీ... అభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.
అంతకు ముందు ప్రధాని మోదీ... బాపూ ఘాట్ దగ్గర... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు
*ఎర్రకోట పరేడ్ లోఅత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థ...
*స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద నిఘా వ్యవస్థ ఏర్పాటు*
*డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఈ రోజు ఎర్ర కోట సమీపంలో లో మోహరించారు. ఈ వ్యవస్థ 3 కిలోమీటర్ల వరకు మైక్రో డ్రోన్లను గుర్తించి జామ్ చేయగలదు. మరియు లేజర్ ఆయుధం యొక్క వాటేజ్ను బట్టి 1-2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని తగ్గించడానికి లేజర్ను ఉపయోగించవచ్చు*.
Friday, 14 August 2020
బాలు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రముఖుల ట్వీట్లు... కమాన్ మామా నాకు తెలుసు.. మీరు ఈ కరోనాతో ఫైట్ చేసి విన్ అయ్యి వస్తారని అంటూ తమన్ ట్వీట్
యాభై వయస్సుపైబడిన వారికి ఎక్సరే , రక్త పరీక్షలు నిర్వహణ తప్పనిసరి...
కపీలేశ్వరాలయంలో వైభవంగా లక్షకుంకుమ అర్చన
దర్శనాలు తిరిగి ప్రారంభం.
Thursday, 13 August 2020
వైయస్సార్ చేయూత ... అక్క చెల్లెమ్మలకు ఇంట ఆనందాల పంట -శైలజ చరణ్ రెడ్డి*
గోదావరిలో గోషించిన వేదం... కరోనాతో పనుల్లేక గోదావరిలో దూకిన వేదపండితుడు....
మీడియా ప్లీజ్ డోంట్ కాల్ మీ... నేను నా తండ్రి ఆరోగ్య సమాచారం కోసం మాత్రమే ఫోను వాడుతున్నాను.. ప్రణబ్ కుమార్తె షర్మీష్ట ట్వీట్
Wednesday, 12 August 2020
కేటీఆర్ పిలుపు..గాయత్రి రవి స్పందన... అధునాతన అంబులెన్స్లకు విరాళం అందజేత
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన " *గిఫ్ట్ ఎ స్మైల్* " పిలుపుకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *వద్దిరాజు రవిచంద్ర* (గాయత్రి రవి) స్పందించారు. రోగులను ఆపద సమయంలో ఆదుకునేందుకు అధునాతన సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గాయత్రి గ్రానైట్ సంస్థల తరపున ఒక అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. *20,50,000 ల చెక్కును* అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు....