మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన " *గిఫ్ట్ ఎ స్మైల్* " పిలుపుకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *వద్దిరాజు రవిచంద్ర* (గాయత్రి రవి) స్పందించారు. రోగులను ఆపద సమయంలో ఆదుకునేందుకు అధునాతన సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ లు విరాళంగా ఇవ్వాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గాయత్రి గ్రానైట్ సంస్థల తరపున ఒక అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. *20,50,000 ల చెక్కును* అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే ధర్మారెడ్డి పాల్గొన్నారు....
No comments:
Post a Comment