Wednesday, 5 August 2020

సీతారాములు జగతికి ఆదర్శం... సామరస్యంతో ముందుకు సాగుదాం : వెంకయ్యనాయుడు.

శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగిన వెళ్లా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గృహంలో సీతారాముల పటాలకు పూలమాలలు వేసి శ్రీరాముని స్తోత్రాలు చదివారు.. ఈ సందర్భంగా హిందూ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి. హిందూ.. ముస్లింలు సోదరభావంతో ముందుకు సాగడం దేశ అభివృద్ధి కి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఆయోధ్య ఆలయ నిర్మాణం  పురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్యం, నైతికత, సౌభ్రాతత్వం వంటి ఆదర్శ విలువలకు పున:పట్టాభిషేకం చేయడమని భావిస్తున్నాన్నట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు పాటించిన శ్రేష్ఠమైన, ఆదర్శవంతమైన జీవితం.. సమాజంలోని సామాన్యులు, ఉన్నతవర్గాలవారు అనే భేదభావాల్లేకుండా ప్రజలందరికీ అనుసరణీయంగా ఉండేవని. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయి. ఇవి మత, ప్రాంత విభేధాల్లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనవి. ఆ విలువలు కాలాతీతమైనవి, నేటికీ సందర్భోచితమైనవి.
రామమందిర నిర్మాణాన్ని ఒక మతపరమైన కార్యక్రమంగా కాక, ఆ ఆలోచనా పరిధుల్ని దాటి మరింత విస్తృతమైన అంశంగా చూడాలని ఆయన సూచించారు. ఈ మందిరం ఉన్నతమైన, సనాతనమైన మానవ విలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని  ఎలాంటి వివక్షకు తావులేకుండా మనమంతా ఒకటని తెలిపే  భారతీయ నైతిక విలువలను మనకు నిరంతరం గుర్తుచేస్తుంటుందని. 
అలాంటి అద్భుతమైన ప్రాధాన్యత గల రామమందిరానికి ఆగస్టు 5న జరిగే భూమిపూజ.. భారతీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై శ్రీ రాముడు పాటించిన విలువల వైభవాన్ని కళ్ళకు కడుతూనే ఉంటుందని .  అభిప్రాయం .  వ్యక్తం చేశారు.. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ వివాదంలో.. న్యాయ, శాంతిపూఊర్వక పరిష్కారంలో భాగస్వాములైన కక్షిదారులందరికీ పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నాను. వారందరి సామూహిక కృషికారణంగానే మందిర నిర్మాణం సాధ్యమైంది. 
ఈ సందర్భంగా అయోధ్య స్థల వివాదంలో కక్షిదారుగా ఉన్నటువంటి శ్రీ ఇక్బాల్ అన్సారీ (దివంగత శ్రీ హషీమ్ అన్సారీ  కుమారుడు)ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రతి ఒక్కరూ గతాన్ని మరచి ముందుకు సాగాలని ప్రజలందరికీ వారు గొప్పమనుసుతో చేసిన విజ్ఞప్తి అభినందనీయం. 
ఇంతటి చారిత్రకమైన ఈ రోజును.. అన్ని విశ్వాసాల పట్ల పరస్పర గౌరవం, సామరస్యపూర్వక జీవనంతో కూడిన..  కొత్త శకానికి నాందిగా భావించి ముందుకెళ్దాం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని కోరుకుందాం.
ఈ సందర్భంగా, జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచించినట్లుగా.. ప్రజాస్వామ్య, ధర్మబద్ధమైన ఆదర్శాలతో ప్రజా శ్రేయస్సును, సమాజంలో ఆనందాన్ని ప్రతిబింబించే, సమాజంలో అందరికీ శాంతిసామరస్యాలు, సమానత్వాన్ని కల్పించే రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదామని ప్రతినబూనుదామంటూ ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు..

No comments:

Post a Comment