Friday, 28 August 2020

ఏకాంతంగా తిరుమల బ్రహ్మోత్సవాలు : టిటిడి

తిరుమల : కరోనా..తిరుమల ఉత్సవాలను కట్టడి చేస్తోంది.. ఫిబ్రవరి నెలలో రధసప్తమి ఆశేష భక్తజనుల ఏదుట వైభవంగా నిర్వహించిన టిటిడి..మార్చి నెలలో కరోనా ప్రబలకుండా కేంద్రం లాకౌట్ ప్రకటించిన నాటి నుండి పలు ఉత్సవాలు ఏకంతంగా నిర్వహిస్తోంది.. ఉగాది. ప్రతి పౌర్ణమికి జరిగే గరుడ సేవ తదితర వేడుకలను ఏకాంతంగా నిర్వహించారు. నిత్యకళ్యాణోత్సవం సైతం ఉభయదాతలు లేకుండా ఆలయ అర్చకులు మాత్రమే నిర్వహిస్తున్నారు.. తాజాగా సెప్టెంబర్ 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా‌నే నిర్వహించాలని నిర్ణయించాలని పాలక‌మండలి‌ సమావేశం నిర్ణయించింది .దీంతో బ్రహ్మోత్సవాలు ఆలయంలోని అస్థానమండపంలోనే నిర్వహించుతారు..కాగా ఈ ఏడాది అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది..అక్టోబర్ లో‌ జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాారు.
శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు..బాంబేలో దేవాలయం నిర్మాణం కు శ్రీకారం చుట్టుతామన్నారు..
వారణాసీలో దేవాలయ నిర్మాణంకు అక్కడి ప్రభుత్వంను స్దలం కేటాయింపు అనుమతులు కోరినట్లు ఛైర్మన్ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లలో ‌ ఆలయం నిర్మాణానికి ఇప్పటికే స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే నని దేశవ్యాప్తంగా టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వరుని ఆలయాలను నిర్మాణం జరుపి భక్తులకు ఆనందం కలిగించే ప్రయత్నం సాగుతోందని ఎస్.వి.సుబ్బారెడ్డి తెలిపారు.. కరోనా వల్ల కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగానే విరాళాలు సేకరించి అక్కడ ఆలయాలు నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు
ప్రధానంగా టిటిడిలో ఆదాయం పెంచేందుకు సమావేశంలో  కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు..
ఫిక్స్డ్ డిపాజిట్లు పై కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు తీసుకురానున్నామని
బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్న‌ పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నట్లు..ఇప్పటికే
వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేసినట్లు కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఎస్.వి.తెలిపారు. 4.95 కొట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణంకు చేపట్టబోతున్నమని..
టీటీడీ ఉద్యోగులకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జప్తీ చేశామన్నారు.
కోవిడ్ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలలో బుక్ చేసుకున్న భక్తులకు
ఉదయస్తమాన సేవలు బుక్ చేసుకున్న భక్తులకు విఐపి బ్రేక్ సేవ‌కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం..
వేస్ట్ వెట్ మ్యానేజ్ మెంట్, డ్రైవ్ మ్యానేజ్ మెంట్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాం..

సుధానారాయణ మూర్తి కోటి రూపాయలు డినేషన్ ఇస్తాంమని ప్రకటించారు..

కంపోస్టు ఎరువును ఉచితంగా రైతులకు  ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం..

 గోవు సంరక్షణపై పాలక మండలిలో చర్చించాం..ప్రతి ఆలయం వద్ద ఓ గోమాత ఉంచాలని నిర్ణయించాం..

గోవదకు అరికట్టడానికి చర్యలు తీసుకోవాల‌ని ప్రభుత్వంకు నివేదిక పంపిస్తాం..

గోల్డు, క్యాష్ డిపాజిట్లు సంబంధించి అధిక వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీ చేసాం..

ప్రతి నెల డిపాజిట్ పై వడ్డీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం..

తిరుపతిలో రేపటి నుండి మూడు వేల ఉచిత దర్శన టోకెన్స్ జారీని తిరిగి‌ ప్రారంభిస్తున్నాం..

త్వరలోనే ఆన్లైన్ లో సర్వదర్శనం టోకెన్లను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం

*-వైవీ సుబ్బారెడ్డి.., టీటీడీ పాలకమండలి ఛైర్మన్*

No comments:

Post a Comment