Saturday, 15 August 2020

ఆత్మనిర్భర భారతం కోసం అడుగులు వేద్దాం. స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఉధ్ఘాటన.. ఏర్రకోట సంబరంలో అత్యాధునిక డ్రోన్ల పహారా... తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వతంత్ర దినోత్సవం..


ఢిల్లీ/ఎర్రకోట: ఆత్మనిర్భర భారతం ఆవిష్కరణకై అడుగులు వెద్దామని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.. ఢిల్లీ ఏర్రకోటపై ఉదయం 7.30కి   జాతీయ జెండాను 7వ సంవత్సరం ఆవిష్కరించిన మోదీ భారత్ మాతకు జై అంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని మోదీ... ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు.       కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు. 

వచ్చే రెండేళ్లూ సంకల్పంతో సాగుదామన్న ప్రధాని మోదీ... ఎంతో మంది త్యాగాల ద్వారా మనం ఇప్పుడు స్వాతంత్ర్యంతో ఉన్నామన్న మోదీ... సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ... ముందుకు సాగుదామన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని మోదీ... తద్వారా భారత్‌లో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

భారత్ అభివృద్ధి చెందితే.. విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి... విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని మోదీ... ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమన్న ప్రధాని మోదీ... భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు.

దేశం ఏం చెయ్యాలన్నా చెయ్యగలదన్న ప్రధాని మోదీ... కరోనా సమయంలో ప్రపంచానికి కావాల్సినవి భారత్ అందిస్తోందన్నారు. వోకల్ ఫర్ లోకల్... మంత్రంతో మనం ముందుకు సాగుదామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్, బ్యాంకుల విలీనం, జన్ ధన్ ఇలా ఎన్నో మార్పు్ల్ని ఎవరూ ఊహించలేదన్న ప్రధాని మోదీ... చాలా మార్పులు వచ్చాయన్నారు.

వాజ్‌పేయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం మొత్తం రోడ్లు ఏర్పడ్డాయన్న ప్రధాని మోదీ... ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా... రోడ్లు, రైల్వే, విమాన ప్రయాణాలన్నీ సమృద్ధిగా సాగుతున్నాయన్నారు

ఇంటింటికీ కరెంటు, గ్యా్ర్, పేదలకు బీమా, సౌంచాలయాలు, రేషన్ దుకాణాల్లో టెక్నాలజీ... ఇలా ప్రతీదీ అందరికీ ప్రయోజనం కలిగేలా గత ఆరేళ్లుగా చేశామన్న ప్రధాని మోదీ... కరోనా కాలంలోనే పేదలకు గ్యాస్, రేషన్ వంటివి.. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందించామన్నారు. గరీబ్ కళ్యాణ్ ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించామన్న మోదీ... వోకల్ ఫర్ లోకల్ ద్వారా పేదలకు స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తున్నామన్నారు.మద్య తరగతి ప్రజల మేలు కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తున్నామన్న మోదీ... ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం, ఆధునిక భారత నిర్మాణానికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.

భీమ్ UPI ద్వారా ఏడాదిలో రూ.3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయన్న ప్రధాని మోదీ... ఇది దేశానికి గర్వ కారణం అన్నారు. గత ఐదేళ్లలో లక్షన్నర పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ డెవలప్ చేశామన్నారు. గ్రామాలను డిజిటల్ ఇండియాగా మార్చుతున్నామన్నారు. వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు అవుతుందన్నారు.

మహిళల అభివృద్ధి కోసం... వారి ఉద్యోగాల కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ... వాయు, నౌకాదళంలో కూడా మహిళలకు అవకాశాలు ఇస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించామన్న మోదీ... జన్ ధన్ యోజన ద్వారా... కరోనా కాలంలోనూ డబ్బులు ఇచ్చామన్నారు. ముద్ర లోన్ల ద్వారా ఆదుకున్నామన్నారు. 6 వేల జన ఔషధీ షాపుల్లో ఒక్క రూపాయికే శానిటైజర్ ప్యాడ్ అందిస్తున్నామన్నారు.

కరోనాకి ముందు దేశంలో ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ ఉండేదన్న మోదీ... ఇప్పుడు దేశంలో రోజూ 7 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని అన్నారు. నేడు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న ప్రధాని మోదీ... దాని ద్వారా ఆరోగ్య రంగంలో టెక్నాలజీని పెంచుతామన్నారు. దేశ ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఒక్కో హెల్త్ ఐడీ కార్డ్ ఇస్తామన్న మోదీ... దాన్లోనే ఆ వ్యక్తుల ఆరోగ్య వివరాలన్నీ ఉంటాయన్నారు. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయన్న మోదీ... వైద్య రంగంలో భారత్ ముందుందన్నారు. అతి త్వరలో భారతీయులకు వ్యాక్సిన్ వస్తుందన్నారు.

ఏడాది కాలంలో జమ్మూకాశ్మీర్, లఢక్ రూపురేఖలు మార్చామన్న ప్రధాని మోదీ... అభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

అంతకు ముందు ప్రధాని మోదీ... బాపూ ఘాట్ దగ్గర... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు

*ఎర్రకోట పరేడ్ లోఅత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థ...

*స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద నిఘా వ్యవస్థ ఏర్పాటు*

*డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఈ రోజు ఎర్ర కోట సమీపంలో  లో మోహరించారు. ఈ వ్యవస్థ 3 కిలోమీటర్ల వరకు మైక్రో డ్రోన్‌లను గుర్తించి జామ్ చేయగలదు. మరియు లేజర్ ఆయుధం యొక్క వాటేజ్‌ను బట్టి 1-2.5 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని తగ్గించడానికి లేజర్‌ను ఉపయోగించవచ్చు*.

1 comment: